
నేటి నుంచి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు
అరకులోయ టౌన్: నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాల్లో నిర్వహించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్క నాటారు. కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 8వ తేదీ సాయంత్రం శ్రీ స్వామి వారి కల్యాణం, 9న పండిత గోష్టి, వేదపఠనం, 10న ఉత్సవ మూర్తుల ఊరేగింపు, 17న అన్నసమారాధన (నారాయణ సేవ) ఉంటుందని వారు పేర్కొన్నారు. 8నుంచి 10వ తేదీ వరకు మూడురోజుల పాటు స్టేజ్–1, స్టేజ్–2లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్టు వారు పేర్కొన్నారు.
ఏర్పాట్లు పూర్తి
పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మత్స్యలింగం, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు

నేటి నుంచి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాలు