
ఉత్తమ సేవలకు పురస్కారం
రంపచోడవరం : ఏజెన్సీ ప్రాంతంలో ఉత్తమ సేవలు అందిస్తున్న రామకృష్ణ మఠం గిరిజన సంచార వైద్యశాల కో–ఆర్డినేటర్ కానుమోను శ్రీనివాసరావు, గంగవరం గ్రామానికి చెందిన విశ్రాంత హెచ్ఎం, రచయిత, కళాకారుడు నరసింహమూర్తి పట్నాయక్ మాస్టారు శోభిత్ వర్మ స్మారక పురస్కారాలు అందుకున్నారు. ఈ మేరకు రాజమండ్రిలో ఎస్.వి.కళాకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చల్లగాలి శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయా పురస్కారాలను కానుమోను శ్రీనివాసరావు, నరసింహమూర్తి పట్నాయక్ తదితరులకు రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు అందజేశారు. వారిని పలువురు అభినందించారు. సుబ్బారావు, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, శిష్టకరణ సంఘం నాయకులు సూర్యప్రకాశరావు, సాయిబాబా, శ్రీనివాసరావు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.