
వైభవంగా మోదమ్మ ఉత్సవాలు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తులు ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఉత్సవ,ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సూచించారు. బుధవారం ఆయన మోదకొండమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11,12,13తేదీలో మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు ఉత్సవ కమిటీ ఆయా ఏర్పాట్లలో నిమగ్నమైందన్నారు.ఉత్సవాల మూడు రోజులు మోదమ్మకు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామననఆరు.పాడేరు పట్టణమంతా విద్యుదీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పలాసి కృష్ణారావు, ఆర్.నాగభూషణం, వంజంగి కాంతమ్మ, కొణతాల ప్రశాంత్, కూడా సురేష్కుమార్, కేజియారాణి, సల్లా రామకృష్ణ, లకే రత్నాబాయి, మోద స్వరూప పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
విజయవంతం చేయాలి
ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు