నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం

May 7 2025 1:19 AM | Updated on May 7 2025 1:19 AM

నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం

నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం

వీఆర్‌పురం: పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని పోలవరం అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి అభిషేక్‌, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌ తెలిపారు. మండల కేంద్రం వీఆర్‌ పురంలో మంగళవారం నిర్వహించిన ఆర్‌అండ్‌ ఆర్‌ గ్రామ సభలో వారు మాట్లాడారు. ఈ సభలో అర్హులు, అనర్హుల జాబితాను నిర్వాసితుల సమక్షంలో చదివి వినిపించారు. వీఆర్‌పురం మండల కేంద్రంలో మొత్తం 1,704 పీడీఎఫ్‌లను గుర్తించగా వారిలో 1,481 మందిని అర్హులుగా, 223 మందిని అనర్హులుగా గుర్తించినట్టు చెప్పారు. గ్రామసభ జరిగిన నాటి నుంచి 15 రోజుల వ్యవధిలో అనర్హులు పూర్తి ఆధారాలతో దరఖాస్తు చేస్తే విచారణ జరుపుతామని చెప్పారు. పోలవరం నిర్వాసితుల వద్దనుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు వివరణ ఇవ్వనున్నట్టు చెప్పారు. నిర్వాసితులకు ఏమైనా అభ్యంతరాలు దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీకలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement