
సహకార సంఘాలపురోగతికి చర్యలు
● జిల్లా సహకార అధికారి రామకృష్ణ
పాడేరు : జిల్లాలో సహకార సంఘాల పురోగతికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా సహకార అధికారి ఎంవీ రామకృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా సహకార సంఘ కార్యాలయంలో జిల్లాలోని 22 మండలాల పీఏసీఎస్ సీఈవోలు, సహకార శాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పీఏసీఎస్లో కంప్యూటరైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ సహకార సంఘం వ్యాపార అభివృద్ధికి ప్రణాళిక పరమైన చర్యలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ (రాజమండ్రి) ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, రిటైర్డ్ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.