
మోదమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం
సాక్షి,పాడేరు: ఈనెల 11,12,13 తేదీల్లో జరగనున్న పాడేరు మోదకొండమ్మతల్లి ఉత్సవాలను ముందస్తు చర్యలతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో తొక్కిసలాట లేకుండా భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించేలా అఽధికార బృందం, కమిటీ సభ్యులు సహకరించాలని ఆయన సూచించారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని, 24గంటలూ విద్యుత్ సరఫరా జరగాలని, పారిశుధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని ఆదేశించారు. అశ్లీలతకు తావు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వీవీఐపీల సందర్శన ముందుగానే తెలుసుకుని ప్రొటోకాల్ ప్రకారం దర్శనం కల్పించాలన్నారు. సీ్త్ర,శిశు రక్షణతో పాటు సెంట్రల్ కంట్రోల్రూమ్ను ఏర్పాటు చేసి పోలీసు, రెవెన్యూ, నీటి సరఫరా, పంచాయతీ, ఐఅండ్ పీఆర్,తదితర శాఖలను డిప్యూట్ చేయాలని ఆదేశించారు. ఉత్సవాల మూడు రోజు లు పట్టణానికి బయట పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని, స్కౌట్స్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వలంటీర్లుగా హాజరై పోలీసుశాఖ, ఆలయ కమిటీకి సహకరించాలని ఆయన కోరారు. ఈనెల 10వ తేదీ నుంచి ఉత్సవాలు ముగిసే 13వ తేదీ వరకు పట్టణంలోని మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఉత్సవాలు జరిగే మూడు రోజుల్లోను రవాణాకు సంబంధించి అన్ని భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వ్యాపారులంతా అవసరమైన సరుకులను ముందుగానే తెప్పించుకోవాలన్నారు. ఇంటిముందు దుకాణాలు వేసే వ్యాపారులకు గృహ విద్యుత్ను సరఫరా చేస్తే సంబంధిత యజమానిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్పీ అమిత్బర్దర్, జేసీ డాక్టర్ ఎం.జే.అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్, డీఆర్వో పద్మలత, ఎస్డీసీ లోకేశ్వరరావు, డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొణతాల ప్రశాంత్, కూడా సురేష్కుమార్, కేజీయారాణి, సల్లా రామకృష్ణ, బేరా నాని, తమర్భ ప్రసాద్నాయుడు, మత్స్యకొండబాబు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్కుమార్
అధికారులు, ఉత్సవ కమిటీ
ప్రతినిధులతో సమావేశం

మోదమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం