
గతంలో పొగాకు కొనుగోలు ఇలా..
శబరి, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పండే లంకపొగాకు(నాటుపొగాకు)కు ఇతర రాష్ట్రాల్లో సైతం మంచి గిరాకీ ఉంది. నదీ పరీవాహక లంకల్లో పండించిన పొగాకుతో తయారుచేసిన చుట్టలను కాల్చేందుకు పలువురు ధూమపాన ప్రియులు అమితంగా ఇష్టపడతారు. గతంలో ఈ ప్రాంతంలో లంకపొగాకు పండించిన రైతులు పక్వానికి వచ్చిన తరువాత వాటిని కాండంతో సహాకోసి కిత్తనారతో కుట్టి పాకలపై ఆరబెట్టేవారు. పొగాకు పూర్తిగా ఎండిన తరువాత తాటాకు బుట్టల్లో 30 కిలోల చొప్పున కట్టేవారు. మూడు బుట్టలను పుట్టిగా, ఎనిమిది పుట్లను( 24 బుట్టలు) గరిసెగా పిలుస్తారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారులు.. రైతుల వద్దకు వచ్చి సరకును పరిశీలించి కొనుగోలు చేసేవారు. నగదు కాస్త ఆలస్యంగా ఇచ్చినా చేసేదిలేక రైతులు తీసుకునేవారు.