
108 వాహనంలో ఆస్పత్రికి బాలుడిని తరలిస్తున్న కుటుంబ సభ్యులు
హుకుంపేట: మండలంలోని మత్యపురం గ్రామంలో బాలుడికి విద్యుత్ తీగ తగిలి తీవ్ర గాయలయ్యాయి. గ్రామానికి చెందిన జి.సుమతి, బొజ్జన్న కుమారుడు అజయ్ (11) మంగళవారం ఇక్కడ పెదగరువు వంతెన సమీపంలో తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా విద్యుత్ తీగ తగిలి షాక్ కు గురయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో కు టుంబ సభ్యులు 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించా రు. అక్కడ నుంచి విశాఖ కేజీహెచ్కు తరలించా రు. హుకుంపేట ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. ప్ర స్తు తం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పెదగరువు వంతెన సమీపంలో విద్యుత్ తీ గలు కిందకు వేలాడుతున్నాయని, సంబంధిత అ ధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.