కై లాస్నగర్: ఆదిలాబాద్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. పట్టణంలోని సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎల్టీ ఓంప్రకాశ్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా అల్లూరి భూపతిరెడ్డి, ఉపాధ్యక్షులుగా బోరంచు శ్రీకాంత్రెడ్డి, ముడుపు కేదారీశ్వర్రెడ్డి, సింగడి పద్మరెడ్డి, కోశాధికారిగా సర్సన్ విట్టల్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రమేశ్రెడ్డి, ప్రమోద్రెడ్డి, కోప్రెసిడెంట్లుగా గోవర్ధన్ రెడ్డి, మనిలతా రెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి నూతన కార్యవర్గాన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.


