యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం

May 7 2026 7:50 AM | Updated on May 7 2026 7:50 AM

ఆదిలాబాద్‌రూరల్‌: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం జాబ్‌ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా, ప్రైవేటు రంగంలో ఉన్న అవకాశాలను ద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలన్నారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఇందులో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష, ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్‌, ఉపాధి కల్పన అధికారి మిల్కా, నిరుద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement