కైలాస్నగర్: జెడ్పీ సీఈవోగా బి.రవి సో మవారం జిల్లా పరి షత్ కార్యాలయ చాంబర్లో బాధ్యతలు స్వీకరించా రు. హన్మకొండ జెడ్పీ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్న ఈయనకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేసింది. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన ఈయనకు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రెగ్యులర్ అధికారి రాకతో ఏడు నెలలుగా కొనసాగిన ఇన్చార్జి పాలనకు తెరపడింది. అనంతరం కలెక్టర్ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.


