ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి

Apr 11 2026 8:04 AM | Updated on Apr 11 2026 8:04 AM

కైలాస్‌నగర్‌(బేల): ప్రభుత్వ పథకాలను ప్రజ లకు చేరవేయాలని ఎంపీ నగేశ్‌ అన్నారు. బీజే పీ చేపట్టిన పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌లో భాగంగా శుక్రవారం బేల, జైనథ్‌, భోరజ్‌, సాత్నాల మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంత్యోదయ సిద్ధాంతం ద్వారా సమాజంలో చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు చేరేలా చేయడం పార్టీ లక్ష్యమని తెలిపారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, మోహన్‌ అగర్వాల్‌, క్రాంతి కుమార్‌, రాకేశ్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement