కైలాస్నగర్: పట్టణంలో పారిశుద్ధ్యనిర్వహణ, తాగు నీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహించాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. శనివారం ఉదయం 5 గంటలకు కార్యాలయానికి చేరుకుని శానిటేషన్ వ ర్కర్స్, వాటర్ సెక్ష న్లో రిజిస్టర్లను పరిశీలించారు. ఆయా విభాగాల్లో ఎంతమంది సెలవులో ఉన్నారనే విషయంపై ఆరాతీశారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో శా నిటేషన్ కార్మికుల పాత్ర కీలకమన్నారు. ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు. వేసవి ప్రారంభమైనందున ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించా రు. ఆమె వెంట మున్సిపల్ మాజీ ఫ్లోర్లీడర్ సతీశ్ తదితరులున్నారు.


