
వంద సీట్లు గెలుస్తాం
నిర్మల్/ఖానాపూర్: సంక్షేమమే ప్రధాన ధ్యే యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ధీమా పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 100 సీట్లు గెలుచి మళ్లీ అధికా రంలోకి వస్తామని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సీట్లూ కైవసం చేసుకుంటా మని ధీమా వ్యక్తంజేశారు. ఏఐసీసీ రాష్ట్ర వ్య వహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క తది తరులతో ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జనహిత పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించా రు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే రాష్ట్రంలో ఆరుగ్యారంటీలు,ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం లాంటి హామీలు అమలు చే స్తున్నామని చెప్పారు. తాముఏసీల్లో కూర్చో కుండా తమనేత రాహుల్గాంధీ చెప్పినట్లు ప్రజల్లో ఉండేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఆదిలాబాద్ జిల్లాను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలా బాద్ ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఇన్చార్జి మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామన్నారు.
ఆదివాసీలతో అనుబంధం ఉంది : మీనాక్షి
మళ్లీ తనకు జన్మంటూ ఉంటే ఆదివాసీగానే పుట్టాలని కోరుకున్న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలు, ప్రజలతో ఎప్పుడూ దగ్గరగా ఉంటే వారి సమస్యలు ఎక్కువగా పరిష్కరించవచ్చన్న తమనేత రాహుల్గాంధీ ప్రేరణతో కాంగ్రెస్ప్రభుత్వం పని చేస్తోందని పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. తనకు ఆదివాసీలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్తోనూ అనుబంధం ఉందని పేర్కొన్నారు. గతంలోనూ సర్వోదయ యాత్రలో భాగంగా ఆదిలాబా ద్కు వచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆదివాసీ సమాజం నుంచి మంచితనాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. జల్, జంగల్, జమీ న్ కోసం పోరాడిన ఆదివాసీలే తమకు స్ఫూర్తి అన్న రాహుల్ ఆశయాలతోనే ముందుకు సాగుతామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీసులు, గిరిజనుల అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉంద ని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రా ష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరో పించారు. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. బనకచర్లపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంద ని, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. మన నీళ్లను ఆంధ్రప్రదేశ్కు దోచిపెట్టారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు చిలుకపలుకులు పలుకుతున్నారని,గతంలో మూడు రాష్ట్రాలను ఇచ్చి, తెలంగాణకు మొండిచే యి చూపారని ఆరోపించారు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీ, బీఆర్ఎస్కు లేదని, దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ శ్రీ రామ రక్ష అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా పై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి పెట్టిందని, అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చె ప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎలా దోపిడీ జరిగిందో, ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పని చేస్తోందో ప్రజలకు తెలుపుతూ.. సమస్యలు పరిష్కరించేందుకేజనహిత పాద యాత్ర చేపట్టినట్లు తెలిపారు. బీఆర్ఎస్ దోపిడీకి పాల్పడితే, బీజేపీ ప్రజల్లో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రేషన్కార్డులు ఇస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామ ని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ముందుకు సాగి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. పదేళ్ల కేసీఆర్ పా లనలో జీవోలే తప్పా పైసలు ఇవ్వలేదని, అభివృద్ధికి నోచుకోలేదని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి ఎద్దేవా చేశారు. గత సీఎం కేసీఆర్కు ఎన్నిసార్లు విన్నవించినా సదర్మట్ మినీబ్యారేజీ నుంచి ప్రత్యేక కాలువ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే రేఖానా యక్ మండిపడ్డారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమంద్ అలీ, కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, నా యకులు అల్లూరి మల్లారెడ్డి, ఆడె గజేందర్, కంది శ్రీనివాస్, బొంత రామ్మోహన్, నారా యణరావుపటేట్, పడిగెల భూషణ్, ఎంఏ మజీద్, దయానంద్, తోట సత్యం, చిన్నం సత్యం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రెండోసారి అధికారంలోకి వస్తాం..
పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్
ఖానాపూర్లో ‘జనహిత’ పాదయాత్ర
భారీగా తరలివచ్చిన నేతలు, శ్రేణులు
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి, పలువురు మంత్రులు హాజరు