నాగోబాను దర్శించుకున్న ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

నాగోబాను దర్శించుకున్న ఎస్పీ

Jul 30 2025 8:31 AM | Updated on Jul 30 2025 8:31 AM

నాగోబాను   దర్శించుకున్న ఎస్పీ

నాగోబాను దర్శించుకున్న ఎస్పీ

ఇంద్రవెల్లి: నాగుల పంచమి సందర్భంగా కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, ఏఎస్పీ కాజల్‌సింగ్‌తో కలిసి దర్శించుకున్నారు.మెస్రం వంశీయులు వారిని సన్మానించారు. నాగోబా ప్రతిమలు అందజేశారు.

మహిళల సమస్యలపై శ్రద్ధ వహించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళల సమస్యలపై ప్రత్యే క శ్రద్ధ వహించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని మహిళా పోలీసు స్టేషన్‌తోపాటు టూటౌన్‌ను మంగళవారం తని ఖీ చేశారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో గౌరవంగా మెదలాలని సూచించారు. వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పట్ట ణంలో ఓపెన్‌డ్రింక్‌ జరగకుండా గస్తీ నిర్వహించాలన్నారు. మట్కా, గుట్కా, గంజాయి, ఇత ర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఎస్పీ వెంట ఆదిలా బాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి, టూటౌన్‌ సీఐ కరుణా కర్‌రావు, మహిళా స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement