
బాధితులకు కలెక్టర్ పరామర్శ
● రిమ్స్లో అపరిశుభ్రతపై అసహనం ● వైద్యులు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం
ఆదిలాబాద్టౌన్: పిడుగుపాటుకు గురై రిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ రాజర్షి షా శనివారం పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకుని వారి ఆరోగ్య స్థితిగతులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యమందించి త్వరగా కొలుకునేలా చూడాలన్నారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డులోని మరుగుదొడ్లను పరిశీలించారు. అక్క డ అపరిశుభ్రంగా ఉండటంతో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సమయానికి వస్తున్నారా లేదా అని సిబ్బందిని ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను ఆదేశించారు. ఆయన వెంట డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.