
సలహాలిచ్చి.. చైతన్యపరిచి
తక్కువ మోతాదులో వాడాలి
సాగులో రసాయన ఎరువుల మోతాదు తగ్గించుకుంటే పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రధానంగా యూరియాను ఎక్కువ వినియోగించొద్దు. పంట మార్పి డి పద్ధతితో సుస్థిర ఆదాయం పొందవ చ్చు. విత్తనాల కొనుగోలులో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించాం.
– డాక్టర్ రాంప్రసాద్, శాస్త్రవేత్త,
వ్యవసాయ పరిశోధన కేంద్రం
ఆదిలాబాద్అర్బన్: అన్ని రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న వ్యవసాయ రంగం మాత్రం ఆ దిశగా ముందుకు సాగడం లేదు. ఇందుకు కార ణం సాగుపై రైతులకు అవగాహన లేకపోవడమేనని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వానాకాలం సాగుకు ముందే అన్నదాతలను సంసిద్ధం చేయాలనే ఆలోచనతో శాస్త్రవేత్తల బృందాలను నేరుగా గ్రామాలకు పంపించి అవగాహన సదస్సులు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం మే 5న ప్రారంభం కాగా, శుక్రవారంతో ముగిసింది.
రైతులతో నేరుగా..
కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లోని రైతులతో నేరుగా శాస్త్రవేత్తలు చర్చలు జరిపారు. వ్యవసాయ అధికారులతో పాటు కృషి విజ్ఞానకేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సంయుక్తంగా రెండేసి బృందాలుగా ఏర్పడి రోజుకో గ్రామాన్ని సందర్శిస్తూ రైతులతో సమావేశమయ్యారు. సాగుపై సలహాలు, సూచనలు ఇస్తూ, వారికున్న సందేహాలను నివృత్తి చేశారు. రైతుల చెప్పిన విషయాలను సైతం నమో దు చేసుకున్నారు. రసాయన ఎరువులు మోతాదులోవినియోగించడం, పంటలమార్పిడి, పత్తి, సో యా, మొక్కజొన్న, జొన్న తదితర పంటల వ్యర్థాలను పొలాల్లో కాల్చకుండా ఏ విధంగా తీసివేయాలనే దానిపై అవగాహన కల్పించారు. విత్తనాలు కొనుగోలు సమయంలో ఏ అంశాలు పరిశీలించాలి.. కొన్న తర్వాత రశీదు, ప్యాకెట్లను భద్రపర్చుకోవడం, పొలంగట్లపై మొక్కలు నాటడం, తదితర విషయాలను వివరించారు. ప్రధానంగా యూరి యా అధిక వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. నేల సారవంతం, పర్యావరణం, మానవ ఆరోగ్యంపై చూపే ప్రతి కూల ప్రభావాలను వివరించారు. ఈ సమావేశాలు జిల్లాలో ఆరు వారాల పాటు కొనసాగాయి.
రైతులతో నేరుగా సమావేశాలు వానాకాలం సాగుపై సందేహాల నివృత్తి ఆరు వారాల పాటు అవగాహన కార్యక్రమాలు ముగిసిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’
జిల్లాలో..
నిర్వహించిన అవగాహన సదస్సులు : 52
పాల్గొన్న రైతులు : 2,600