
అమ్మ పేరిట ఓ మొక్క..
కైలాస్నగర్: పట్టణప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ‘అమృత్ మిత్ర’ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా మొక్కలు నాటించే కార్యక్రమానికి (ఉమెన్ ఫర్ ట్రీస్) శ్రీకారం చుట్టింది. అమ్మ పేరిట ఒక మొ క్క నాటండి (ఏక్ పేడ్ మాకా నామ్ పే)నినాదంతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా ఆది లాబాద్ మున్సిపల్ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో రెండు స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేశా రు. మూడు స్థలాలను పరిశీలించారు. జూన్ 5 నుంచి ఆయా ప్రాంతాల్లో మొక్కలునాటనున్నారు.
చెరువు పరిసరాల్లో పచ్చదనం ఉట్టిపడేలా...
పచ్చదనం క్రమేణ కనుమరుగవుతుండటంతో పట్ట ణ ప్రాంతాల్లో ఎండతీవ్రత అధికమవుతుంది. ము ఖ్యంగా వేసవిలో వీచే వడగాలులతో జనం తీవ్ర ఇ బ్బందులు పడాల్సిన పరిస్థితి. సమస్యను గుర్తించి న కేంద్రం పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటాలని సంకల్పించింది. అమృత్మిత్రలో భాగంగా మున్సి పల్ పరిధిలోని చెరువుల వద్ద విమెన్స్ ఫర్ ట్రీస్ కా ర్యక్రమాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందు కోసం పట్టణ పరిధిలోని రెండు స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేశారు. ఖానాపూర్ కాలనీకి చెందిన వినాయక, తిర్పెల్లికి చెందిన శారదామాత గ్రూపులకు సంబంధించి 20 మంది సభ్యులను ఎంపిక చేశారు. వీరికి మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకోసం వారికి కొంత మొత్తం కూడా అందజేయనున్నారు. ఎంత నగదు చెల్లిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. చెరువు కట్టల వద్ద భారీ వృక్షాలుగా ఎదిగే తబిబుయా, వేప, రాగి, కదంబ, మర్రి వంటి వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షించనున్నారు. చెరువుల రక్షణతో పాటు హరితవనాలుగా వాటిని తీర్చిదిద్దనున్నారు.
స్థలాల ఎంపిక పూర్తి...
ఆదిలాబాద్లోని ఖానాపూర్ చెరువును మొక్కలు నాటేందుకు ఎంపిక చేశారు. 70ఎకరాల్లో ఈ చెరు వు విస్తరించి ఉంది. దానిచుట్టూ మొక్కలు నాటేందుకు వీలుగా ఎంపిక చేసిన సంఘాల సభ్యులతో కలిసి స్థలాలను మెప్మా డీఎంసీ శ్రీనివాస్ ఇటీవల పరిశీలించారు. తిర్పెల్లి, బ్రాహ్మణ్వాడ, ఖానా పూర్ ప్రాంతాల్లోని బతుకమ్మ ఘాట్లను పరిశీలించి వాటి ని ఎంపికచేశారు. ఈచెరువు చుట్టురా నాలుగు కిలో మీటర్ల మేర 800మొక్కలు నాటాలని నిర్ణయించా రు. రాష్ట్రప్రభుత్వం నిర్వహించే వన మహోత్సవ కా ర్యక్రమంలో భాగంగా జూన్ 5న ఈ మొక్కలు నాటే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆగస్టు 31వరకు గడువు విధించారు. నాటిన ప్రతీ మొక్కకు జియో ట్యాగింగ్ చేయనున్నారు. సంరక్షణ తీరును నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆన్లైన్ కాల్ ద్వారా పర్యవేక్షించనున్నారు. మొక్కలు నాటిన నుంచి వృక్షాలు గా ఎదిగేలా సంరక్షించాల్సిన బాధ్యత ఎంపిక చేసిన సంఘ సభ్యులపైనే ఉంటుంది.
‘ఉమెన్ ఫర్ ట్రీస్’కు శ్రీకారం
పచ్చదనం పెంపులో మహిళల భాగస్వామ్యం
ఎస్హెచ్జీలకు మొక్కలు నాటే బాధ్యతలు
ఆదిలాబాద్ మున్సిపల్లో రెండు సంఘాలు ఎంపిక
స్థలాలను గుర్తించాం
అమృత్ మిత్ర 2.0లో భాగంగా ఎస్హెచ్జీ సభ్యుల ద్వారా మొక్కలు నాటి సంరక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ఖానాపూర్ చెరువు పరిధిలో ప్రాంతాలను గుర్తించడంతో పాటు మొక్కలు నాటే రెండు సంఘాల సభ్యులను ఎంపిక చేశాం. వారికి నీలంరంగు చీరలు, టోపి, పెన్ను, హ్యాండ్బ్యాగ్, నోట్బుక్, వాటర్ బాటిల్తో కూడిన కిట్ అందజేస్తాం. లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఆయా సభ్యులతో స్థలాలను పరిశీలించాం.
– శ్రీనివాస్, మెప్మా డీఎంసీ, ఆదిలాబాద్