
● ఆర్టీసీ సేవలందని గ్రామాలెన్నో.. ● మండల కేంద్రాలకూ కరు
ఆదిలాబాద్: గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపడంలో ఆర్టీసీ నిర్లిప్తత పల్లెవాసులకు శాపంగా మారుతోంది. ప్రైవేట్ వాహనాలతో జేబులకు చిల్లు పడుతోందని, అలాగే పరిమితికి మించి ప్రయాణంతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ‘గిరి’జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రవాణాను తమకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు. అయితే తాజాగా ఆర్టీసీ ఎండీ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా రహదారి సౌకర్యం ఉన్న గ్రామాలకు అవసరం మేరకు సర్వీసులు నడుపుతామని పేర్కొనడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.
పలు మండలకేంద్రాలకు సైతం..
రహదారి సరిగా ఉండడంతో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే బస్సులు నడుపుతామని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. జిల్లాలో ని సిరికొండ మండల కేంద్రం ఏర్పడి ఏళ్లు గడుస్తు న్నా ఇప్పటికీ బస్సు సౌకర్యం లేకపోవడం గమనా ర్హం. అలాగే తాంసి మండల కేంద్రానికి ఒకే ఒక్క ట్రిప్పు నడుపుతున్నారు. ట్రిప్పుల సంఖ్య పెంచా లని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేద ని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా తాంసిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు మండలంతో పాటు భీంపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో వీరంతా ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. తాంసి–భీంపూర్ నడుమ కప్పర్ల మీదుగా బీటీ రోడ్డు ఉన్నా దశాబ్దాలుగా ప్రజా రవాణాకు నోచుకోవడం లేదని పేర్కొంటున్నారు.
ప్రైవేటులో ప్రమాదకర ప్రయాణం..
ఆర్టీసీ బస్సు అందుబాటులో లేకపోవడంతో గ్రామీ ణులకు ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయి. అ యితే పరిమితికి మించి తరలిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అలా గే వాహనదారులు అడిగినంత ఇచ్చుకోవాల్సి వ స్తోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ అందిస్తున్న మహాలక్ష్మి పథకానికి సైతం నోచుకోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఆర్టీసీ సేవలందని గ్రామాలెన్నో.. ● మండల కేంద్రాలకూ కరు