
ఇజ్రాయెల్పై హమాస్ బాంబు దాడి దృశ్యాలు
నిర్మల్ ఖిల్లా: గడిచిన నాలుగు రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా(హమాస్) దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశానికి వెళ్లిన ఉమ్మడి జిల్లా వాసులు ఎలా ఉన్నారో అని వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాకెట్లు, లాంచర్ల దాడిలో వందలాది మంది మృతి చెందుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తుండడంతో ప్రవాస భారతీయ కుటుంబీకుల్లో అలజడి చెలరేగుతోంది. భారతదేశానికి మిత్రదేశంగా ఉన్న ఇజ్రాయెల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్, నిర్మల్, భైంసా తదితర ప్రాంతాల నుంచి వెళ్లిన దాదాపు 150 మంది యువకులు ఉన్నట్లు సమాచారం. దాడులు జరుగుతున్న ప్రాంతంలో వీరు పనులు నిర్వర్తిస్తున్నారు.
సాక్షితో మాట్లాడిన బాధితులు..
ఉపాధి నిమిత్తం వెళ్లిన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రానికి చెందిన ఇజ్రాయెల్ తెలంగాణ ప్రవాసీ అసోసియేషన్ సభ్యుడైన బిక్కునూరు రాజు ’సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. తామంతా ఇప్పటి వరకు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. హమాస్ ఆకస్మికంగా జరుపుతున్న దాడులతో బంకర్లలో తలదాచుకుంటున్నట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లా నుంచి తమ 20 మంది సభ్యుల బృందం యుద్ధ సైరన్ మోగగానే బంకర్లోకి వెళ్తున్నట్లు తెలిపారు.
దాడులు జరుగుతున్న సమీప ప్రాంతాలలో ఉమ్మడి జి ల్లావాసులు స్వల్పసంఖ్యలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏదైనా యుద్ధ రాకెట్, మిస్సైల్ వంటివి దూసుకొ స్తున్న కొద్దీ నిమిషాల ముందు సైరన్ మోగుతుందన్నారు. వెంటనే అక్కడి సమీప ప్రాంతాల్లోని ప్రజ లందరూ అప్రమత్తం కావాల్సి ఉంటుందని తెలిపా రు. తాము నివసించే ప్రతి అపార్ట్మెంట్లో బంకర్ సదుపాయం ఉందని పేర్కొన్నారు.