రాజీ మార్గంతో కేసుల సత్వర పరిష్కారం
ఆదిలాబాద్టౌన్: రాజీ మార్గంతోనే కేసులు సత్వరం పరిష్కారమవుతాయని జిల్లా జడ్జి ప్ర భాకరరావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివా రం జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పెండింగ్ కేసులు పరిష్కరించాలనే లక్ష్యంతో హైకోర్టు ఆదేశా ల మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పే ర్కొన్నారు. కేసుల కారణంగా కక్షిదారులు కో ర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృథా చే సుకోకుండా రాజీ మార్గం ద్వారా పరిష్కరి స్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. ఇందులో డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, న్యాయమూర్తులు లక్ష్మికుమారి, హుస్సేన్, డీఎస్పీ జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


