breaking news
WiFi throughout the city
-
హైదరాబాద్ వ్యాప్తంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్, ‘యాక్ట్ ఎక్స్క్లూజివ్’ ఆఫర్
ప్రముఖ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాక్ట్ తన యూజర్లకు శుభవార్తను ప్రకటించింది. ఇంటి దగ్గరే కాకుండా బయటకు వెళ్లినా సరే ఇంటర్నెట్ సేవలు ఉచితంగా అపరిమితంగా పొందేలా ఏర్పాటు చేసింది. దీని కోసం నగరం నలుమూలల ఫ్రీ వైఫై జోన్లు ఏర్పాటు చేసింది. హై-ఫైలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, యాక్ట్ సంస్థలు సంయుక్తంగా హై-ఫై ప్రాజెక్టును చేపట్టాయి. అందులో భాగంగా ఆగస్టు మొదటి వారంలో నగర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఫ్రీ వైఫై జోన్లను రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ప్రారంభించారు. ఈ వైఫై సెంటర్ల దగ్గర 25 ఎంబీపీఎస్ స్పీడ్తో 45 నిమిషాల పాటు ఎవరైనా ఇంటర్నెట్ని ఉచితంగా వాడుకోవచ్చు. హై-ఫైలో భాగంగా గరిష్టంగా వన్ జీబీ డేటాను వినియోగించుకునే వీలుంది. యాక్ట్ స్మార్ట్ ఫైబర్ తాజగా యాక్ట్ స్మార్ట్ పైబర్ టెక్నాలజీ సాయంతో తన వినియోదారుకలు ఇంటి బయట కూడా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తోంది యాక్ట్ సంస్థ. ఇళ్లు లేదా ఆఫీస్ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ ఏ ప్లాన్లో ఉందో. అదే ప్లాన్తో హై-ఫైలో ఏర్పాటు చేసిన ఫ్రీ వైఫై జోన్ల దగ్గర కూడా నెట్ను వాడుకునే అవకాశం కలిపించింది. . అంటే ఫ్రీ వైఫై సెంటర్ల దగ్గర సాధారణ యూజర్లకు 25 ఎంబీపీఎస్ స్పీడ్తో కేవలం 45 నిమిషాల పాటే నెట్ అందితే, యాక్ట్ యూజర్లకు వారి ఇంటి దగ్గర ప్లాన్ ప్రకారం ఎక్కువ స్పీడ్తో ఎంత సేపైనా అన్లిమిటెడ్గా నెట్ను వాడుకునే వీలు ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉన్న 47 స్టేషన్లలో కూడా ఈ నెట్ సౌక్యర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వరంగల్లో కూడా హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమైన వరంగల్లోనూ ఉచిత వైఫై సేవలు ప్రారంభించినట్టు యాక్ట్ సంస్థ తెలిపింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటల పరిధిలో మొత్తం 18 ఉచిత వైఫై సెంటర్లు అందుబాటులోకి తెచ్చింది. కాలేజీలు, లైబ్రరీలు, పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, షాపింగ్మాల్స్ తదితర చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. ఇలా చేయాలి - ఫ్రీ ఇంటర్నెట్ పొందాలంటే హై ఫై నెట్ జోన్ పరిధిలోకి వెళ్లాలి - వై-ఫై సెట్టింగ్స్లో ACT Free HY-Fi ని ఎంచుకోవాలి - వెంటనే యూజర్ లాగిన్ పాప్అప్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి - మీ మొబైల్ నంబరుకి నాలుగు అంకెలా ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి - సాధారణ వినియోగదారుల కాల పరిమితి ముగిసిన తర్వాత రూ. 25, రూ. 50తో టాప్ఆప్ పొందవచ్చు. యాక్ట్ వినియోగదారులకైతే ఇంటి దగ్గర ప్లాన్నే ఇక్కడ కంటిన్యూ చేయవచ్చు. చదవండి : భయపెట్టే బోయింగ్కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు? -
రెండేళ్లలో ఉచిత వైఫై
నగర వ్యాప్తంగా వైఫై హాట్స్పాట్స్ వైఫై ఏర్పాటు కోసం జులైలో టెండర్లు న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఆప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పార్లమెంటరీ కార్యదర్శి(ఐటీ) ఆదర్శ్ శాస్త్రి మాట్లాడుతూ రానున్న రెండేళ్ల కాలంలో నగరమంతటా వైఫై అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 2016 నాటికి ఏడు వందల వైఫై హాట్స్పాట్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తద్వారా రెండేళ్ల కాలంలో వైఫై అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెలికాం న్యూస్ పోర్టల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘టెలీ అనాలిసిస్’పై చర్చా కార్యక్రమంలో ఆదర్శ్ శాస్త్రి ప్రసంగించారు. జూన్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో దీని కోసం కేటాయింపులు జరుపుతారని పేర్కొన్నారు. అనంతరం జులైలో టెండర్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. 2016 కల్లా మొదటి దశలో 600 నుంచి 700 వరకు వైఫై హాట్స్పాట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో నగరవ్యాప్తంగా వైఫై అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెలికాం కంపెనీలకు శాస్త్రి కొన్ని సూచనలు చేశారు. టెలికాం కంపెనీలు ప్రజలకు ఉచిత వైఫై సదుపాయం కల్పించినట్లయితే ప్రకటనల రూపంలో అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. నగరంలో 40 లక్షల మందికి స్మార్ట్ఫోన్లు ఉన్నాయని, ఉచిత వైఫైని వారు ఉపయోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. అప్పుడు ప్రకటను వారి దరిచేరుతుందన్నారు. ప్రజలు కూడా ఉచిత వైఫై సదుపాయంతో అనేక అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తే అవినీతికి చెక్ పెట్టొచ్చని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ-మెయిల్, ఇతర వెబ్సైట్లను నిర్ణీత సమయంలోగా వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సినిమాలు చూడాలన్నా, డౌన్లోడ్ చేసుకోవాలన్నా కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుందని శాస్త్రి అన్నారు.