breaking news
Widespread rains
-
పశ్చిమ, ఉత్తర భారతాల్లో దంచికొడుతూ..
న్యూఢిల్లీ/సిమ్లా/రాంపూర్: ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు తీవ్రస్థాయిలో ప్రభావం చూపడం మొదలెట్టాయి. దీంతో గురువారం సైతం ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్సహా పశ్చిమ, ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వానలతో వర్షప్రభావిత జిల్లాల్లో రోడ్డు జలమయం కావడం, చెట్లు, ఇళ్లు కూలడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కూలిన చెట్లు రహదారులపై పడటంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలకు సైతం ఇబ్బందులు తప్పలేదు. మహారాష్ట్రలోని పింప్రీ ఛించ్వాడ్ జిల్లాలో వ్యర్థాల నుంచి ఇంధన తయారీ యూనిట్ను ఆనుకుని ఉన్న మూడంతస్తుల భవంతిపై భారీ చెత్తకుప్ప కూలడంతో గల్లంతైన వారి కోసం గురువారం సైతం అన్వేషణ, సహాయక చర్యలు కొనసాగాయి. గురువారం భవన శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంకా 8 మంది జాడ తెలియాల్సి ఉంది. భారీ వర్షాలతో ఢిల్లీ–నోయిడా ఎక్స్ప్రెస్వేపై ట్రాఫిక్ స్తంభించింది. గురుగ్రామ్లోని ఒక లగ్జరీ రెసిడెన్షియల్ సొసైటీలో వర్షానికి భవనం బాగా నానిపోయి ఒక ప్లాట్ బాల్కనీ అమాంతం కుప్పకూలింది. ఢిల్లీలో వరదనీటి పైపుల నుంచి 57,000 మెట్రిక్ టన్నుల పూడిక తీశామని అధికారులు తెలిపారు. నోయిడా, ఘాజియాబాద్, ఘజీపూర్, ఫరీదాబాద్లలో జనావాసాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. రాజస్థాన్లోని ఛిత్తోర్గఢ్, భరత్పూర్ జిల్లాలో భారీవర్షం కురిసింది. ఉత్తరాఖండ్లో వర్షాల దెబ్బకు 9 రాష్ట్ర రహదారులుసహా 107 రూట్లలో ట్రాఫిక్ స్తంభించి జనజీవనం తలకిందులైంది. దీంతో డెహ్రాడూన్ జిల్లాయంత్రాంగం విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించింది. రాజస్థాన్, హరియాణా, పంజాబ్లోని చివరి ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని, దీంతో యావత్ భారతదేశంలో వర్షాకాల సీజన్ మొదలైందని భారతవాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. గరిష్టంగా 20 సెంటీమీటర్ల స్థాయిలో వర్షపాతం నమోదయ్యే ఆస్కారముందంటూ వాతావరణశాఖ కేరళలోని మళప్పురం, కోజికోఢ్, వయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లోని కినౌక్లో నది ఉప్పొంగి ప్రవహిస్తూ 100 అడుగుల ఇనుపవంతెనను తనలో కలిపేసుకుంది. కుపా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో మూడు ఇళ్లు కూలిపోయాయి. పడిన బండరాళ్లతో రోడ్డు మూసుకుపోయింది. -
అమెరికా, యూరప్లను... హడలెత్తిస్తున్న మంచు
వాషింగ్టన్/లండన్: కనీవినీ ఎరగనంతటి భారీ మంచు అమెరికా, యూరప్లను హడలెత్తిస్తోంది. అమెరికాలో మంచు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. బ్రిటన్లో హిమ బీభత్సం కొనసాగుతోంది. పలు దేశాల్లో విమానాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత భారీగా మంచు కురుస్తోందని నేషనల్ వెదర్ సరీ్వస్ తెలిపింది. మధ్య అమెరికాలో మొదలైన మంచు తుపాను తూర్పు దిశగా కదులుతోందని హెచ్చరించింది. ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని హెచ్చరించింది. కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మామూలుగా చలి అంతగా ఉండని మిసిసిపీ, ఫ్లోరిడా రాష్ట్రాలూ మంచు బారిన పడతాయని హెచ్చరించారు. ఆర్కిటిక్ చుట్టూ పోలార్ వోర్టెక్స్ కారణంగా ఏర్పడుతున్న విపరీతమైన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వాషింగ్టన్ డీసీ, బాలి్టమోర్, ఫిలడెల్ఫియా నగరాలను మంచు ముంచెత్తుతోంది. వర్జీనియా తదితర చోట్ల 5 నుంచి 12 అంగుళాలు, కాన్సాస్, ఇండియానాల్లో 20 అంగుళాల మేర మంచు పేరుకుంది. మిస్సోరీ, ఇల్లినాయీ, కెంటకీ, వెస్ట్ వర్జీనియాల్లోనూ భారీగా మంచు కురియనుంది. విమాన సరీ్వసులు కూడా ప్రభావితమవుతున్నాయి. బ్రిటన్లో కరెంటు కట్ యూరప్ అంతటా ఆదివారం భారీగా మంచు వర్షం కురిసింది. బ్రిటన్, జర్మనీల్లో ప్రధాన నగరాల్లో హిమపాతంతో ప్రజా జీవనానికి అంతరాయం కలిగింది. విమానాలు నిలిపేశారు. బ్రిటన్లో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. క్రీడా కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైల్వే సేవలు రద్దయ్యాయి. దక్షిణ ఇంగ్లాండ్లో ఎనిమిదో హెచ్చరిక జారీ చేశారు. మరో వారం ఇదే పరిస్థితి కొనసాగనుంది. జర్మనీలో మంచు బీభత్సం దృష్ట్యా బ్లాక్ ఐస్ హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో రాకపోకలన్నీ రద్దయ్యాయి. రైలు ప్రయాణాలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
కొహెడ ఘటనలో 26మందికి గాయాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొహెడలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో కొహెడ పండ్ల మార్కెట్లోని షెడ్లు కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను నగరంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హయత్ నగర్ అమ్మ ఆసుపత్రిలో 12 మంది, సన్రైజ్ లో నలుగురు, షాడో ఆసుపత్రిలో ఏడుగురు, మరో ముగ్గురు వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన దురదృష్టకరమని తెలిపారు. క్షతగ్రాతులకు అయ్యే వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. విపరీతమైన సుడిగాలి వలన ఈ ప్రమాదం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. కనీస సదుపాయాలు లేవు: ఎంపీ కోమటిరెడ్డి పండ్ల మార్కెట్లో కూలిపోయిన షెడ్లను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. పండ్ల మార్కెట్లో మౌలిక సదుపాయాలు లేమి తీవ్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. కనీసం మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదన్నారు. మార్కెట్లో భౌతిక దూరం పాటిస్తున్న పరిస్థితి కూడా కనిపించడంలేదన్నారు. కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని దివంగత మహానేత వైఎస్సార్ హయాంలోనే ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఇప్పటికైనా పండ్ల మార్కెట్లో కనీస సదుపాయాలు కల్పించాలని కోమటిరెడ్డి కోరారు. -
ఆదిలాబాద్లో విస్తారంగా వర్షాలు
-
కోస్తాలో విస్తారంగా వర్షాలు!
విశాఖపట్నం: ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో పాటు, నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రానున్న 24 గంటల్లో కో స్తాంధ్రలో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొంది. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర అంతటా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. గడచిన 24 గంటల్లో కురుపాంలో 10 సెం.మీలు, అవనిగడ్డలో 7, భీమడోలు 5, పాలేరు బ్రిడ్జి, మారుటేరులో మూడు సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.


