breaking news
unduru
-
ఆదిత్య ఆధ్వర్యంలో ‘లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్’
ఉండూరు (సామర్లకోట) : విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఉండూరు గ్రామ పరిధిలో ఏడీబీ రోడ్డులో ఆదిత్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ‘లక్ష్య ఇంటర్నేష¯ŒS స్కూల్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు పాఠశాల ఆవరణలో వల్లభాయ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి జాతీయ నాయకుని గురించి తెలుసుకొని వారిలో ఉన్న మంచిని గ్రహించాలని సూచించారు. దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక స్పృహలకు సంబందించిన అంశాల పై ఉపాధ్యాయులు బోధనలు చేయాలన్నారు. విద్యతో పాటు ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలపై శ్రద్ధ చూపాలన్నారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లీషును ఉపాధి కోసమే సద్వినియోగం చేసుకొని మాతృభాషను మరువకూడదన్నారు. భారతదేశంలో ఉన్న సంస్కృతి, సంప్ర దాయాలు ఇతర దేశాలకు చెందిన వారు ఎంతో గౌరవిస్తున్నారని తెలిపారు. కన్నతల్లి, జన్మభూమి, మాతృ భాష, మాతృదేశాన్ని మరచి పోకూడదని సూచించారు. మతం వ్యక్తిగతమైనదని, అయితే కొందరు కుల, మతాలతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆదిత్య శేషారెడ్డి ఉపాధ్యాయునిగా విద్యా సంస్థలు స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. ఆయనతో పాటు కుమారులు, కోడళ్లు, భార్య విద్యా సంస్థలకు అంకితం కావడం విశేషమని పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో విద్యను అందించాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, ప్రైవేటు రంగ సంస్థలు ప్రగతి సాధించిన్నప్పుడే అభివృద్ది సాధ్యపడుతుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆదిత్య విద్యా సంస్థల చైర్మ¯ŒS ఎ¯ŒS.శేషారెడ్డి మాట్లాడుతూ 1984లో విద్యారంగంలో ప్రవేశించి ఇప్పటి వరకు వివిధ రకాల 50 విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని, ఐదు వేల మంది ఫ్యాకల్టీలు, 50 వేల మంది విద్యార్ధులు ఉన్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలో క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించడం వలనే అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీలు మురళీమోహన్, రవీంద్రబాబు, కె.హరిబాబు, తోట నరసింహంలతో పాటు సతీష్రెడ్డి, దినేష్రెడ్డి, సుగుణ, సృతికిరణ్, లక్ష్మిరాజ్యం తదితరులు పాల్గొన్నారు. వెంకయ్య నాయుడిని శేషారెడ్డి కుటుంబసభ్యులు ఘనంగా సన్మానించారు. -
రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
ఉండూరు (సామర్లకోట) : ఎంఎస్ పాయింట్ నుంచి రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యాన్ని రైసు మిల్లుకు తరలించడంతో విజిలెన్స్ ఎస్పీ టి.రామప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు దాడులు చేశారు. విజిలెన్స్ ఎస్పీ కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి ఏడీబీ రోడ్డులోని ఉండూరుకు చెందిన తేజ రైస్ మిల్లుకు రేషన్ బియ్యం చేరింది. పెద్దాపురం మండలం దివిలిలో ఉన్న గోదాముల నుంచి సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామంలోని మూడు రేషన్ షాపులకు ఈ బియ్యం చేరాలి. విజిలెన్స్ అధికారులు దాడి చేసే సమయంలో ట్రాక్టర్లో 198 బస్తాలు ఉండాలి. అప్పటికే మిల్లులోకి 34 బస్తాలు దింపారు. జిల్లాలోనే తొలిసారిగా ఎంఎస్ పాయింట్ నుంచి మిల్లుకు బియ్యం చేరిన సంఘటన ఇది. మిల్లులో దింపిన బియ్యం బస్తాలు రేషన్ బియ్యం సంచులతో ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఎంఎస్ పాయింట్ సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు, రేషన్ డీలర్ల పాత్ర ఉంటుందని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు.. ట్రాక్టర్ డ్రైవర్, వీఆర్ఏ, మిల్లు యజమానుల నుంచి సమాచారం సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ డీఎస్పీ పి.రాజేంద్రకుమార్, సీఐలు గౌస్బేగ్, రామ్మోహన్రెడ్డి, సీటీఓ రత్నకుమార్, విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు, డిప్యుటీ తహసీల్దార్ తాతారావు తదితరులు పాల్గొన్నారు.