-
మోల్డ్టెక్ మరో రెండు ప్లాంట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజెక్షన్ మోల్డెడ్ ప్లాస్టిక్ కంటైనర్ల తయారీ దిగ్గజం మోల్డ్టెక్ ప్యాకేజింగ్ మరో రెండు ప్లాంట్లను స్థాపిస్తోంది. హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద ఇంజెక్షన్ బ్లో మౌల్డింగ్ (ఐబీఎం) ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని రూ.50 కోట్లతో నెలకొల్పనుంది. అలాగే రూ.20 కోట్లతో ఉత్తరప్రదేశ్లోనూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్టు మోల్డ్టెక్ గ్రూప్ సీఎండీ జె.లక్ష్మణ్ రావు తెలిపారు. ఫార్మా, కాస్మెటిక్స్, ఎఫ్ఎంసీజీ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల కోసం ఐబీఎం ప్యాకేజింగ్ విభాగంలోని ప్రవేశించిన సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ టెక్నాలజీని పరీక్షించేందుకు రూ.10 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. ఐబీఎం ప్యాకేజింగ్ ఉత్పత్తుల మార్కెట్ దేశంలో 9 శాతం వృద్ధితో రూ.5,000 కోట్లు ఉంది. 2025 నాటికి ఈ రంగంలో 5–6 శాతం మార్కెట్ వాటాను చేజిక్కించుకుంటాం’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏకైక సంస్థ.. రోబోలను వినియోగించి ప్లాస్టిక్ కంటైనర్లను అలంకరణకు ఇన్ మోల్డ్ లేబులింగ్ (ఐఎంఎల్) విధానాన్ని దేశంలో పరిచయం చేసిన తొలి సంస్థగా మోల్డ్టెక్ ప్యాకేజింగ్ రికార్డు సాధించింది. ప్రపంచంలో ఐఎంఎల్ డెకోరేషన్ కోసం రోబోలను సొంతంగా రూపకల్పన చేసి తయారు చేస్తున్న ఏకైక ప్యాకేజింగ్ సంస్థ కూడా ఇదే. ‘గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.480 కోట్ల టర్నోవర్ సాధించింది. 2021–22లో 25 శాతం వృద్ధితో రూ.600 కోట్లు ఆశిస్తోంది. మూడు నాలుగేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నాం. విస్తరణకుగాను 2024 నాటికి రూ.200 కోట్లు పెట్టుబడి చేయనున్నాం’ అని లక్షణ్ రావు తెలిపారు. భారత్లో సంస్థకు 9 తయారీ కేంద్రాలు ఉన్నాయి. మోల్డ్టెక్ గ్రూప్ సీఎండీ జె.లక్ష్మణ్ రావు -
తెలంగాణలో హెచ్ఎస్ఐఎల్ రెండు కొత్త ప్లాంట్లు
⇒ మెదక్లోని ఇస్నాపూర్లో రూ.300 కోట్ల పెట్టుబడులు ⇒ రూ.60 కోట్లతో బీబీనగర్లోని సిరామిక్ ప్లాంట్ విస్తరణ కూడా.. ⇒ హెచ్ఎస్ఐఎల్ వీసీఎండీ సందీప్ సొమానీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సొమానీ గ్రూప్కు చెందిన హిందుస్థాన్ శానిటరీవేర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (హెచ్ఎస్ఐఎల్) తెలంగాణలో మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. రూ.300 కోట్ల పెట్టుబడులతో మెదక్లోని ఇస్నాపూర్లో ప్రీమియం పైప్స్ అండ్ క్యాప్స్ (సెక్యూరిటీ క్లోజర్ సొల్యూషన్స్), సీపీవీసీ (క్లోరినేటెడ్ పాలి వినైల్ క్లోరైడ్) పైప్స్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎస్ఐఎల్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సొమానీ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఈ రెండు ప్లాంట్ల ద్వారా ప్రత్యక్షంగా 800–900 మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలొస్తాయన్నారు. ప్లాంట్ల నిర్మాణం కూడా పూర్తయిందని, ఉత్పత్తుల తయారీకి అవసరమైన మిషనరీని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ప్లాంట్లో ఉత్పత్తుల తయారీ ట్రయల్ రన్లో ఉందని, మార్చి ముగింపు నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అలాగే సీపీవీసీ ప్లాంట్ను జూలై నాటికి ప్రారంభిస్తామని చెప్పారు. సీపీవీసీ ప్లాంట్ సామర్థ్యం ఏటా 30 వేల టన్నులుగా ఉంటుందని.. వీటి దేశీయంగా సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఇస్నాపూర్లో సంస్థకిక్కడ 84 ఎకరాల స్థలముంది. ప్రస్తుతానికి కొంత భాగంలోనే ఈ ప్లాంట్లను నిర్మిస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీబీనగర్ ప్లాంట్ విస్తరణ.. ప్రస్తుతం హెచ్ఎస్ఐఎల్కు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 3 ప్లాంట్లున్నాయి. వీటి నుంచి శానిటరీ, గ్లాస్ బాటిల్స్ను ఉత్పత్తి చేస్తోంది. తాజాగా రూ.60 కోట్ల పెట్టుబడులతో బీబీనగర్లోని సిరామిక్ ప్లాంట్ను సామర్థ్యాన్ని విస్తరించనుంది. దీంతో ప్రస్తుతం ఏటా 38 లక్షల టన్నులుగా ఉన్న ప్లాంట్ సామర్థ్యం 42 లక్షలకు చేరుతుందని తెలిపారు. జూలై నుంచి విస్తరిత ప్లాంట్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ‘‘2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,948 కోట్ల టర్నోవర్కు చేరుకున్నాం. 40 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నాం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా వంటి దేశాలకు హెచ్ఎస్ఐఎల్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ఏటా మొత్తం వ్యాపారంలో ఎగుమతుల వాటా రూ.70–80 కోట్లుగా ఉంటుందని’’ సందీప్ వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500 మంది డీలర్లు, 18 వేల ఔట్లెట్లున్నాయని 2020 నాటికి 20 వేల ఔట్లెట్లకు చేర్చుతామని చెప్పారు. మార్కెట్లోకి హింద్వేర్ కూలర్లు.. హెచ్ఎస్ఐఎల్ హింద్వేర్ స్నోక్రెస్ట్ పేరిట ఎయిర్కూలర్లను మంగళవారమిక్కడ మార్కెట్లోకి విడుదల చేసింది. కూలర్ ముందు భాగంలోని ప్యానెల్స్ను మార్చుకోగలిగే వీలుండటం దీని ప్రత్యేకత. డెసర్ట్, పర్సనల్, విండో విభాగాల్లో 14 మోడల్స్లో అందుబాటులో ఉంటాయి. 18 లీటర్ల నుంచి 100 లీటర్ల శ్రేణిలో లభిస్తాయి. ధర రూ.8,990–17,990 మధ్య ఉన్నాయి. వీటిని హర్యానా, హిమాచల్ ప్రదేశ్లోని ప్లాంట్లలో తయారు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement