breaking news
Tummalapalem Checkpost
-
ఏపీలో కలకలం; డమ్మీ ఈవీఎంలు పట్టివేత
ఇబ్రహీంపట్నం (మైలవరం): సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న 2,400 డమ్మీ ఈవీఎంలను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు తుమ్మలపాలెం చెక్పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రామాంజనేయులుకు చెందిన వ్యక్తులు వీటిని తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. విషయాన్ని మండల ఎన్నికల నియమావళి అధికారి, ఎంపీడీవో రామప్రసన్న దృష్టికి తీసుకెళ్లారు. స్వాధీనం చేసుకున్న డమ్మీ ఈవీఎంలను పోలీస్స్టేషన్కు తరలించారు. ఒక్కొక్క ఈవీఎం రూ.16కు కొనుగోలు చేసినట్లు సంబంధిత వ్యక్తులు బిల్లులు చూపించారు. అయితే ఒక ఈవీఎం ఖరీదు సుమారు రూ.100 వరకు ఉంటుందని గుర్తించిన అధికారులు 2,400 ఈవీఎంలకు రూ.2.40 లక్షలు ఖర్చును భీమవరం టీడీపీ అభ్యర్థి పి.రామాంజనేయులు ఖర్చులో జమచేసి ఎన్నికల కమిషన్కు నివేదిక పంపించారు. -
తుమ్మలపాలెం చెక్పోస్ట్ వద్ద బస్సు దగ్ధం
ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం ఆర్టీఏ చెక్పోస్టు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను ఇబ్రహీం పట్నంలోనే దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరమ్మతులు చేయిద్దామని తీసుకువెళుతుండగా, తుమ్మలపాలెం చెక్పోస్టు వద్దకు వచ్చేసరికి బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరుగలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని క్షణాల్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది.