transport officials
-
‘నరికేస్తా..’ రవాణాశాఖ అధికారులకు జేసీ వార్నింగ్
అనంతపురం, సాక్షి: టీడీపీ సీనియర్లు.. ఇప్పుడు తమ అసలు రూపం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. రవాణా శాఖ అధికారులను ఉద్దేశించి.. నరికేస్తానంటూ వ్యాఖ్యానించారు. అనంతపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ జేసీ ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. జేసీ ట్రావెల్స్ బస్సులు, లారీలను సీజ్ చేసిన వాళ్లందరిపై ప్రతీకారం తీర్చుకుంటా అంటూ ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడారు. ఈ క్రమంలో రవాణా శాఖ జేటీసీ శివరాం ప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అత్తికానాజ్ లను వదలను అంటూ నేరుగా బెదిరించారాయన.‘‘నా బస్సులు సీజ్ చేయడంపై పదిరోజుల్లో ఎంక్వైరీ జరగాలి. నేను ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబుని ఏం అనను. చంద్రబాబును నేనేం వ్యతిరేకం కాను. కానీ, నా బస్సుల సీజ్ల విషయంలో ఎవరినీ వదలను. బ్రేక్ ఇన్స్పెక్టర్లకు చెబుతున్నా.. నేను ఎంత దూరమైనా వెళ్తా. బ్రేక్ ఇన్స్పెక్టర్లు నా కాళ్లు పట్టుకుని నా బస్సులు రిపేర్లు చేయాల్సిందే!’’ అని అన్నారాయన.కొసమెరుపు: ఇంతలా రెచ్చిపోయిన జేసీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని, తనను.. తన కుటుంబ సభ్యుల్ని దొంగోళ్లుగా చూశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. -
‘వాహనాలకు జీపీఎస్,సీసీ కెమెరాలు తప్పనిసరి’
సాక్షి, హైదరాబాద్: త్వరలో హైదరాబాద్లోని అన్ని రవాణా వాహనాలకు జీపీఎస్ పరికరాలు తప్పనిసరి చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా మహిళల భద్రతపై డీజీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. డీజీపీ మహేందర్రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసు అధికారులతోపాటు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ (ఎల్ అండ్ వో) స్వాతి లక్రా, రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత గురించి తీసుకోవాల్సిన అంశాలే కేంద్రంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో అనుమతి ఉన్న కార్లు, ఆటోలు తదితర రవాణా వాహనాలకు జీపీఎస్ సౌకర్యం ఉండాలని రవాణా అధికారులు సూచించారు. నగరంలో సీసీ కెమెరాల సంఖ్యను మరింత పెంచాలని, పలు ప్రజా రవాణా వాహనాల్లోనూ సీసీ కెమెరాలను అమర్చాలని సమావేశం అభిప్రాయపడింది. -
పర్మిట్ రద్దు.. బస్సు సీజ్
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో అధికారులు శుక్రవారం రవాణ శాఖ కార్యాలయంలో రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ట్రావేల్స్ యజమానులు ఈ ఆదేశాలను బేఖాతరు చేసి ఆలస్యంగా సదస్సుకు హాజరయ్యారు. దాంతో డీటీసీ వచ్చినప్పటికి కూడా ట్రావెల్స్ యజమానులు రాకపోయేసరికి సదస్సు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీరా ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నిబంధనలు తూచా తప్పక పాటించాలన్నారు. బస్సు ప్రారంభానికి ముందే డ్రైవర్కి బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేయాలని తెలిపారు. మద్యం సేవించి బస్సు నడిపితే జైలు, జరిమానాతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. స్పీడ్ లాక్ను ఎవరైనా ట్యాపర్ చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కల్గిస్తే పర్మిట్ రద్దు చేసి.. బస్సు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సదస్సుకు హాజరుకానీ యాజమాన్యాలకు నోటీసులు పంపిస్తామని తెలిపారు. -
ఖజానాకు గండి
దేశంలోనే ప్రసిద్ధి చెందిన తాండూరు నాపరాతి అక్రమంగా తరలిపోతోంది. నిత్యం వందకు పైగా లారీలు రాయల్టీ లేకుండా.. రాయల్గా సరిహద్దులు దాటుతున్నాయి. చెక్పోస్టుల వద్ద నిఘా కరువైంది. దీంతో సర్కారీ ఆదాయానికిగండి పడుతోంది. ఈ తంతు చానాళ్లుగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తాండూరు : తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో వేలాది ఎకరాలలో నాపరాతి నిక్షేపాలున్నాయి. తాండూరు మండలంలోని ఓగిపూర్, మల్కాపూర్, కొటబాసుపల్లి, కరన్కోట్, సిరిగిరిపేట్లో, బషీరాబాద్ మండలంలోని ఎక్మాయి, కొర్విచెడ్, నవల్గ, క్యాద్గిరా, జీవన్గిలో ఈ సహజ సంపద విరివిగా లభిస్తోంది. ఆయా గ్రామాల్లోని గనుల నుంచి వెలికితీçస్తున్న నాపరాతిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. తాండూరు నుంచి నిత్యం సూమారు 400 లారీల వరకు నాపరాయి రవాణా అవుతోంది. తెలంగాణలోని జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అయితే ప్రతీరోజు వందలాది లారీల్లో నాపరాయి రవాణా జరుగుతున్నా కొన్నింటి నుంచి మాత్రమే రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఫీజు అందుతోంది. మిగతా వాహనాలు ఎలాంటి ఫీజులు లేకుండానే యథేచ్ఛగా తరలివెళ్తున్నాయి. రాయల్టీ లేకుండా రవాణా సాగిస్తున్న వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు 50 నుంచి 70 లారీల వరకు రాయల్టీ లేకుండా రవాణా.. నాపరాతి తరలింపు పర్యవేక్షణ కోసం భూగర్భ వనరుల శాఖ ఆధ్వర్యంలో తాండూరు మండలం గౌతాపూర్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ సర్కిల్ళ్ల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే సంబంధిత సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించడం లేదు. చెక్పోస్టుల నిర్వహణ బాధ్యతలను హోంగార్డులే చూసుకుంటున్నారు. మైనింగ్ మాఫియా పెద్దల హస్తంలో ఉండటంతో అందినకాడికి దండుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ ఖజనాకు గండి.. తాండూరు ప్రాంతంలో ఖనిజ సంపద తరలింపులో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. నాపరాతి రవాణాతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. -
ఐపీఎస్ అధికారిపై బోండా తిట్ల పురాణం
-
అధికారులపై ఎంపీ కేశినేని నాని దుర్భాషలు
-
గడ్డి తింటున్నారా.. అధికారులపై ఎంపీ దుర్భాషలు
తెలుగుదేశం పార్టీ నాయకుల ఓవరాక్షన్తో అధికారులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విజయవాడ ఆర్టీయే కార్యాలయం వద్ద శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. రవాణా శాఖ కమిషనర్, డీటీసీలు అవినీతిపరులు అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రంగా ఆరోపించారు. గడ్డి తింటున్నారా అంటూ అధికారులను దుర్భాషలాడారు. కమిషనర్, డీటీసీలను ఘెరావ్ చేయడమే కాక.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు జతకలిశారు. అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ను ఎమ్మెల్యే బోండా ఉమా నెట్టేశారు. ప్రైవేటు బస్సులకు అక్రమంగా అనుమతులు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని, దానివల్ల ఆర్టీసీకి ఎంత నష్టం వస్తోందో మీకు తెలుసా అని కేశినేని నాని అధికారులపై మండిపడ్డారు. ప్రైవేటు బస్సులకు యాక్సిడెంట్లు జరిగితే ఆ నిందలు టీడీపీ ప్రభుత్వం మీద పడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తెలుగుదేశం పార్టీ నాయకుల తీరుతో రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. అయితే చివరకు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో ఎంపీ కేశినేని నానికి క్షమాపణలు చెప్పించారు. దాంతో వివాదం సర్దుమణిగింది. -
రవాణాశాఖలో భారీ బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖలో భారీ ఎత్తున బదిలీలు జరిగారుు. జాయింట్ ట్రాన్స పోర్ట్ కమిషనర్లు, రవాణా అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సూప రింటెండెంట్లు ... అన్ని కేడర్లలో 200 మందికి స్థానచలనం కలిగింది. నాలుగేళ్లుగా బదిలీలు లేక పోవటం.. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కనీ సం మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేశారు. ప్రధాన కార్యాలయంలో జాయింట్ ట్రాన్స పోర్ట్ కమిషనర్(జేటీసీ)గా ఉన్న పాండురంగ నాయక్కు హైదరాబాద్ సిటీ జేటీసీగా బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న రఘునాథ్ను ప్రధాన కార్యాలయానికి మార్చారు. 8 మంది ఆర్టీవోలను బదిలీ చేశారు. 4 ఖాళీలు పోను రాష్ట్రంలో మొత్తం 18 మంది ఆర్టీవోలుండగా 8 మందిని బదిలీ చేశారు. జోన్ ఐదు, ఆరులకు సంబంధించి 50 మంది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, 110 మంది ఏఎంవీఐలను బదిలీ చేశారు. ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకున్న 43 మందికి పోస్టింగ్స ఇచ్చారు. జోన్ ఐదు, ఆరులకు సంబంధించి 19 మంది సూపరింటెండెంట్లకు కూడా స్థానచలనం కలిగింది. అరుుతే కొందరు కోరుకున్న చోట పోస్టింగ్స దక్కినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో భారీగా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నారుు. -
అవినీతి మూలాలన్నీ అక్కడే
రవాణాశాఖ అనధికార ఆదాయానికి కేంద్రం ఏసీబీకి దొరికిన అధికారులు ఎక్కువ కాలం ఇక్కడే పనిచేశారు నెల్లూరు: రవాణాశాఖ అధికారుల అవినీతికి నెల్లూరు జిల్లా అడ్డాగా మారుతోంది. సీపోర్టు, చెక్పోస్టు, ఇరు రాష్ట్రాల సరిహద్దులు జిల్లాలో ఉండటంతో రవాణాశాఖలో పనిచేసే అధికారులు చూపు జిల్లా వైపే పడుతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా జిల్లాలో పోస్టింగ్ కోసం పోటీలు పడి మరి ఇక్కడికి వస్తున్నారు. వీలైనంత ఎక్కువ కాలం జిల్లాలో పని చేసేందుకు అధికారులు పెద్ద మొత్తంలో ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలకు ముట్ట జెబుతారన్న ప్రచారం జరుగుతుంది. ఏసీబీ అధికారులకు పట్టుబడితే రవాణాశాఖాధికారులు ఎక్కువ కాలం నెల్లూరు జిల్లాలో పని చేయడంతో వారి మూలాలు ఇక్కడే బయట పడుతుండటంతో చర్చనీయాంశంగా మారింది. ఆదాయ వనరులు ఎక్కువ జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవు, తడ ప్రాంతంలో సరిహద్దు చెక్పోస్టు, జాతీయ రహదారి, ఓ వైపు కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే సరుకుల రవాణా రవాణాశాఖలో అనధికార ఆదాయాన్ని ఎక్కువ తెచ్చిపెడుతున్నాయి. ప్రధానంగా కృష్ణపట్నం ఓడరేవు నుంచి బొగ్గు, ఇనుము, స్టీల్, ఆయిల్స్, గ్రానైట్, తదితర సరుకులు ఎక్కువగా ఎగుమతులు, దిగుమతులు అవుతుంటాయి. ఇవన్నీ ఎక్కువగా వాహన పరిమితికి మించి రవాణా అవుతుంటాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బియ్యం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, పేపరు, పప్పులు తదితర సరకులు ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. జిల్లాలో సిలికా, గ్రావెల్, కంకర, సున్నపురాయి, ఇసుక రవాణా జరుగుతుంటాయి. ఎక్కువ కాలం ఇక్కడే పోస్టింగ్ గతంలో గుంటూరులో ఆర్టీఓగా పని చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన బ్రహ్మానందరెడ్డి జిల్లాలో 5 ఏళ్లుకు పైగా పని చేశారు. నెల్లూరులో ఆర్టీఓగా పని చేసిన జనార్దనశెట్టి కూడా 7 ఏళ్లు సూపరింటెండెండ్, ఆర్టీఓ హోదాల్లో పని చేశారు. ఇటీవల కాకినాడ ఉపరవాణా కమిషనర్గా పనిచేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడి మోహన్ 6 ఏళ్లు నెల్లూరులోనే డీటీసీగా పని చేశారు. గుంటూరులో ఎంవీఐగా పని చేస్తూ శుక్రవారం ఏసీబీ అధికారులుకు పట్టుబడిన సుధాకరరెడ్డి జిల్లాలో పదేళ్లు పాటు వివిధ ప్రాంతాల్లో పని చేశారు. జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన వారిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించడం గమనార్హం. నెలకు రూ.20 లక్షలకు పైగా అనధికార ఆదాయం ఓవర్ లోడ్లు, కార్యాలయంలో జరిగే లావాదేవీలు కలిపి నెలకు రూ.20 లక్షలకు పైగా అనధికార ఆదాయయం వస్తుందని ప్రచారం జరుగుతుంది. గ్రానైట్, సిలికా, ఇసుక, సున్నపురాయి, గ్రావెల్, బొగ్గు, ఇనుము తదితర సామగ్రి అధిక లోడుతోనే రావాణా అవుతాయని చెబుతున్నారు. వీటికి సంబంధించి ఒక్కో లారీకి రూ. 1000 నుంచి రూ.1200 ఒక్కో అధికారికి ఇచ్చుకోవాల్సి ఉంది. జిల్లాలో రవాణా కార్యాలయాల్లో జరిగే లెసైన్స్, ఎఫ్సీ, పర్మిట్, ట్రాన్స్ఫర్లు, రిజిస్ట్రేషన్లు తదితర వాటిల్లో జరిగే లావాదేవీలకు ప్రభుత్వ చలానా కంటే ఐదారు రెట్లు అధిక మొత్తంలో లంచంగా పుచ్చుకోవాల్సి వస్తుందంటున్నారు. చెక్పోస్టులోనూ.. ప్రతి వాహనం చెక్పోస్టు ద్వారానే రవాణా చేయాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలతో పాటు అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నా.. చెక్పోస్టులో ఎంట్రీ ఫీజు చెల్లించుకోవాల్సిందే. అదేమని అడిగితే రాష్ డ్రైవింగ్, హైట్లోడ్, సౌండ్ పొల్యూషన్ పేరుతో కేసులు రాస్తామని బెదిరిస్తుంటారని లారీ యజమానులే వాపోతున్నారు. ఈ రీతిలో రవాణాశాఖకు 24 గంటల్లో రూ. 1.50 లక్షలు అనధికార మామూళ్లు వస్తాయని పలువురు చెబుతున్నారు. చెక్పోస్టులో పోస్టింగ్ ఇప్పించుకునేందుకు పలువురు పోటీ పడుతుంటారు. -
రవాణా శాఖలో అవినీతితో తలవంపులు: మంత్రి శిద్ధా
విజయవాడ : రవాణా శాఖలో అవినీతి తలవంపులు తెచ్చేలా ఉందని ఆ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. విజయవాడ ఏపీఆర్టీసీ భవన్లో ఏడాది కాలంలో శాఖ పనితీరుపై ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ... ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడితే అది వారి వ్యక్తిగతంగానే కాకుండా రవాణా శాఖకు కూడా తలవంపు వస్తుందన్నారు. అవినీతిని నిర్మూలించేందుకు రవాణా శాఖ సేవల్లో మరింతగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న 1,140 ప్రాంతాలను గుర్తించామని... వాటిలో 840 చోట్ల రోడ్ల విస్తరణతోపాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. మిగిలిన చోట్ల స్థలాన్ని సేకరించి పనులు చేయాల్సి ఉందన్నారు. కాగా గతేడాది రూ.1,920కోట్ల ఆదాయ లక్ష్యానికి గాను రూ.2,128 కోట్లు వసూలైనట్టు ఈ సమీక్షలో మంత్రికి అధికారులు వివరించారు. -
రెండు వోల్వో బస్సులు సీజ్
నెల్లూరు: అనుమతి లేకుండా లగేజీ తరలిస్తున్న రెండు వోల్వో బస్సులను గురువారం రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా తడ మండలంలో రోజు వారి తనిఖీల్లో భాగంగా వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో వస్తువులు తరలిస్తున్న రెండు వోల్వో బస్సులను సీజ్ చేశారు. చెన్నై నుంచి వచ్చే బస్సులో తరచుగా అక్రమంగా వస్తువులను తరలిస్తుండటంతో అధికారులు ఈ తనిఖీలు చేపడుతున్నారు. డిప్యూటీ రవాణా కమిషనర్ శివరాం ప్రసాద్ నేతృత్యంలో ఈ సోదాలు జరిగాయి. ఆరెంజ్, ధనంజయ ట్రావెల్స్కు చెందిన బస్సులను సీజ్చేశారు. (తడ) -
హైసెక్యూరిటీ కష్టాలు
►ముందే డబ్బులు చెల్లించినా 15 రోజులు ఆగాల్సిందే.. ►ప్లేటు బిగించుకునేందుకు కార్యాలయానికి రావాల్సిందే ►నంబర్ ప్లేట్కు డబ్బులు చెల్లించనిదే రిజిస్ట్రేషన్కు అనుమతి నిరాకరణ ►చోద్యం చూస్తున్న ఆర్టీసీ, రవాణా అధికారులు నెల్లూరు (రవాణా) : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా తయారైంది రవాణాశాఖలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల జారీ పరిస్థితి. ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాణాలతో కూడిన నంబర్లు ప్లేట్లను బిగించాలన్న ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ ప్రక్రియతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా, ఆర్టీసీ శాఖలమధ్య సమన్వయలోపం కారణంగా కాంట్రాక్టరు ఆడింది ఆట పాడిందే పాటగా మారింది. దీంతో రవాణాశాఖలో వాహనదారులకు నంబరు ప్లేటు కష్టాలు వెంటాడుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనానికి తప్పనిసరిగా గుర్తింపుపొందిన సంస్థ నుంచే నంబర్ ప్లేటు బిగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నంబరు ప్లేట్కు ముందే డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న నిబంధనను రవాణాశాఖ జారీ చేసింది. దీనిని అవకాశంగా తీసుకున్న కాంట్రాక్టర్ లింకోఆటోటెక్ సంస్థ నిర్వాహకులు నంబర్ప్లేట్ల జారీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాహనదారునికి 4 రోజుల్లో నంబర్ప్లేట్ జారీ చేయాలన్న నిబంధనను మరచి 15 రోజులకుపైగా తిప్పుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా రవాణాశాఖ కార్యాలయాల్లో రోజుకు 200 వాహనాలకుపైగా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వాటిలో కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోట్రాలీలు, ట్రాక్టర్ట్రాలీలు, లారీలు ఉన్నాయి. వాహనదారులు తమ ఇష్టారాజ్యంగా నంబర్లు ప్లేట్లు బిగించుకునే వీలులేకుండా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్లేట్లను మాత్రమే బిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలో హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు బిగింపు కాంట్రాక్ట్ను లింకో ఆటోటెక్కు అప్పగించింది. జనవరి 15 నుంచి హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు బిగింపు అమలులోకి తీసుకువచ్చారు. ద్విచక్రవాహనానికి రూ.250లు, నాలుగు చక్రాల వాహనానికి రూ.619లు, లారీకి రూ.650లు, ట్రాక్టర్ టేలర్కు రూ.900లు లెక్కన వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని కార్యాలయానికి వచ్చిన వాహనదారులకు ముందుగా నంబరు ప్లేటు కోసం డబ్బులు చెల్లించి రసీదు తీసుకువస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని రవాణా అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక వాహనదారులు ముందుగానే డబ్బులు చెల్లించి రసీదు తీసుకుంటున్నారు. వాస్తవంగా నిబంధనలు ప్రకారం రిజిస్ట్రేషన్కు, నంబరుప్లేటు వ్యవహరానికి ఎలాంటి సంబంధం పెట్టకూడదు. నిర్లక్ష్యంగా సమాధానం కాంట్రాక్టు నిబంధనలు ప్రకారం వాహనదారుడుకు 4 రోజుల్లో నంబరు ప్లేటు జారీచేయాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా హైసెక్యూరిటీ ప్లేటు జారీ 12 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. నంబరు ప్లేటు ఎందుకు ఆల స్యం చేస్తున్నారని ఎవరైన వాహనదారుడు ప్రశ్నిస్తే కాంట్రాక్టు సంస్థ సిబ్బం ది నుంచి నిర్లక్ష్యపు సమాధానం వస్తోం ది. పోనీ రవాణాశాఖ సిబ్బందిని అడిగితే నంబరు ప్లేటు వ్యవహారం తమకేమి తెలియదని సెలవిస్తున్నారు. పెపై చ్చు వాహనాన్ని రవాణా కార్యాలయానికి తీసుకువస్తేనే ప్లేటు ఇస్తామని మెలి కపెడుతున్నారు. రిజిస్ట్రేషన్, నంబరుప్లేటు బిగింపు వ్యవహారంలో రెండుసార్లు బండిని రవాణా కార్యాల యానికి తీసుకురావాల్సి వస్తుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు హైసెక్యూరిటీ నంబరు ప్లేటు వ్యవహరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే రవాణాశాఖ అధికారులు కూడా ఈ వ్యవహారంలో మిన్నకుండిపోతున్నారు. రిపోర్టు చేస్తున్నాం నంబరు ప్లేటు జారీ ఆలస్యం విషయం నాదృష్టికి వచ్చింది. ఈ విషయంపై విచారించి రిపోర్టు తయారు చేస్తున్నాం. ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తాం. నంబరు ప్లేట్ల వ్యవహరం ఆర్టీసీ పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. - ఎన్.శివరాంప్రసాద్,ఉపరవాణా కమీషనర్ -
బ్రీత్ఎనలైజర్లు లేకుండా..ప్రమాదాల నివారణా?
విజయనగరం ఫోర్ట్: మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అధికప్రమాదాలు జరుగుతున్నాయిని భావించిన సర్కారు బ్రీత్ ఎనలైజర్ల ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది. అందుకు తగ్గ పరికరాల కొనుగోలుకు మాత్రం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. జిల్లాలో ఐదుగురు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ఒక్కొక్కరికీ ఒక్కో బ్రీత్ ఎనలైజర్ ఉండాలి. బ్రీత్ ఎనలైజరు ఖరీదు రూ.52వేలు. ఐదు ఎనలైజర్లను కొనుగోలు చేయడానికి నిధులు విడుదల చేయాలంటూ రవాణాశాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. బ్రీత్ ఎనలైజర్ల కొనుగోలుకు నిధులు లేవు. మీరే ఏదోవిధంగా కొను గోలు చేసుకోవాలని ప్రభుత్వం సెలవిచ్చినట్టు భోగట్టా. దీంతో బ్రీత్ ఎనలైజర్లు లేకుండా ప్రమాదాల నివారణ ఎలా సాధ్యమంటూ రవాణాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్రీత్ ఎనలైజరు ఏవిధంగా కొనుగోలు చేయాలనే అలోచనతో అష్టకష్టాలు పడి ఒక బ్రీత్ ఎనలైజరును కొనుగోలు చేశారు. ఇంకా నాలుగు బ్రీత్ ఎనలైజర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. బ్రీత్ఎనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తే మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని గుర్తించవచ్చు. మద్యం తాగి పట్టుబడితే తొలిసారి రూ. 2వేలు, రెండోసారి రూ. 3వేలు అపరాధ రుసుం విధిస్తారు. దీని ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం. ఇదే విషయాన్ని ఇన్చార్జ్ ఆర్టీఓ శివప్రసాద్రావు వద్దప్రస్తావించగా బ్రీత్ఎనలైజర్స్ కొనుగోలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయని మాటవాస్తవమేనని అంగీకరించారు. -
రాష్ట్రావ్యాప్తంగా వాహనాలు తనిఖీ: శిద్దా రాఘవరావు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీ, స్కూల్ బస్సులను తనిఖీ చేసి... రేపటి సాయంత్రంలోగా నివేదిక అందజేయాలని 13 జిల్లాల ఆర్డీవోలను ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో శిద్ధా రఘవరావు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో రోడ్ల పరిస్థితి బాగోలేదన్ని తెలిపారు. రోడ్ల పరిస్థితిపై కూడా నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నష్టాలలో ఉన్న అర్టీసీ గట్టెక్కించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అందులోభాగంగా అర్టీసీ సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలాలు గుర్తించి... వాటిని లీజు ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జేఎన్ఎన్యూఆర్ఎమ్ కింద 500 బస్సులు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. 1000 పల్లె వెలుగు బస్సులు కొనుగోలు చేస్తామని శిద్దా రాఘవరావు చెప్పారు. -
జిల్లాలో అంతరాష్ట్ర సరిహద్దులు మూడు
నాగార్జునసాగర్, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఎనిమిది అంతరాష్ట్ర సరిహద్దులను నిర్ణయించారు. వాటిలో మూడు సరిహద్దులు జిల్లాలోనే ఉన్నాయి. పెద్దవూర మండలం నాగార్జునసాగర్ వంతెన సమీపంలో, దామరచర్ల మండలం వాడపల్లి వంతెన, కోదాడ మండలం దోరకుంట గ్రామ శివారు ప్రాంతాలను నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 21న రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు జిల్లా రవాణాశాఖ సమాయత్తమవుతోంది. వాహనాల రద్దీపై సమాచార సేకరణ మార్చి 16, 17వ తేదీల్లో సీమాంధ్ర, తెలంగాణ రవాణాశాఖ అధికారులు ఆయా రోడ్లలో ఎక్కడినుంచి ఎక్కడికి ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో లెక్కలు కూడా తీశారు. మాచర్ల-నాగార్జునసాగర్కు మధ్యన రోజుకు 800 వాహనాలు తిరుగుతున్నట్టు అంచనా వేశారు. దామరచర్ల మండలం విష్ణుపురం-పొందుగుల మధ్య ఒంగోలు వెళ్లే జాతీయ రహదారి కావడంతో నిత్యం 8వేల వాహనాలు తిరుగుతున్నట్లు లెక్క వేశారు. ఎక్కువ వాహనాలు తిరుగుతున్న ప్రాంతంలో సిబ్బందిని అధిక సంఖ్యలో నియమించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ -ఇతర రాష్ట్రాల మధ్య వాహనాలు, తదితర తనిఖీలు ఎలా కొనసాగుతున్నాయో అదేవిధంగా వచ్చే నెలలో జిల్లా బార్డర్లోని అంతరాష్ట్ర చెక్పోస్టుల వద్ద కొనసాగుతాయి. గతంలో ధాన్యం విక్రయించే సీజన్లలోనే వ్యవసాయ మార్కెట్ వారు తాత్కాలికంగా చెక్పోస్టులు ఏర్పాటుచేసేవారు. ఇప్పుడలా కాకుండా అంతరాష్ట్ర చెక్పోస్ట్టుల వద్ద అన్ని రకాల తనిఖీలు నిర్వహిస్తారు. సిబ్బంది నియామకం ఇలా.. వాహనాల తనిఖీ కోసం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, రవాణాశాఖ కానిస్టేబుళ్లు, హోంగార్డులు తదితర సిబ్బందిని ఈ చెక్పోస్టుల్లో నియమిస్తారు. వీరు మోటార్ వెహికిల్ ట్యాక్స్ చెల్లింపు, పర్మిట్ల గడువు, వాహనాల ఫిట్నెస్, లెసైన్సులు తనిఖీ చేస్తారు. అదే విధంగా ఆర్టీసీ బస్సులతోపాటు ప్రతి ప్రైవేటు బస్సునూ చెక్ చేయనున్నారు. వాటిలో లోపాలు గుర్తిస్తే తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఒక్కో చెక్పోస్టు వద్ద వాహనాల రాకపోకలననుసరించి 11మంది పైచిలుకు సిబ్బందిని ఏర్పాటుచేయనున్నారు. అక్రమ వ్యాపారాలకు చెక్ అమరావతి నుంచి హైదరాబాద్కు, హాలియా, మూసీ తదితర వాగుల నుంచి మాచర్ల, గుంటూరు ప్రాంతాలకు ఇసుక అక్రమంగా రవాణా అవుతుంటుంది. అంతరాష్ట్ర చెక్పోస్టుల ఏర్పాటుతో ఈ అక్రమ వ్యాపారానికి చెక్పడనుంది. భవన నిర్మాణాల్లో ప్లాస్టరింగ్ కోసం అమరావతి ఇసుకను వాడతారు. హాలియా, మూసీ వాగుల నుంచి ఇసుక తక్కువ ధరకు వస్తుండడంతో రోజూ లారీల్లో తరలిస్తుంటారు.అలాగే పల్నాడునుంచి మిర్యాలగూడ, హాలియా మిల్లులకు రేషన్బియ్యం నిత్యం సరఫరా అవుతుంటాయి. వాటికి కొంతమేరకు చెక్పడనున్నది. రైతులకు కష్టం.. ఇప్పటి వరకు సీజన్లలో ఆయా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో చెక్పోస్టులను ఏర్పాటు చేసేవారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు తమ ధాన్యాన్ని హలియా, మిర్యాలగూడలకు పాసుపుస్తకాలు చూయించి తీసుకువచ్చేవారు. ఆయా ప్రాంతాల్లోని మిల్లుల్లో విక్రయించి వెళ్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. అలాగే నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, చింతపల్లి తదితర ప్రాంతాలలో పండించిన పప్పుధాన్యం కందులు, పెసర్లు, మినుములను మాచర్ల దాల్మిల్లులకు తీసుకెళ్లేవారు. ఇప్పుడు ఎటు వెళ్లాలన్నా చెక్పోస్టులు దాటాల్సిందే. సరిహద్దు కూలీల పరిస్థితి అంతే.. వ్యవసాయ సీజన్లో వరికోతలు, పత్తి తీయడం తదితర పనులకు మాచర్ల మండలం నుంచి కూలీలు ఆటోలలో పెద్దవూర, హాలియా మండలాలకు వస్తారు. ప్రస్తుతం పెద్దవూర పత్తిమిల్లులో పనిచేసే కూలీలు సహితం మాచర్ల ప్రాంతం నుంచి ప్రత్యేక వాహనంలో వస్తున్నారు. అలాగే నల్లగొండ శివారు తండాలు, గ్రామాలనుంచి కూలీలు మిరపకాయలు ఏరే సమయంలో ఆటోలలో గుంటూరు జిల్లాలోని పలుగ్రామాలకు వెళ్తుంటారు. చెక్పోస్టులు ఏర్పాటైతే ఆటోలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లే వీలుండదు. కచ్చితంగా పర్మిట్ పన్ను కట్టాల్సి ఉంటుంది. ఐదు కిలోమీటర్లకే వాహన పన్ను హిల్కాలనీ, పైలాన్నుంచి రైట్బ్యాంకుకు పనుల నిమిత్తం వెళ్లే వారికోసం ప్రస్తుతం ఆటోలు తిరుగుతున్నాయి. ఇక వచ్చే నెలలో పర్మిట్ పన్ను చెల్లించనిదే ఆటోలను అటూఇటూ తిరగనివ్వరు. వీటి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరం కోసం అదనంగా పన్ను చెల్లించక తప్పదేమో?. అలాగే హిల్కాలనీ సంఘమిత్ర నుంచే గుంటూరు జిల్లాలోని రైటు బ్యాంకు ఉద్యోగులకు వంట గ్యాస్ సరఫరా చేస్తారు. ఇక వచ్చే నెలలో గ్యాస్ను మరో రాష్ట్రంలోకి అనుమతిస్తారా? అనుమతిస్తే వాహనాలకు కట్టే పర్మిట్ పన్ను గ్యాస్ వినియోగదారులపై అదనపు భారం కానున్నది.