breaking news
TPSC chairman
-
టీపీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియూమకాలు చేపట్టాలి
టీపీఎస్సీ చైర్మన్కు టీపీఆర్టీయూ వినతి మహబూబ్నగర్ విద్యావిభాగం: టీపీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియూమకాలు చేపట్టాలని టీ పీఎస్సీ ఛైర్మన్ గంటా చక్రపాణికి పీఆర్టియు తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకుల పోరాట ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో వారిజీవితాలు స్థిరపడే విధంగా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరారు. లక్షమంది ఉద్యోగుల పదోన్నతులకు ఉపయోగపడే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ను నిర్వహించాలని, టీపీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని కోరారు. గతంలో చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో అనేక అక్రమాలు, తప్పులు జరిగాయాయని, అలాంటివాటికి తావుతావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చలపతిరావు, నరేందర్రెడ్డి, మహిపాల్రెడ్డి, సదానంద్ తదితరులు పాల్గొన్నారు. -
టీపీఎస్సీ చైర్మన్గా ఘంటా చక్రపాణి
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా ఘంటా చక్రపాణి పేరు ఖరారయ్యినట్లు సమచారం. మరికాసేపట్లో జీవో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో జన్మించిన చక్రపాణి, ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ యూనవర్శిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో కాకతీయ యూనివర్శిటీలో సోషయాలజీ ప్రొఫెసర్ పని చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి మతంపై Phd చేశారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో స్వల్పకాలం పాటు న్యూస్రీడర్గా పని చేశారు. జర్నలిస్టుగా వృత్తిజీవితాన్ని ప్రారంభించిన ఆయన.. గడిచిన 20 ఏళ్లుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా ఘంటా పని చేస్తున్నారు. అనేక టెలివిజన్ షోలు ఆయన నిర్వహించారు.