breaking news
TNGOs leaders
-
కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవోస్ నేతలు
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు 3.1444 శాతం డీఏ పెంపుపై టీఎన్జీవోస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. డీఏ పెంచినందుకు సీఎం కేసీఆర్కు టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. సదరు ఫైల్పై సీఎం కేసీఆర్ గురువారం సంతకం చేశారు. ఈ పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. -
టీజేఏసీ నేతల అరెస్ట్
హైదరాబాద్, న్యూస్లైన్: ఏపీ ఎన్జీవోలు శనివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసిన నిజాం కళాశాల విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన టీజేఏసీ చైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాం, టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ తదితరులను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు ప్రకటించటంపై తెలంగాణవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతో గోషామహల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అనంతరం టీజేఏసీ నాయకులు పోలీసుల అనుమతితో స్టేడియం గేటు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు... అక్రమ కేసులు పెడతారేమో?: దేవీప్రసాద్ తెలంగాణ విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు సాయంత్రం వరకు విడుదల చేయకపోవడం చూస్తుంటే అక్రమంగా కేసులు పెట్టాలని కుట్ర పన్నినట్లు భావిస్తున్నాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన అధికారులంతా సీమాంధ్ర సభలో పాల్గొన్నారు. ఈ సభను ప్రభుత్వమే నిర్వహించిందనేందుకు అనేక ఆధారాలున్నాయి. తెలంగాణా ప్రజలపై ఆధిపత్యం చెలాయించేందుకే సభ నిర్వహించారు. ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు లేవనెత్తిన అంశాలన్నీ చర్చించుకుంటే పరిష్కారమయ్యేవే. జాతీయ గీతాన్ని అవమానించారు: శ్రీనివాస్గౌడ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో గజల్ శ్రీనివాస్ జాతీయగీతాన్ని తప్పుగా ఆలపించి అవమానించారు. దీనిపై అక్కడే ఉన్న సచివాలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాం. మేం సభలు పెడితే బారికేడ్లు పెట్టి రాకుండా అడ్డుకుంటారు. సీమాంధ్రుల సభకూ బారికేడ్లు పెట్టి మమ్మల్ని ఎటూ వెళ్లకుండా దిగ్బంధించారు. ఇది ప్రజాస్వామ్యమా? నిరంకుశమా? జై తెలంగాణా అన్న కానిస్టేబుల్ను చితకబాదారు. తెలంగాణ పదం నిషేధితమా? సీమాంధ్రలో పోటీ సభ నిర్వహిస్తాం: మంద కృష్ణమాదిగ ఒక్కసారి తెలంగాణ అని నినదించినందుకే కానిస్టేబుల్ అని కూడా చూడకుండా చితకబాదారు. కలిసి ఉందామంటూనే దాడులకు పాల్పడటం అమానుషం. నగరంలో సీమాంధ్రుల సభకు అనుమతించి రక్షణ కల్పించిన సీఎం కిరణ్ మాకు అనుమతిస్తే సీమాంధ్రలోనే పోటీ సభ నిర్వహిస్తాం. సీమాంధ్ర సభకు జనాలను బస్సుల్లో పోలీసు వాహనాల రక్షణతో తరలించినట్లు మా సభకు తరలించాల్సిన అవసరం లేదు. కేవలం సభకు అనుమతించి రక్షణ కలిస్తే చాలు. సభ ఎప్పుడు, ఎక్కడ? అనే వివరాలను ఆదివారం వెల్లడిస్తాం. చంపేందుకే కలిసుందామంటున్నారు: విఠల్ సభలో 30 శాతం కూడా ఉద్యోగులు లేరు. గజల్ శ్రీనివాస్, విద్యార్థి నేతలు, పీఆర్పీ మాజీ నేత డాక్టర్ మిత్ర వీరంతా ఉద్యోగులేనా? పోలీసులు వారిని లోపలికి ఎలా అనుమతించారో వివరణ ఇవ్వాలి. -
సీమాంధ్ర ఉద్యోగులకు టీఎన్జీవో నేతల పిలుపు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవద్దని, విభజనకు సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు దేవీప్రసాద్, కారం రవీందర్రెడ్డి కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకూ పరిష్కారమని, ఏవైనా అనుమానాలుంటే ఏపీఎన్జీఓలు ప్రత్యేకంగా చర్చ పెడితే వాటిని నివృత్తి చేస్తామని చెప్పారు. ఈ చర్చ కార్యక్రమం ఏర్పాటుపై సీఎం కిరణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చొరవ చూపాలని కోరారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యమంపై ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపుతోందని ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని వారు డి మాండ్ చేశారు. తెలంగాణ ప్రకటన వెలువడి 32 రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని వారు చెప్పారు. సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత తెలంగాణలో జరిగిన పోస్టింగులపైనా పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. 7న టీజేఏసీ తలపెట్టిన శాంతిర్యాలీలో ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శాంతి ర్యాలీని విజయవంతం చేయాలి ఈనెల 7న సిటీ కళాశాల నుంచి ప్రారంభమయ్యే శాంతి ర్యాలీలో ఉపాధ్యాయులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ (టీజేఏసీటీ) పిలుపునిచ్చింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజేఏసీటీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పి.సుధాకర్రెడ్డి మాట్లాడుతూ లక్షా 20 వేల మంది ఉపాధ్యాయులు భాగస్వామ్యమైతే తెలంగాణ వచ్చి తీరుతుందన్నారు.టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్, టీజేఏసీటీ ఛైర్మన్ ఎ. అనంతరాములు కూడా మాట్లాడారు.