tirumalarao
-
ప్రాచీన హోదాను ఖూనీ చేస్తున్నారు
భాషను పట్టించుకోని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు సాహిత్యంపై రాష్ట్ర విభజన ప్రభావం ప్రముఖ కవి ఆచార్య జయధీర్ తిరుమలరావు రాజమహేంద్రవరం కల్చరల్ : రాష్ట్ర విభజన ప్రభావం తెలుగు సాహిత్యంపై స్పష్టంగా కనిపిస్తోందని ప్రముఖ కవి, విమర్శకుడు, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం, పరిశోధనా సంస్థల విశ్రాంత సంచాలకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పాఠకులు కూడా వేరయ్యారని చెప్పారు. పురమందిరంలో ఆదివారం నిర్వహించిన సినారె సంస్మరణ సభలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగ సాహిత్యం పరిణామాన్ని ఆయన విశ్లేషించారు. ఆయన మాటల్లోనే... ప్రభుత్వాల అసమర్ధతకు పరాకాష్ట కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చినా... రెండు తెలుగు రాష్ట్రాలు కలసి ఈ హోదాను చంపేస్తున్నాయి. ఈ విషయం చెప్పడానికి మొహమాటం అవసరం లేదు. పరిశోధనలకు నిధులు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవు. కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో శ్రద్ధ తీసుకోరు. మైసూర్లో ఉన్న భారతీయ భాషల అధ్యయన కేంద్రంలో ఉన్న మన తెలుగు విభాగాన్ని సొంత గడ్డపైకి తెచ్చుకునేందుకు ఎవరూ ప్రయత్నం చేయడం లేదు. మన పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఏనాడో తమ తమిళ విభాగాన్ని అక్కడి నుంచి తమ సొంత రాష్ట్రానికి తీసుకుపోయింది. మన భాషను మనం కాపాడుకోవాలి... అభివృద్ధి చేసుకోవాలి... కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడం విచారకరం. విభజన ప్రభావం సుస్పష్టం తెలంగాణ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలు ఇక్కడికి చేరడం లేదు. పత్రికలు, ప్రచురణకర్తలు విడిపోయారు. ప్రముఖుల రచనలు మినహాయించి, ఒక ప్రాంతంలో అచ్చయ్యే పుస్తకాలు మరో చోట లభ్యం కావడం లేదు. అటు తెలంగాణలో నవకేతన్, నవ తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ప్రజాశక్తి, విశాలాంధ్ర సంస్థలు చాలా వరకూ ఆయా ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. సినారె అందరి వాడు డాక్టర్ సి.నారాయణరెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి రెండు బస్సులను ఏర్పాటు చేశారు. అయితే ఆయన పార్ధివ శరీరం వద్ద ఆ రోజు ఉదయం నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మరి కొందరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ పరిశ్రమకు చెందినవారు ఉన్నారు. మహాకవి అంతిమ ప్రస్థానంలో రాజకీయాలు చూడొద్దు. సినారె అందరి వాడు. ఆయనకు అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులు ఉన్నారు. పూర్వ వైభవం సంతరించుకోవాలంటే... నేను బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్యపీఠానికి ఇన్చార్జి డీన్గా పనిచేశాను. ఈ రోజున సాహిత్యపీఠం పూర్వవైభవం తిరిగి సంతరించుకోవాలంటే గట్టి రాజకీయ సంకల్పం కావాలి. ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం కావాలి. అవి తగిన స్థాయిలో వ్యక్తం కావడంలేదు. కొన్ని సంస్థలు ఉమ్మడి జాబితాలో ఉంటేనే మేలు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం పరిశోధనా సంస్థ వంటివి ఉమ్మడి జాబితాలో ఉంటేనే భాషాసాహిత్యాలకు మేలు జరుగుతుంది. ఈ సంస్థ నిర్వహించే తాళపత్రాల సేకరణ, అధ్యయనం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడిగా జరిగితే మంచిది. ఈ విషయంలో వేరుకుంపట్లు అనవసరం. -
తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటుందనే....
అల్లూరు : మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువతి అల్లూరు చెరువులో హత్యకు గురైన విషాద సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. కోవూరు సీఐ అశోకవర్ధన్, అల్లూరు ఎస్ఐ చల్లా వాసు కథనం మేరకు.. అల్లూరు వడ్డిపాళెంకు చెందిన వల్లెపు స్వప్నప్రియ, బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన వల్లూరు తిరుమలకుమార్ కావలిలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నారు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. గతేడాది ఇంజనీరింగ్ కళాశాలలో విద్యను పూర్తి చేశారు. అయితే తరచూ ఫోన్లో సంభాషించుకుంటూ అప్పుడప్పుడు కలుసుకునేవారు. ఈ నేపథ్యంలో స్వప్నప్రియ తన స్నేహితుడు తిరుమలకు రెండున్నర సవర్ల బంగారు చైన్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో స్వప్నప్రియకు పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ నెల 14న వివాహం జరగాల్సి ఉంది. దీంతో తనకు పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారని, తానిచ్చిన చైన్ తనకు ఇవ్వాలని వారం రోజులుగా తిరుమలకు ఫోన్ చేసి అడుగుతూ ఉంది. అయితే స్వప్న తనను కాదని మరొకరిని వివాహమాడటం ఇష్టం లేని తిరుమల ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆమెకు ఫోన్ చేసి అల్లూరు కస్తూరిదేవి పార్కు ప్రాంతానికి వచ్చి తన వద్దకు రమ్మన్నాడు. దీంతో స్వప్న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తిరుమల వద్దకు వెళ్లింది. అనంతరం ఇద్దరూ కలిసి అల్లూరు-పల్లిపాడు మధ్యన ఉన్న చెరువుకట్ట ప్రాంతానికి వెళ్లారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ..తిరుమల ముందుగా తనతో తెచ్చుకున్న చాకుతో ఆమె గొంతు కింది భాగాన పొడిచాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో జుట్ట పట్టుకుని చెరువులోకి లాక్కెళ్లి తలను పూర్తిగా ముంచాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత తిరిగి తన గ్రామానికి వెళ్లిపోయాడు. స్వప్న ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి వల్లెపు పద్మజ, బంధువులు బుధవారం అల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అనంతరం స్వప్నకు సన్నిహితుడైన తిరుమలను అనుమానించారు. బుచ్చిరెడ్డిపాళెంకు వెళ్లి నిందితుడి అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితుడు తానే ఈ హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి ఇచ్చిన సమాచారం మేరకు చెరువు ప్రాంతంలో పరిశీలించగా చెట్ల మధ్య స్వప్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా మృతదేహం నీటిలో ఉండటంతో ముఖమంతా బాగా ఉబ్బిపోయి గుర్తు పట్టలేనంతగా తయారైంది. కాళ్లు చేపలు తిని పూర్తిగా తెలుపు రంగులోకి మారిపోయాయి. దుర్గంధం వెదజల్లుతుండడంతో మృతదేహాన్ని ఎక్కువసేపు బంధువులు సైతం చూడలేకపోయారు. త్వరలో పెళ్లి చేసుకోవాల్సిన తమ కుమార్తె శవంగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నిందితుడు తిరుమలను శుక్రవారం కోర్టుకు హాజరు పరచనున్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రియురాలిని దారుణంగా హతమార్చి...
-
ప్రియురాలిని దారుణంగా హతమార్చి...
నెల్లూరు : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థినిని... సహ విద్యార్థి హతమార్చి, చెరువులోకి తోసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వల్లూరు తిరుమలకుమార్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే అల్లూరుకు చెందిన స్వప్నప్రియ కావలిలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న సమయంలో బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన తిరుమలకుమార్ ను ప్రేమించింది. అతడికి చాలాసార్లు డబ్బు సాయం కూడా చేసింది. ఒకసారి తన బంగారు గొలసును కూడా అతడికి ఇచ్చింది. అయితే వీరి ప్రేమను స్వప్న తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆమెకు తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారు. ఈనెల 14న వివాహం నిశ్చయించారు. కాగా మూడు రోజుల క్రితం తిరుమలతో కలిసి బయటకు వెళ్లిన స్వప్న...అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. దాంతో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మరోవైపు అల్లూరు చెరువులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్య జరిగి సుమారు 48 గంటలకు పైగానే అయి ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మృతురాలి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రియుడే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్ట్మార్టంకు తరలించారు. కూతురుకి బంగారు భవిష్యత్ కోసం రైతు అయిన స్వప్న తండ్రి కష్టపడి ఆమెను బీటెక్ చదివించినట్లు తెలుస్తోంది.