breaking news
Summer rush
-
Special Trains: విజయవాడ మీదుగా 3 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ నెల 18న మూడు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాకినాడ టౌన్– సికింద్రాబాద్ రైలు (07187) రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ రైలు (07188) ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి, అదే రోజు సాయంత్రం 6.45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. నర్సాపూర్–సికింద్రాబాద్ రైలు (07169) రాత్రి 8 గంటలకు నర్సాపూర్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల స్టేషన్లలో ఆగుతుంది. -
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ నుంచి కాకినాడ, అహ్మదాబాద్కు ప్రత్యేక రైళ్లు సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్–కాకినాడ (07001/07002) ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6.50కి నాంపల్లి నుంచి బయలుదేరి మరుస టి రోజు ఉదయం 5.45కు కాకినాడ చేరుకుంటుంది. తిరు గుప్రయా ణంలో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 కి నాంపల్లి చేరుకుంటుంది. అహ్మదాబాద్కు ప్రత్యేక రైలు..: హైదరాబాద్–అహ్మదాబాద్ (07018/07017) ప్రత్యేక రైలు ఈ నెల 18, 25, మే 2, 9, 16, 23, 30, జూన్ 6, 13, 20, 27 తేదీలలో సాయంత్రం 6.20 కి హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 12.30కు అహ్మదాబాద్ చేరుకుంటుం ది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29 తేదీలలో ఉదయం 6.15కు అహ్మదాబాద్ నుంచి బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.