breaking news
sub rigister
-
15 నిమిషాల్లోనే ల్యాండ్ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు మరింత సులువు కానున్నాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దస్తావేజుల నమోదు కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త సంస్కరణలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు సిద్ధమైంది. మొదటి దశలో ప్రయోగాత్మకంగా మహా హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 10వ తేదీ(గురువారం) నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు కానుంది. గ్రేటర్ పరిధిలోని ఆజంపుర, చిక్కడపల్లి, మేడ్చల్ ఆర్వో, కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకు రిజిస్ట్రేషన్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజుకు కనీసం 48 స్లాట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకేరోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వలన జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్–రిజిస్ట్రార్ కార్యాలయా నికి కనీసం రోజు వారి పని వేళలను కనీసం 48 స్లాట్లుగా కేటాయిస్తారు. దస్తావేజుదారులు నేరుగా registration.telangana.gov.in వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో దస్తావేజులు స్వీకరిస్తారు.144 స్లాట్ల వరకు.. గ్రేటర్ పరిధిలో స్థిరాస్తి దస్తావేజుల తాకిడి అధికంగా గల సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అత్యధికంగా స్లాట్స్ అందుబాటులో ఉంటాయి. 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాలలో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తారు. ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ ఆఫీసుల్లో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్భందిని నియమించారు. ఈ కార్యాలయంలో 144 స్లాట్స్ అందుబాటులో ఉంటాయి. చదవండి: శామీర్పేట్ కారిడార్పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జనమరోవైపు స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానాన్ని దష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రీ ఆర్గనైజేషన్ చేశారు. అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట–సరూర్నగర్ సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల అధికార పరిధిని విలీనం చేశారు.సొంతంగానే.. స్థిరాస్తి దస్తావేజులు నమోదు చేసుకునే వారు డ్యాకుమెంట్ రైటర్లపై ఆధారపడకుండా స్వయంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్సైట్లో ఒక మాడ్యూల్ని ప్రవేశపెట్టారు. మొదటగా సేల్ డీడ్ (Sale Deed) దస్తావేజుల కోసం వెసులుబాటు ఉంది. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజుపైన అమ్మినవాళ్లు, కొన్నవాళ్లు, సాక్షులు సబ్ రిజిస్ట్రార్ సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వలన దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది. దీనిని నివారించడానికి రిజిస్ట్రేషన్ (registration) ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఇ–సిగ్నేచర్ సిస్టంను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఈనెల చివరిలోగా అందుబాటులోకి రానుంది. -
ఆరుగురు సబ్ రిజిస్టార్లను సస్పెండ్ చేసాం
-
ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశాం: స్పెషల్ సీఎస్
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ ఈ మార్చి 20 నుంచి జరిగిన లావాదేవీలపై విచారణ చేపడతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చలానాలను మేం తనీఖీ చేశామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 9 జిల్లాల్లో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారని అన్నారు. ఈ స్కామ్లో 10 మంది పై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వివరించారు. ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రూ.5.40 కోట్ల విలువైన నకిలీ చలానాలను గుర్తించాం.. మొత్తం సొమ్ము రికవరీ చేస్తామాని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు చేపడతాం. అక్రమార్కులు ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని రజత్ భార్గవ స్పష్టం చేశారు. నకిలీ చలానాల వ్యవహారంపై డీఆర్ఐ ద్వారా విచారణ చేపడతామని తెలిపారు. కొన్ని పెండింగ్ డాక్యుమెంట్లను వాణిజ్య పన్నులశాఖకు పంపిస్తున్నాం..దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు. -
అడ్డగోలుగా దుర్వినియోగం
విశ్లేషణ సమాచార హక్కును చివరకు అధికారులు కూడా దుర్వినియోగం చేయడం విచిత్రం. రాని ఆర్టీఐ ప్రశ్నకు లేనిపోని జవాబు రాసి ఒక ప్రభుత్వాధికారిని ఏడిపించిన కథ ఇది. సబ్ రిజిస్ట్రార్ సింగ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ విభాగంలో ప్రజాసమాచార అధికారిగా పనిచేశారు. సబ్ రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు సింగ్ విజయ్ అనే ఒక వ్యక్తికి సుఖ దేవ్ రాజ్ అనే వ్యక్తి రాసిన వీలునామా ప్రతిని అక్రమంగా ఇచ్చినట్టు ఒక నకిలీ ఆర్టీఐ సమాధానం తయారైంది. ఎల్డీ చోప్రా అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు పెట్టుకున్నట్టు, దానికి ఎస్పీఐఓ (డీసీ)(ఎన్) ఆర్టీఐ, 5, ఐడీ నంబర్ 360, 928, తేది 2008 ఫిబ్రవరి 14 నాడు (1) సుఖ దేవ్ రాజ్ రాసిన వీలునామా ప్రతిని విజయ్ అనే వ్యక్తి తన గుర్తింపు రుజువు ఇవ్వ కుండా, చిరునామా ఇవ్వకుండానే తీసుకున్నారని, (2) వీలునామా ప్రతి కావాలనే దరఖాస్తుతోపాటు సుఖ దేవ్ రాజ్ మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిం చలేదని కల్పించారు. చాలా అమాయకంగా కనబడుతున్న ఈ సమాచార వెల్లడి లేఖలో పరోక్షంగా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా తమ గుర్తింపు రుజువు లేకుండా, చిరునామా ఇవ్వకుండా దరఖాస్తు పెడితే వీలునామా ప్రతి ఇవ్వడానికి వీల్లేదు. వీలునామా రాసిన వ్యక్తి మరణించిన తరువాతనే ఆయన వీలునామాను బహిర్గతం చేయాలి. ఆ వ్యక్తి మరణించాడని నమ్మేందుకు డెత్ సర్టిఫికెట్ ఒరిజినల్ కాపీ ఇవ్వవలసిందే. ఇవేవీ లేకుండా వీలునామా ప్రతిని పీఐఓ ఇచ్చేశారనే తీవ్రమైన ఆరోపణ ఇందులో దాగి ఉంది. ఈ విధంగా అక్రమంగా వీలునామా ప్రతి ఇచ్చిన అధికారి సింగ్ అని ఆ సమాధానంలో పరోక్షంగా ఉన్న తీవ్ర ఆరోపణ. ఢిల్లీలో ప్రతిచోటా భూముల కుంభకోణాలు జరుగుతూ ఉంటాయి. కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమించు కుంటూ ఉంటారు, ప్రభుత్వ భూముల ఆక్రమణ మాఫియా నడుస్తూనే ఉంటుంది. ఇటువంటి జవాబు నిజంగా ఇచ్చి ఉంటే అదొక కుంభకోణానికి రాజమార్గమే అవుతుంది. అక్రమంగా వీలునామా ప్రతి ఇచ్చినట్టు అను మానించి సింగ్ను అవినీతి నిరోధక శాఖ తది తరులు పరిశోధించడం మొదలుపెట్టారు, సస్పెండ్ చేశారు. నెలలకొద్ధీ పోలీసు స్టేషన్కు పిలిపించడం, ఇంటరాగేషన్ చేయడం సాగింది. మొత్తం కుటుంబం ఆందోళనతో కాలం గడిపింది. చాలా కాలం తరువాత సింగ్ అవినీతి పరుడు కాడని పరిశోధకులు నమ్మి చార్జిషీట్లో ఆయన పేరు చేర్చలేదు. కాని సింగ్ వీలునామా ప్రతి అక్రమంగా ఇచ్చినట్టుగా రికార్డులో ఉన్న ఈ జవాబు వెనుక కథేమిటో ఆరా తీయాలని ఏసీబీ వ్యాఖ్యానిం చడంతో సింగ్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. కనుక ఒక నాటి పీఐఓ, రిజిస్ట్రేషన్ అధికారి ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నారు. 14 ఫిబ్రవరి 2008 నాడు ఇచ్చినట్టు చెబుతున్న ఆర్టీఐ సమాధానంపై సంతకం చేసిన పీఐఓ పేరేమిటి, దానికి కారణమైన ఆర్టీఐ దరఖాస్తు ప్రతి ఇవ్వండి, పూర్తిఫైలు ప్రతులను కూడా ఇవ్వండి, దానికి సమాధానం కాపీ ఇవ్వండి అని సింగ్ కోరారు. దానికి రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన జవాబేమంటే ఫైలు కనిపించడం లేదు అని. మొదటి అప్పీలులో కూడా అదే సమాధానం. తనకు ఈ పత్రాలు చాలా ముఖ్యమని, తన నిర్దోషి త్వాన్ని రుజువు చేయడం కోసం ఈ పత్రాలు ఇప్పిం చాలని కోరుతూ రెండో అప్పీలు దాఖలు చేసు కున్నారు సింగ్. ఈ కేసులో ఇద్దరు అధికారులు ఒకరినొకరు బాధ్యులను చేసే ప్రయత్నంలో ఉన్నారు. సెంట్రల్ ఏడీఎం, ఉత్తర ఏడీఎంలు రికార్డుల బాధ్యత మరొకరిదే అని పరస్పరం నిందించుకుంటున్నారు. ఎల్డీ చోప్రా అనే వ్యక్తి ఆర్టీఐని దుర్వి నియోగం చేశారని సీఐసీ ఒక తీర్పులో ప్రస్తావించిన విషయాన్ని సింగ్ వివరిస్తూ., ఇదంతా ఒక కుట్ర అని, తనను అనవసరంగా ఇరికించారని వాదిం చారు. ఫైలు పోయిందని అబద్ధం చెబుతూ తప్పిం చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ పత్రాలు ఇప్పించాలని ఆయన కమిషన్ని కోరారు. కమిషన్ ఈ కేసు విచారణను అనేక రోజుల్లో జరపవలసి వచ్చింది. ఫైలు వెతకడానికి కావలసినంత సమయం ఇవ్వవలసి వచ్చింది. సంబంధిత అధికారుల వివరణలు విన్న తరువాత తేలిందేమంటే వీలునామా రాసిన సుఖ దేవ్ రాజ్ 1990లోనే మరణించారని, కనుక వీలునామా పత్రాన్ని ఒకవేళ సింగ్ స్వయంగా ఇచ్చారని అనుకున్నా అందులో అక్రమం ఏమీ లేదని కమిషన్ తేల్చింది. ఏ దరఖాస్తు లేకుండా, దస్తావేజుల పరిశీలన లేకుండా 14 ఫిబ్రవరి నాటి జవాబును కావాలని మరెవరికో లాభం చేకూర్చడం కోసం తయారు చేసి ఉంటారని కూడా నిర్ధారించింది. అదీగాక పీఐఓ, ఇచ్చే సమాధానంలో అడిగిన కాగితం ఉందో లేదో వివరిస్తారేగాని, చిరునామా, గుర్తింపు రుజువు, మరణ ధ్రువీకరణ పత్రం లేకుండానే వీలునామా పత్రం ఇచ్చారు అంటూ దర్యాప్తు నివేదిక రూపంలో ఇవ్వడం అసహజమని కమిషన్ వివరించింది. అసలు అటువంటి ఆర్టీఐ దరఖాస్తే లేదు కనుక ఫైలు దొరకడం లేదని అనుకోవలసి వస్తుందని కూడా అన్నారు. ఇంతకూ 14 ఫిబ్రవరి నాడు పీఐఓ ఎవరు, ఈ నకిలీ ఆర్టీఐ సమాధానం కల్పించిన అధికారి ఎవరు అని కమిషన్ ప్రశ్నించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలు ఈ తప్పుడు ఆర్టీఐ సమాధానం వ్యవహారంపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది. బాధ్యులైన వారికి జరిమానా నోటీసులు జారీ చేసింది. (CIC/SA/A/2015/00125, కేసులో 11.2.2016 తేదీన ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com