breaking news
sri lalitha
-
శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫొటోలు)
-
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం-విశిష్ఠత
శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ హయగ్రీవుడిని రహస్యంగా భావించే సహస్రనామాలను తనకు ఉపదేశించమని అగస్త్య మహర్షి అభ్యర్థిస్తాడు. హయగ్రీవుడు శ్రీ లలితా సహస్రనామాలకు గల అనంత శక్తి కారణంగా దానిని యోగ్యులైన పుణ్యాత్ములకు మాత్రమే తెలియజేయ వలసి ఉంటుందని, అతనికి శ్రీ లలితా సహస్రనామ మూలాన్ని ఉపదేశిస్తాడు.దీనికి స్వరకర్తలు వసిని మొదలైన వాగ్దేవతలు. శ్రీ లలితా దేవి ఆజ్ఞపై వసినీ మొదలైన వాక్ దేవతలు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని రచించారు. వారు రహస్య మంత్రాలతో కూడిన వేయి నామాలను కూర్చారు. శ్రీ లలితా దేవి ఆస్థానంలో మొదటి సారిగా వాక్ దేవతలు సకల దేవతలు మంత్రిణి, దండిని ఇతర శ్రీ మాత అనుచరుల సమక్షంలో ఈ సహస్రనామాన్ని పఠించారు.శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం విని ముగ్ధురాలైన అమ్మ వారు తన భక్తులను అనుగ్రహించేందుకు ఈ విధముగా ప్రకటించింది ‘ఈ నామాలను ఎవరు అనుసరిస్తారో/ ఆచరిస్తారో.. ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర నామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో, వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను‘ అని. కాబట్టి ఈ స్తోత్రం అమ్మ వారి పూర్ణానుగ్రహం తప్ప మరొకటి కాదు.శ్రీ మాత స్వయంగా చెప్పినట్లు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అన్ని రకాల సమస్యలను నయం చేసే శక్తివంతమైన పరిష్కారం.ఈ స్తోత్రం చివరలో బ్రహ్మాండ పురాణంలో స్తోత్రం ఉనికి గురించిన ప్రకటన ఉంది. ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితా రహస్య నామ సాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం ‘లలితోపాఖ్యానం‘లో ఉంది. ఇందులో శ్రీ లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. ఈ స్తోత్రం గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. నిత్యం ఈ స్తోత్రాన్ని పారాయణం చేసేవారు చాలా మంది ఉంటారు. అయితే ఇందులో ఉన్న అమ్మవారి నామాలను అర్థం చేసుకొని వాటిని ధ్యానంలో ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ అనన్యమైన భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు.మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో మన సూక్ష్మ శరీరంలో ఉన్న వివిధ శక్తి కేంద్రములు లేదా చక్రముల వద్ద శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారు ఏ విధంగా విరాజిల్లుతుంటారో వర్ణించబడి ఉంటుంది. ఈ చక్రములన్నీ మన శరీరంలోనే ఉంటాయి. అంటే అర్థము మన దేహము లోనే విభిన్న చక్రాలలో విభిన్న రూపాలలో అమ్మవారు కొలువై ఉంటారు.ఇప్పుడు విద్యుత్ శక్తి వలన ఎలాగయితే మన చుట్టూ ఉన్న ఫ్యాన్ లు, లైట్ లు, ఎ.సి.లు వంటి అనేక విద్యుత్ ఉపకరణాలు పని చేస్తూ ఉంటాయో, అదే విధంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి శక్తి వలన మానవుని సూక్ష్మ శరీరంతో పాటు అండ పిండ బ్రహ్మాండముతో నిండిన ఈ చరాచర జగత్తు మొత్తం నడుస్తుంది.– డా. పి. రాకేష్(సహజ యోగ సంస్థాపకురాలు, శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాల ఆధారంగా) -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన వరాహరూపం సింగర్ శ్రీలలిత (ఫోటోలు)
-
నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చిన 'వరహారూపం' సింగర్
ఒక్క పాటతో ఫేమస్ అయిన సింగర్స్ చాలామంది ఉన్నారు. వాళ్లలో శ్రీ లలిత కూడా ఒకరు. 'వరహారూపం' పాటతో యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టించిన ఈమె.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ చేశారు. తనకు కాబోయే వ్యక్తిని కాస్త డిఫరెంట్గా అందరికీ పరిచయం చేశారు. ఓ పాటతో వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'కాంతార' సినిమా పేరు చెప్పగానే క్లైమాక్స్లో వచ్చే 'వరహారూపం' పాటనే గుర్తొస్తుంది. ఒరిజినల్గా పాడిన సింగర్ ఎవరో మనకు పెద్దగా తెలియదు గానీ ఇదే గీతాన్ని తనదైన శైలిలో పాడి ఆకట్టుకుంది సింగర్ శ్రీ లలిత. దాదాపు ఏడాది క్రితం యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయగా.. దాదాపు 8.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా ఒక్క పాటతో ఈమె తెలుగులో చాలా ఫేమ్ సంపాదించారు. ఇప్పుడు ఈమెనే సీతారామ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)'జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడురాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడుఆనాడు ఎవరూ.. అనుకోనిది..ఇనాడు మనకు.. నిజమైనది..ఆ రామాయణం...మన జీవన పారాయణం' అని చెబుతూ తనకు కాబోయే వాడిని నెటిజన్లకు శ్రీ లలిత పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆమె ఫాలోవర్స్ని ఆకట్టుకుంటోంది.ఇకపోతే శ్రీ లలిత కుటుంబానికి సంగీత నేపథ్యమే. తాత ముత్తాతలు సంగీత విద్వాంసులే. ఈమె తల్లిదండ్రులు కూడా గాయకులే. మూడున్నరేళ్ల వయసులోనే ఓ స్టేజీ మీద పద్యం చెప్పమని అడిగితే.. 'లింగాష్టకం' పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా, బోల్ బేబీ బోల్, స్వరాభిషేకం.. ఇలా 15కి పైగా రియాలిటీ షోల్లో శ్రీ లలిత పాల్గొంది. ఎంఏ మ్యూజిక్ పూర్తి చేసిన ఈమె... తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పాటలు పాడటం విశేషం. (ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన) View this post on Instagram A post shared by Srilalitha Bhamidipati (@srilalithabhamidipati) -
భర్త ఫోన్లో మెసేజ్ చూసినందుకు..
సాక్షి, రాజమండ్రి : అనుమతి లేకుండా ఫోన్లో మెసేజ్ చూసినందుకు భర్త తనను ఇంట్లోంచి గెంటేశాడని ఓ వివాహిత అత్తింటి ముందు ధర్నాకు దిగిన ఘటన పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన శ్రీలలితకు రాజమండ్రికి చెందిన రవీంద్రతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే ఇరువురి మధ్య మనస్పర్దలు వచ్చాయి. ఆదివారం అనుమతి లేకుండా తన ఫోన్కు వచ్చిన ఓ మెసేజ్ను లలిత ఓపెన్ చేసి చూడటంతో రవీంద్ర కోపోద్రేకుడయ్యాడు. లలితను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ లలిత తల్లిదండ్రులతో కలసి అత్తింటి ముందు నిరాహార దీక్షకు దిగారు. మనస్పర్దలు వస్తే సర్ది చెప్పి కలపాల్సిన పెద్ద మనుషులే తమను దూరం చేస్తున్నారని లలిత ఆరోపించారు. -
రాణించిన శ్రీలలిత్
సాక్షి, హైదరాబాద్: బౌలింగ్లో శ్రీలలిత్ (4/25), బ్యాటింగ్లో శ్రీకాంత్ (70) రాణించడంతో ఇక్బాల్ సీఏ జట్టు 207 పరుగుల భారీ తేడాతో వీపీ రాజు క్లబ్పై జయభేరీ మోగించింది. క్రికెట్ అకాడమీల సమాఖ్య (ఎఫ్సీఏ) నిర్వహిస్తున్న ఈ అండర్-19 ఇంటర్ అకాడమీ టోర్నమెంట్లో మొదట ఇక్బాల్ జట్టు 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన వీపీ రాజు క్లబ్ జట్టు 58 పరుగులకే కుప్పకూలింది. శ్రీలలిత్తో పాటు శివ (3/16), శ్రీకాంత్ (2/11) వీపీ రాజు క్లబ్ బ్యాట్స్మెన్ ముప్పుతిప్పలు పెట్టారు. మరో మ్యాచ్లో అర్షద్ ఆల్రౌండ్ మెరుపులతో ఉడిత్యాల్ క్రికెట్ అకాడమీ 33 పరుగుల తేడాతో ఏఏసీఏ (రెడ్) జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఉడిత్యాల్ జట్టు 40 ఓవర్లలో 227 పరుగుల వద్ద ఆలౌటైంది. అర్షద్ (54) అర్ధసెంచరీతో రాణించగా, రాజ్ఠాకూర్ 44 పరుగులు చేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఏఏసీఏ 39.4 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌటైంది. అరుణ్ దేవ (73) పోరాడినా ఫలితం దక్కలేదు. బౌలింగ్లోనూ రాణించిన ఉడిత్యాల్ ఆటగాడు అర్షద్ 3, అబ్రార్ 3 వికెట్లు తీశారు. అండర్-16 విభాగంలో సెయింట్ జాన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్కు చెందిన గ్రీన్, రెడ్ జట్ల మధ్య గురువారం బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్లో ఫైనల్ పోరు జరుగనుంది. ఇతర మ్యాచ్ల స్కోర్లు స్పోర్ట్స్ సెంటర్: 155 (యశ్ గుప్తా 35, అహన్ రెడ్డి 31; కమల్ 3/13), ఎవర్గ్రీన్ సీఏ: 157/7 (నాగరాజు గౌడ్ 35; సూర్యమల్లు 4/42) ఇక్బాల్ సీఏ: 265/7 (వికాస్ 62, శ్రీకాంత్ 70; ప్రశాంత్ 3/35), వీపీ రాజు: 58 (శ్రీలలిత్ 4/25, శివ 2/16) చార్మినార్ సీఏ: 218/7 (జైన్ 88, అబ్దుల్ రెహ్మాన్ 37) అశ్విన్ సీఏ: 180/9 (ప్రజ్వల్ మనోత్ 74)