breaking news
squash tournaments
-
జోష్నాకు షాక్
న్యూఢిల్లీ:ఎల్ గునా ఓపెన్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల సింగిల్స్లో 16వ సీడ్ జోష్నా చినప్ప రెండో రౌండ్లో నిష్క్రమించగా... పురుషుల సింగిల్స్లో సౌరవ్ ఘోషాల్ ముందంజ వేశాడు. శుక్రవారం ఈజిప్ట్లో జరిగిన మ్యాచ్ల్లో జోష్నా 8–11, 5–11, 11–6, 12–10, 4–11తో టినీ గిలిస్ (బెల్జియం) చేతిలో ఓడిపోగా... సౌరవ్ 11–9, 11–1, 3–11, 9–11, 11–6తో ఎడ్మన్ లోపెజ్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. -
సెమీఫైనల్లో దీపిక, జోష్న
డబ్ల్యుఎస్ఏ ఇంటర్నేషనల్ స్క్వాష్ టోర్నీ టొరంటో: భారత స్క్వాష్ మేటి క్రీడాకారిణిలు దీపికా పల్లికల్, జోష్న చినప్పలు డబ్ల్యుఎస్ఏ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ సెమీస్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. క్వార్టర్ఫైనల్లో మూడోసీడ్ దీపిక 11-8, 9-11, 11-6, 7-11, 13-11తో ఐదోసీడ్ జెన్నీ డంక్లాఫ్ (ఇంగ్లండ్)పై విజయం సాధించింది. 75 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ అమ్మాయి కీలక సమయంలో స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించింది. మరో మ్యాచ్లో ఏడోసీడ్ జోష్న 11-1, 11-8, 11-6తో రాచెల్ గ్రిన్హామ్ (ఆస్ట్రేలియా)ను ఓడించింది. కేవలం 23 నిమిషాల్లో జోష్న... రాచెల్ ఆట కట్టించింది. మరో సెమీస్లో టాప్సీడ్ అమండా సోబీ (అమెరికా).. సారా జెన్ పెర్రీ (ఇంగ్లండ్)తో తలపడుతుంది. క్వార్టర్స్లో సోబీ 11-6, 11-3, 11-8తో డెలియా (మలేసియా)పై; పెర్రీ 11-5, 12-10, 9-11, 11-5తో హన్సెన్ (డెన్మార్క్)పై నెగ్గారు.