breaking news
selffinance
-
వైద్య విద్య పీజీ సీట్లు సెల్ఫ్ ఫైనాన్సే..!
ప్రభుత్వం వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లను అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఆరి్థకంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులకు అమ్ముకోవడం అన్యాయం. – 2023 అక్టోబర్ నాలుగో తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలుసెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వమే ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దారుణం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లను అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లో జీవోలను రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు సీట్లను అందేలా చూస్తాను. – 2023 ఆగస్టు 16న నారా లోకేశ్ యువతకు ఇచ్చిన హామీసాక్షి, అమరావతి: కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామనే హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు యువతకు మరోవెన్నుపోటు పొడిచారు. రేవు దాటక తెప్పతగలేసినట్టు.. యువతకు ఇచ్చిన హామీకి తిలోదకాలు ఇచ్చేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాల ల ఏర్పాటులో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను వైఎస్ జగన్ సర్కార్ ప్రారంభించింది.ఈ కళాశాలలకు మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, అనస్థీíÙయా, గైనిక్ విభాగాల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మంజూరు చేసింది. కొత్త కళాశాలలకు ఈ విద్యా సంవత్సరం సీట్లు మంజూరైన క్రమంలో ఫీజులు, సీట్ల భర్తీపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీజీ సీట్లకు సెల్ఫ్ఫైనాన్స్ విధానం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.అడుగడుగూ అబద్ధమే..! ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త వైద్య కళాశాలలను నిర్వహించడం, వాటిని స్వయం సమృద్ధిగా మార్చడం అన్న లక్ష్యంతో గత ప్రభుత్వంలో ఎంబీబీఎస్ కోర్సులకు మాత్రమే కొన్ని సీట్లకు సెల్ఫ్ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని నాడు టీడీపీ తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. ఆందోళనలు చేసింది. తాము గద్దెనెక్కగానే సెల్ఫ్ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేసేస్తామని వైద్య విద్యా ఆశావహులకు నమ్మబలికారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోగా, పీజీ సీట్లకు కూడా అదే విధానాన్ని వర్తింపజేస్తుండటం గమనార్హం. సీట్ల భర్తీ తీరిది...! పీజీ అడ్మిషన్లలో ప్రభుత్వ కళాశాలల్లోని సగం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సగం సీట్లు రాష్ట్ర కోటా కింద కన్వీనర్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్ర కోటాలోని 50 శాతం సీట్లను కనీ్వనర్ కోటా కింద భర్తీ చేసి, మిగిలిన 50 శాతంలో 35 శాతం సెల్ఫ్ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. విద్యార్థుల తెల్లకోటు కల ఛిద్రంఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కొత్త కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ విధానం ఎత్తేయకపోగా, ఏకంగా 10 కళాశాలలను బాబు సర్కార్ ప్రైవేట్కు దారాదత్తం చేసేస్తున్న విషయం తెలిసిందే. కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం మంజూరైన పులివెందుల వైద్య కళాశాల 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా కుట్రపూరితంగా రద్దు చేయించారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రణాళిక ప్రకారం 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో వైద్య కళాశాలలు ప్రారంభం అవ్వకుండా ఉద్దేశపూర్వకంగా మోకాలడ్డి రెండేళ్లలో 2,450 మంది విద్యార్థుల తెల్లకోటు కలను ఛిద్రం చేశారు. కళాశాలలు ప్రైవేట్పరం చేస్తుండటంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి ప్రజా, విద్యార్థి సంఘాలు, మెధావులు, సాధారణ ప్రజలు మద్దతుగా నిలిచారు. -
సెల్ఫ్ ఫైనాన్స్ కష్టాలు...
భారమవుతున్న ‘వర్సిటీ’ చదువులు కంప్యూటర్ సైన్స్, ఫుడ్సైన్స్ కోర్సుల విద్యార్థుల ఇక్కట్లు ఫలించని ‘రెగ్యులర్’ డిమాండ్ కమాన్చౌరస్తా : శాతవాహన యూనివర్సిటీలో ఏళ్ల తరబడి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా కొనసాగుతున్న ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీ నేటివరకు రెగ్యులర్ కోర్సులుగా మారలేదు. దీంతో ఆయా కోర్సులపై ఆసక్తి చూపుతున్న విద్యార్థులకు ఆర్థికభారం తప్పడంలేదు. సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నా పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. పలుమార్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. ఫీజు భారమే.... కంప్యూటర్ సైన్స్కోర్సుకు ప్రస్తుతం రూ.25,010, ఫుడ్సైన్స్, టెక్నాలజీ కోర్సుకు రూ.36,865 ఉంది. మిగతా రెగ్యులర్ సైన్స్కోర్సులకు రూ.3,160 ఉంది. కంప్యూటర్ సైన్స్ కోర్సు 15ఏళ్ల నుంచి, ఫుడ్సైన్స్, టెక్నాలజీ నాలుగేళ్లనుంచి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా కొనసాగుతున్నాయి. వీటిని రెగ్యులర్ కోర్సులుగా మార్చితే విద్యార్థులకు ఫీజులభారం తగ్గనుంది. పరిశోధన, సదస్సులు, ప్రాజెక్టుల విషయంలో ముందుకు సాగే అవకాశాలుంటాయి. సదరు కోర్సులకు పరీక్ష ఫీజులు ఎక్కువగానే ఉంటున్నాయని, వసతి గహాల్లో ఉండడానికి సైతం ప్రాధాన్యత తక్కువగానే ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. పెరుగుతున్న సీట్ల సంఖ్య ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ 30 సీట్ల చొప్పున ఉండేవి. ప్రస్తుతం వాటిని 40కి పెంచారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేరొందిన కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణ ప్రాంతాలకు తరలిరావడంతో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. దీంతో కంప్యూటర్ విద్యపై ఆసక్తి చూపుతున్న తరుణంలో అధిక ఫీజులుండడంతో విద్యార్థుల ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నాయని విమర్శలున్నాయి. ఫుడ్సైన్స్ కోర్సు చేసిన వారు ఫుడ్సెఫ్టీ శాఖలో ఉద్యోగాలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రై వేట్ ఆహార రంగసంస్థలలో వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఫీజుల భారంతో లక్ష్యాలను చేరుకోలేమని, తక్షణమే వీటి నుంచి విముక్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఫలించని విన్నపాలు సెల్ఫ్ఫైనాన్స్ కోర్సులుగా ఉన్న కంప్యూటర్ సైన్స్, ఫుడ్సైన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా పరిస్థితి మారలేదు. ఈ కోర్సులను రెగ్యులర్ చేయాలని గతంలో వీసీ వీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 2015 డిసెంబర్ 11న రెండు కోర్సుల విద్యార్థులు ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి వినతిపత్రంఇచ్చారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ జూలై 29న యూనివర్సిటీని సందర్శించినప్పుడు విద్యార్థులు సమస్యను విన్నవించారు. ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య గతంలో విశ్వవిద్యాలయానికి వచ్చిన సమయంలో వర్సిటీ అధికారులు రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని కోరినట్లు తెలిసింది. ఉన్నత విద్యామండలికి చేరిన విషయం ? కంప్యూటర్సైన్స్, ఫుడ్సైన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని యూనివర్సిటీ అధికారులు ఉన్నత విద్యాశాఖకు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ ఉన్నత విద్యాశాఖ నుంచి ఉన్నత విద్యామండలికి చేరినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖలు ఈ విషయంపై దష్టి సారించి ఈ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చితే విద్యార్థుల బాధలు దూరమవుతాయని కోరుతున్నారు. రెగ్యులర్ కోర్సుగా మార్చాలి –ఆనంద్రావు, విద్యార్థి శాతవాహన యూనివర్సిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగానే కొనసాగుతూనే ఉంది. దీంతో ఆర్థిక భారమవుతోంది. ఈ విద్యా సంవత్సరం ముగియక ముందే స్పందించి రెగ్యులర్ కోర్సుగా మార్చితే విద్యార్థులకు లాభం చేకూరుతుంది. ఇబ్బందులకు గురవుతున్నాం –నవీన్, విద్యార్థి వర్సిటీలో ఫుడ్సైన్స్, టెక్నాలజీ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా సెల్ప్ఫైనాన్స్ కోర్సులాగే ఉంది. ఆహార రంగంలో ప్రస్తుతం ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని దీనిని ఎంచుకుంటే ఫీజులు భారం భరించలేకపోతున్నాం. ప్రభుత్వం స్పందించి కోర్సును రెగ్యులర్ కోర్సుగా మార్చాలి.


