-
సీఎం పదవికి రొటేషన్ ఫార్ములా ఏదీ లేదు
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో ఢిల్లీలో మరోసారి భేటీ అయ్యారు. తర్వాత బఘేల్ మీడియాతో మాట్లాడారు. పార్టీకి చెందిన మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారన్నారు. రాష్ట్రానికి వచ్చి పరిస్థితిని స్వయంగా చూడాలని రాహుల్ను కోరినట్లు తెలిపారు. మంత్రి సింగ్ దేవ్ వాదిస్తున్నట్లుగా రొటేషన్ ఫార్ములా అంటూ ఏదీ లేదని బఘేల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2018లో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్ల తర్వాత రొటేషన్ పద్ధతిలో చేపట్టేందుకు తనకు హామీ ఇచ్చారని, దాని ప్రకారమే సీఎం పీఠం తనకు ఇవ్వాలని సింగ్దేవ్ వాదిస్తున్నారు. -
సర్పంచ్ ఎన్నిక.. ప్రత్యక్షంగానే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలను ఇప్పుడున్నట్లుగానే ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్త పంచాయతీ చట్టం రూపకల్పన సందర్భంగా సర్పంచ్ ఎన్నికలను పరోక్షంగా నిర్వహించే అంశంపై ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి సూచనల మేరకు వివిధ మార్గాలను పరిశీలించింది. అదే సమయంలో పంచాయతీరాజ్ చట్టంలో మార్పుచేర్పులు చేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. పలుమార్లు సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం వివిధ సంస్థలు, నిపుణులతో చర్చించిన తర్వాత తుది నివేదికను ముఖ్యమంత్రికి అందించింది. ఈ నివేదిక ప్రకారం పరోక్ష పద్ధతిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలనే యోచనకు ప్రభుత్వం స్వస్తిపలికినట్లు తెలుస్తోంది. వార్డు సభ్యులను నేరుగా ఎన్నుకోవడం, ఎన్నికైన వార్డు సభ్యులతో సర్పంచ్ను చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకోవాలనే ప్రతిపాదన మంత్రివర్గ ఉపసంఘం ముందుకు వచ్చింది. ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.అయితే పరోక్ష ఎన్నికపై పలు విమర్శలు రావడం, పంచాయతీరాజ్రంగ నిపుణులు కూడా ఈ విధానాన్ని వ్యతిరేకించడం వంటి కారణాలతో దీన్ని విరమించుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరోక్ష పద్ధతిలో అయితే వార్డు సభ్యులను కాపాడుకోవడంతోనే పదవీకాలం గడిచిపోతుందని, అభివృద్ధి పనులపై దృష్టిపెట్టే అవకాశం కూడా సర్పంచ్లకు లేకుండా పోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ విధానంలో మార్పులు... సర్పంచ్లు, వార్డు మెంబర్లకు రొటేషన్ పద్ధతిపై ఐదేళ్లకోసారి రిజర్వేషన్ను మార్చేలా ప్రస్తుతమున్న విధానంలో మార్పులకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇప్పుడు ఖరారు చేసే రిజర్వేషన్నే రెండో విడతకు..అంటే పదేళ్లపాటు పొడిగించాలనే ప్రతిపాదనకు మొగ్గు చూపింది. కొత్తగా పంచాయతీలు ఏర్పడటం, తండాలు, ఆదివాసీ గూడేలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేయనున్నారు. నియోజకవర్గాలవారీగా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన గ్రామ పంచాయతీలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు ఇటీవలే సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల ప్రతిపాదనలను జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు ముఖ్యమంత్రికి అందించారు. దీనికి అనుగుణంగానే పంచాయతీరాజ్ బిల్లులో మార్పుచేర్పులు చేశారు. అయితే కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి వచ్చిన రిజర్వేషన్ను పదేళ్లపాటు అంటే రెండు పదవీకాలాలపాటు వరుసగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతోపాటు పంచాయతీకి ఇద్దరు నిపుణులను సభ్యులుగా నామినేట్ చేయాలనే నిర్ణయాన్ని కూడా చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ చట్ట సవరణ... ప్రస్తుతమున్న మున్సిపల్ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసేందుకు తప్పనిసరిగా గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల కోర్టు కేసులతో మున్సిపాలిటీల అప్గ్రేడేషన్ ప్రక్రియ ఆగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రస్తుతమున్న చట్టానికి సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. రేపు కేబినేట్ భేటీ... కొత్త పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులను ఆమోదించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. మంగళవారం ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అసెంబ్లీరెండు గంటల వ్యవధిలో అసెంబ్లీలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. -
ప్రాదేశిక రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు ప్రాదేశిక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేసిన యంత్రాంగం శుక్రవారం సాయంత్రం గెజిట్లో పొందుపరిచింది. జిల్లాలో 614 ఎంపీటీసీ స్థానాలు, 33 జెడ్పీటీసీ రిజర్వేషన్లు వెల్లడి కావడంతో రాజకీయవర్గాల్లో మరింత హడావుడి మొదలైంది. ఇప్పటికే మున్సిపల్, సాధారణ ఎన్నికల ప్రకటన వెలువడగా.. తాజాగా ప్రాదేశిక పోరుకు సైతం ఏర్పాట్లు చకచకా సాగుతుండడం పార్టీలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. ఈ ఎన్నికలపై న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఒకట్రెండు రోజుల్లో ప్రాదేశిక ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రిజర్వేషన్లు ఇలా.. 2011 జనాభా గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. 1996, 2001, 2006 సంవత్సరాల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లోని రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని రొటేషన్ పద్ధతిని అనుసరించారు. బీసీ రిజర్వేషన్లు మాత్రం వారి జనాభా అంచనాను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లు కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలో 614 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే ఇందులో ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన గ్రామాలతోపాటు.. జీహెచ్ఎంసీలో విలీనం చేయదలచిన పంచాయతీలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. గ్రేటర్లో విలీనం చేయాలనుకున్న 35 గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలు/మున్సిపాలిటీలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలు కూడా దాదాపు కొలిక్కి వచ్చాయి. ఈనేపథ్యంలో త్వరలో వెలువడే ప్రాదేశిక ఎన్నికల ప్రకటనలో ఈ 35 పంచాయతీల్లోని ఎంపీటీసీ స్థానాలకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లాలోని 33 మండలాలకు జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే మండల పరిషత్ అధ్యక్ష పీఠానికి సంబంధించి రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement