breaking news
Rheumatologist
-
హైదరాబాదీ ఆసుపత్రికి స్వర్ణ పతకం అని మార్చండి
హైదరాబాద్: భారతీయ రుమటాలజీ రంగానికి అద్భుతమైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలోని షికాగోలో నిర్వహించిన ఏసీఆర్ నాలెడ్జ్ బౌల్ 2025 పోటీలో ట్రోఫీ, స్వర్ణపతకం సాధించడంతో పాటు, అదే పోటీలో టీమ్ స్పిరిట్ (బృందస్ఫూర్తి) బహుమతినీ సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఏసీఆర్ నాలెడ్జ్ బౌల్ పోటీలో భారతీయ బృందం ఇలా స్వర్ణపతకం సాధించి ట్రోఫీని సగర్వంగా ఎత్తుకోవడం అనేది గడిచిన 40 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతర్జాతీయ యవనికపై భారతీయ రుమటాలజీ విభాగానికి ఈ చరిత్రాత్మక విజయంతో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. విజేతగా నిలిచిన కార్ టైటాన్స్ బృందంలో హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలోని రుమటాలజీ విభాగాధిపతి, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వీరవల్లి శరత్ చంద్రమౌళి, కిమ్స్ ఆస్పత్రికే చెందిన డాక్టర్ మోహిత్, పుదుచ్చేరి జిప్మర్కు చెందిన డాక్టర్ రితేష్ ఉన్నారు. వీరంతా అత్యంత సంక్లిష్టంగా సాగిన అన్ని రౌండ్లలోనూ అసాధారణ ప్రతిభాపాటవాలు కనబరిచారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి సంస్థలన్నింటినీ తోసిరాజని ఛాంపియన్లుగా నిలిచారు. రుమటాలజీ రంగానికి సంబంధించి లోతైన వైద్య పరిజ్ఞానం, పరిశోధనల్లో వస్తున్న తాజా పరిణామాల గురించిన విజ్ఞానం, రుమటాలజీ, ఇమ్యునాలజీ విభాగాలకు సంబంధించిన ప్రతి రంగంలోనూ అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం.. ఇలాంటి అంశాలన్నింటిలో అసాధారణ ప్రతిభ కనబరిచారు.ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేయో క్లినిక్, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో లాంటి అగ్రశ్రేణి సంస్థలతో పోటీపడిన కార్ టైటాన్స్ బృందం అద్భుతమైన వైద్య పరిజ్ఞానం, బృందంగా పనిచేయడం, క్లినికల్ నైపుణ్యాలతో సహచర పోటీదారులతో పాటు జడ్జిలను కూడా ఆకట్టుకుంది.అమెరికన్ కాలేజ్ ఆఫ్ రుమటాలజీ (ఏసీఆర్) ఆధ్వర్యంలో నిర్వహించే ఏసీఆర్ నాలెడ్జ్ బౌల్ పోటీ అనేది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేలమంది వైద్యులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఎంతగానో ఎదురుచూసే ఒక ఎకడమిక్ ఈవెంట్. ఈసారి ఈ సదస్సుకు వందకు పైగా దేశాల నుంచి 15 వేలమంది హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అనేక బృందాలు దీనికి దరఖాస్తు చేసుకోగా, చివరగా అన్ని దేశాల నుంచి వడబోసి అత్యున్నత అకడమిక్, క్లినికల్ సెంటర్ల బృందాల్లోంచి 16 టాప్ బృందాలను నాలెడ్జ్ బౌల్ పోటీ తుది రౌండ్లలో పోటీ పడేందుకు ఎంచుకున్నారు.ఈ అసాధారణ విజయం గురించి డాక్టర్ శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ, “ఈ విజయం కేవలం మా ఒక్క బృందానిదే కాదు. ఇది మొత్తం భారతీయ రుమటాలజీ వైద్యులందరికీ గర్వకారణం. రుమటాలజీ రంగంలో భారతదేశం నుంచి వెళ్లిన వైద్యబృందం ప్రదర్శించిన లోతైన పరిజ్ఞానం, టీమ్ వర్క్, అంతర్జాతీయ నైపుణ్యాలను ఇది ప్రతిబింబిస్తుంది” అని చెప్పారు.ఈ జట్టుకు స్వర్ణపతకం, ట్రావెలింగ్ ట్రోఫీతో పాటు.. అమెరికాలోని ఓర్లాండోలో వచ్చే సంవత్సరం నిర్వహించే ఏసీఆర్ 2026 సదస్సుకు కాంప్లిమెంటరీ రిజిస్ట్రేషన్ను అందించారు and free accommodation for all team members అక్కడ వారు ప్రస్తుత ఛాంపియన్లుగా పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది.అంతర్జాతీయ రుమటాలజీ రంగంలో భారతదేశ ప్రతిభా పాటవాలకు కార్ టైటాన్స్ జట్టు సాధించిన అద్భుత విజయం దేశవ్యాప్తంగా భావి తరాల వైద్యులు, శిక్షణార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.ఏసీఆర్ కన్వర్జెన్స్ 2025 నాలెడ్జ్ బౌల్ ఫలితాలు: ఛాంపియన్: కార్ టైటాన్స్ (కిమ్స్ ఆస్పత్రి, భారతదేశం) - బృందస్ఫూర్తి అవార్డు కూడా రన్నరప్: ద ఆంకా-టీర్స్ (గైసింజర్ మెడికల్ సెంటర్) మూడోస్థానం: స్టిఫ్ కాంపిటీషన్ (యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా) -
ఇద్దరు డాక్టర్ల మధ్యే పోటీ
సాక్షి, నరసరావుపేట : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ అభ్యర్థులుగా డాక్టర్లు పోటీ పడుతున్నారు. జనసేన, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్న ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్యే జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా తొలిసారిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు పోటీ పడుతున్నారు. డాక్టర్ గోపిరెడ్డి పది రోజుల నుంచి ముమ్మరంగా ప్రచారం చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నారు. డాక్టర్ చదలవాడను తమ అభ్యర్థిగా టీడీపీ మంగళవారం తెల్లవారుజామున ప్రకటించింది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు డాక్టర్లు, అందునా ఎముకల, కీళ్ల వైద్య నిపుణులు కావడం గమనార్హం. -
పిల్లల్లో కూడా కీళ్లవాతాలు వస్తాయా?
మా ఫ్రెండ్వాళ్ల అబ్బాయి వయసు 15 ఏళ్లు. ఈమధ్య అతడికి కీళ్లవాతం వచ్చిందని డాక్టర్ చెప్పారు. దాంతో మేము ఎంతగానో ఆశ్చర్యపోయాం. ఇంత చిన్న పిల్లలకు కూడా ఆర్థరైటిస్ వస్తుందా? కీళ్లవాతం లేదా ఆర్థరైటిస్ అనేవి కేవలం పెద్దవాళ్లకే వస్తాయనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఈ వ్యాధులు కేవలం పెద్దవారికే పరిమితం కావు. పిల్లలు కూడా చిన్న వయసులోనే లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఏంకైలోజింగ్ స్పాండలైటిస్, వాస్క్యులైటిస్ వంటి అనేక రకాల కీళ్లవాతాల బారిన పడవచ్చు. వీటన్నింటిలోకీ జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ అనేది చాలా సాధారణంగా చూసే రకం. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు. నెలలు, సంవత్సరాలు లేదా జీవితకాలం కూడా కొనసాగుతాయి. పిల్లలకు కీళ్లవాతం ఎందుకొస్తుంది? : ఈ జబ్బులు ఎందుకు వస్తాయనే అంశంపై నిర్దిష్టంగా ఇంకా కారణాలు పెద్దగా తెలియదు. అయితే రకరకాల పరిశోధనల తర్వాత వీటిని జన్యులోపాలే ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. జన్యులోపం ఉన్నప్పుడు బయటి వాతావరణంలోని క్రిములు, కాలుష్యం వంటి అంశాలు వ్యాధిని తేలిగ్గా ప్రేరేపించగలవు. ఫలితంగా మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి సొంత కణాలనే పరాయివిగా భావించి వాటిపై దాడికి దిగుతాయి. ఈ స్వీయదాడి ఫలితంగా కీళ్లు, కండరాలు మాత్రమేగాక ఇంకా చాలా అవయవాలు ప్రభావితమవుతాయి. అందుకే దీన్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. లక్షణాలు: వ్యాధి లక్షణాలు పిల్లలందరిలో ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించడమే కాకుండా తరచూ మారుతుంటాయి. ఎక్కువగా కీళ్ల మీద ప్రభావం చూపినప్పటికీ, ఊపిరితిత్తులు, కళ్లు, చర్మం, కాలేయం, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలపైన కూడా ఈ వ్యాధి ప్రభావం పడుతుంది. పెద్దవారిలో కనిపించే కీళ్లవాతానికీ, పిల్లల్లో కనిపించే దానికి చాలా తేడాలుంటాయి. పిల్లల్లో అభివృద్ధి చెందే ఎముకలపైన ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లల్లో పెరుగుదల ఆగిపోతుంది. కళ్ల మీద కూడా ప్రభావం పడి, చూపు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ కీళ్లవాతపు వ్యాధులు సాధారణ చికిత్సా విధానాలకు లొంగవు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ లక్షణాల తీవ్రత పెరగడం, మందుల దుష్ప్రభావాలు కలగడం, జీవితకాలపు వైకల్యం వంటి ప్రమాదాలనూ ఎదుర్కొంటారు. కొన్నిసార్లు జబ్బు తీవ్రత అకస్మాత్తుగా ఏ కారణమూ లేకుండానే పెరిగిపోతుంది. మరికొన్నిసార్లు ఎలాంటి తీవ్రతా కనిపించదు. అలాగే మానసిక ఆరోగ్యంపై కూడా ఈ వ్యాధుల ప్రభావం ఉంటుంది. ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యాప్రయత్నాల వంటి పరిణామాలకు దారితీస్తాయి. అందువల్ల కుటుంబసభ్యుల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. విద్యా, వృత్తిపరమైన ఇబ్బందుల కారణంగా రోగులు సామాజికంగా ఇక్కట్లు ఎదుర్కొంటారు. జాగ్రత్తలు : ఈ జబ్బు లక్షణాలను పసిగట్టినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రుమటాలజిస్ట్ను కలవాలి. వ్యాధి నిర్ధారణ జరిగాక, దాని తీవ్రతను బట్టి వారు మందులు సూచిస్తారు. ►రుమటాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు వాడాలి. ►కంటిపైనా, ఇతర అవయవాలపై ఈ వ్యాధి ప్రభావం పడిందో లేదో తెలుసుకునేందుకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ►సరైన పోషణ, క్యాల్షియమ్, విటమిన్–డి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే చాలామందికి ఆహారం ద్వారా కావలసిన క్యాల్షియమ్ లభించదు. అలాంటి వారికి క్యాల్షియమ్ సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ►కీళ్లవాతం వల్ల ఎముకలు, కండరాలు బలాన్ని కోల్పోతాయి. సరైన వ్యాయామం వల్ల ఇవి బలంగా తయారవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వైకల్యాన్ని నివారించవచ్చు. ►ఈ చిన్న చిన్న జాగ్రత్తలతో, రుమటాలజిస్టుల సలహా మేరకు సరైన మందులు వాడటం వల్ల ఈ రోగులు ఎప్పటికీ నార్మల్ జీవితాన్నే గడపవచ్చు. చికిత్సా విధానాలు: గతంలో అరుదుగా కనిపించే ఈ రకం జబ్బుల్ని ఇటీవల తరచూ చూడటం జరుగుతోంది. చికిత్సావిధానాలు కీళ్లవాతం రకాన్ని బట్టి ఉంటాయి. కొంతమందికి చిన్ని నొప్పినివారణ మందులతోనే నయమవుతుంది. మరికొందరిలో స్టెరాయిడ్స్ అవసరమవుతాయి. వాటికీ లొంగని వ్యాధులకూ, ప్రాణాంతకమైన రకాలకు డిసీజ్ మాడిఫైడ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ (డీమార్డ్స్) అనే తరహా మందులు వాడాల్సి ఉంటుంది. వీటిని నివారించలేనప్పటికీ, సరైన సమయంలో వైద్యచికిత్స తీసుకుంటే శాశ్వతంగా ఉపశమనం పొందవచ్చు. -
రుమటాయిడ్ ఆర్థరైటిస్కు నివారణ, చికిత్స ఉన్నాయా?
నా వయసు 34 ఏళ్లు. గత ఆరేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నాను. ఎన్నో రకాల నొప్పి తగ్గించే మందులు వాడుతున్నాను. అయినప్పటికీ ఉపశమనం కలగడం లేదు. నా సమస్యకు నివారణ, చికిత్స ఏమిటి? - స్పందన, నల్లగొండ జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ముఖ్యమైనది. దురదృష్టవశాత్తూ ఈ రకమైన వ్యాధులకు శాశ్వత నివారణ లేదు. అయితే వ్యాధిని ప్రారంభ దశలోనే నిర్ధారణ చేసి, చికిత్స మొదలుపెడితే... జీవననాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. అంతేగాక ఈ వ్యాధి వల్ల వచ్చే క్లిష్టమైన సమస్యలను అరికట్టవచ్చు. చికిత్స చేయించుకునే విషయంలో డాక్టర్ మీద ఉన్న నమ్మకం, వారి మాటలను తూ.చ. తప్పకుండా పాటించడం వంటి అంశాల మీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కానీ దాదాపు సగం మంది రోగులకు ఉండే అపోహలతోనూ, సరైన నమ్మకం ఉంచుకోకపోవడం వల్లనూ డాక్టర్ సూచించిన విధంగా మందులు తీసుకోరు. దాంతో ఫలితాలు కనబడవు. ప్రస్తుతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం ఇచ్చే మందులలో నొప్పి నివారణ మాత్రలు, స్టెరాయిడ్స్ వాడుతుంటారు. చికిత్సకు ఇవి అవసరమే గానీ వీటి దుష్ర్పభావాలు చాలా ఎక్కువగానూ, విపరీతంగానూ ఉంటాయి. కాబట్టి వీటి ఉపయోగంలో పరిమితిని పాటించాలి. వ్యాధి తీవ్రతను మార్చేలా అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మెథోట్రెక్సేట్, లెఫ్లూనమైడ్, సల్ఫాసలాజిన్ పేర్కొనదగినవి. ఈ రకమైన తొలి ప్రాథమ్య ఔషధాలకు లొంగని వ్యాధిగ్రస్తుల్లో ఇటీవల బయలాజికల్ మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు రకాల మందులను రుమటాలజిస్ట్ల సలహా మేరకు వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే మొదలు పెడితే... వ్యాధి తీవ్రతను క్రమంగా తగ్గించి, అదుపులోకి తీసుకురావచ్చు. వ్యాధి తీవ్రతను నియంత్రించిన తర్వాత... రుమటాలజిస్టు మీ మందుల మోతాదును నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తారు. మందులతో పాటు మంచి పోషకాహారం, ఫిజియోథెరపీలతో వ్యాధి వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. - డాక్టర్ విజయ ప్రసన్న పరిమి, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్,కిమ్స్ ఆసుపత్రి, సికింద్రాబాద్


