-
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పర్మిట్
సాక్షి, హైదరాబాద్: పది మంది కలిస్తే చాలు పర్యాటక పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. క్యాబ్లు, మ్యాక్సీ క్యాబ్లు మొదలుకొని బస్సుల వరకు దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించవచ్చు. రాష్ట్రాలు మారినప్పుడల్లా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. కేవలం ఒకే పర్మిట్ తీసుకుంటే చాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వన్ నేషన్– వన్ పర్మిట్’లో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. మన రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లొచ్చు సాధారణంగా పెళ్లిళ్లు, వేడుకలు, తీర్థయాత్రలకు వెళ్లే వారికోసం రవాణాశాఖ ఇప్పటివరకు టూరిస్టు పర్మిట్లు ఇస్తోంది. కాంట్రాక్టు క్యారేజీలుగా తిరిగే వాహనాలు మాత్రం రాష్ట్ర, అంతర్రాష్ట్ర పర్మిట్లపై తిరుగుతున్నాయి. ప్రైవేట్ బస్సులకు ఇచ్చే ఈ పర్మిట్ల వల్ల రవాణా శాఖకు భారీగా ఆదాయం లభిస్తుంది. అయితే కొత్తగా అమల్లోకి రానున్న వెసులుబాటు వల్ల.. ప్రైవేట్ బస్సులు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించి టూరిస్టు పర్మిట్లపై దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాకపోకలు సాగిస్తాయి. ఒక్కసారి పన్ను చెల్లిస్తే ఏడాది పాటు వాహనాలు నడుపుకోవచ్చు. ప్రైవేటు ఆపరేటర్లకు ప్రయోజనం కొత్తగా అమల్లోకి రానున్న టూరిస్టు పర్మిట్ల వల్ల ప్రస్తుతం జిల్లా, రాష్ట్ర స్థాయి పర్మిట్లపై బస్సులు నడిపే ప్రైవేట్ ఆపరేటర్లకు మాత్రం ఎంతో ప్రయోజనం కలుగనుంది. అయితే ఇప్పటికే ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆర్టీసీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టు క్యారేజీలుగా పర్మిట్లు తీసుకొంటున్న ప్రైవేట్ బస్సులు స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి సుమారు 1,150 ప్రైవేట్ బస్సులు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, షిరిడీ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు లక్షకు పైగా క్యాబ్లు అంతర్రాష్ట్ర పర్మిట్లపై ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఇలాంటి వాహనాలన్నీ ఇక నుంచి టూరిస్టు పర్మిట్లపై తిరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు పర్మిట్ల కోసం అదనంగా చెల్లించవలసిన అవసరం ఉండదు. టూరిస్టు పర్మిట్ల ఫీజులివీ 9 సీట్ల కంటే తక్కువ సామర్థ్యమున్న నాన్ ఏసీ వాహనమైతే ఏడాదికి రూ.15 వేలు, ఏసీ వాహనమైతే రూ.25 వేల చొప్పున చెల్లించాలి. 10 మంది ప్రయాణికులకు తక్కువ కాకుండా.. 20 మందికి మించకుండా తిరిగే నాన్ ఏసీ మినీ బస్సులు ఏడాదికి రూ.50 వేలు, ఏసీ మినీ బస్సులు రూ.75 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 23 సీట్లకంటే ఎక్కువ ఉన్న నాన్ ఏసీ బస్సులు టూరిస్ట్ పర్మిట్ కోసం ఏడాదికి రూ.2 లక్షలు, ఏసీ బస్సులు రూ.3 లక్షల చొప్పున ఫీజు చెల్లించి పర్మిట్లు తీసుకోవచ్చు. టూరిస్ట్ పర్మిట్ తీసుకున్న వాహనాలు టోల్ట్యాక్స్, ఇతర చార్జీలన్నీ యథావిధిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా అన్యాయం కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా అన్యాయంగా ఉంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో వైట్ ప్లేట్ కార్లు, ద్విచక్ర వాహనాలను అద్దెకు ఇస్తున్నారు. ర్యాపిడో, ఉబెర్, ఓలా వంటి అగ్రిగేటర్ సంస్థలు కూడా టూరిస్టు పర్మిట్లపై తిరిగే అవకాశం ఉంది. చట్టబద్ధంగా త్రైమాసిక పన్ను చెల్లించి తిరిగే రవాణా వాహనాలకు ఇది చాలా నష్టం. –షేక్ సలావుద్దీన్, రాష్ట్ర ట్యాక్సీ డ్రైవర్ల జేఏసీ చైర్మన్ -
2 నుంచి ఆన్లైన్లో రవాణా శాఖ సేవలు
అవగాహన సదస్సులో ఏవో అరుణాబాయి మంచిర్యాల రూరల్ : ఆగస్టు 2వ తేదీ నుంచి రవాణా శాఖ సేవలన్నీ ఆన్లైన్లోని నిర్వహించనున్నట్లు మంచిర్యాల రవాణా శాఖ(ఆర్టీఏ) పరిపాలనాధికారి(ఏవో) అరుణాబాయి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మంచిర్యాల మండలంలోని వేంపల్లి గ్రామంలో గల ఆర్టీఏ కార్యాలయంలో మీసేవ, ఈసేవ, ఆన్లైన్ నిర్వాహకులకు రవాణా శాఖ ఆన్లైన్ వ్యవస్థపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, జిల్లా రవాణా శాఖ కమిషనర్ డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆన్లైన్ వ్యవస్థపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించామని తెలిపారు. ఇక రవాణా శాఖా సేవలను వినియోగించుకునే వాహన చోదకులు మీసేవ, ఈసేవ, ఆన్లైన్ కేంద్రాలకు వస్తే ఆర్టీఏ శాఖ నియమ నిబంధనల మేరకు సూచించిన ఫీజులను వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. లర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్నెస్ తదితర రవాణా శాఖ సేవలన్నీ కూడా ఆన్లైన్లోనే పొందాలని సూచించారు. మంచిర్యాల పరిధిలోని మీసేవ, ఈసేవ, ఆన్లైన్ నిర్వాహకులు, ఆర్టీఏ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రఫీ పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement