breaking news
Rajkumar Periasamy
-
అమరన్ డైరెక్టర్ తో అమరేంద్ర బాహుబలి చర్చలు
-
ప్రభాస్కు కథ చెప్పిన 'అమరన్' డైరెక్టర్!
హీరో ప్రభాస్ (Prabhas), ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి కాంబినేషన్లో ఓ సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ను కలిసి రాజ్కుమార్ ఓ కథ వినిపించారని, అది నచ్చి ప్రభాస్ సినిమా చేయడానికి ఆసక్తి కనబర్చారని భోగట్టా. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటు రాజ్కుమార్ కూడా ధనుష్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ ఇద్దరూ తమ కమిట్మెంట్స్ పూర్తి చేశాకే ఈ హీరో–దర్శకుడి కాంబినేషన్ గురించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో ది రాజా సాబ్, ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ చిత్రాలున్నాయి. ఇందులో ది రాజాసాబ్ డిసెంబర్ 5న విడుదల కానుంది.చదవండి: అది నా ఫార్ములా కాదు – నిర్మాత ‘దిల్’ రాజు -
'అమరన్' దర్శకుడితో ధనుష్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన టాప్ హీరోయిన్
కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, కథకుడు ఇలా.. పలు ముఖాలు కలిగిన నటుడు ధనుష్. అంతేకాదు బహుభాషా నటుడు. బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ఏక కాలంలో కథానాయకుడిగా మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో ఒకటి ద్విభాషా చిత్రం కుబేర. రెండోది ఇడ్లీ కడై. ఈ చిత్రానికి ధనుష్ దర్శకుడు కూడా. ఇక మూడో చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గోపురం ఫిలిమ్స్ పతాకంపై అన్బు చెళియన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమరన్ చిత్రం ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. వీర సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో ఈయన అమరన్ చిత్రాన్ని తెరకెక్కించిన ఘనత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ధనుష్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం గురించి ఆయన ఒక భేటీలో పేర్కొంటూ ఇది కూడా రియల్ హీరో కథా చిత్రంగానే ఉంటుందని తెలిపారు. సమాజంలో ఎందరో రియల్ లైఫ్ వీరులు, హీరోలు ఉన్నారన్నారు. వారిలో ఒకరి కథగా తమ చిత్రం ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గురించి అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో నటి శృతిహాసన్ నాయకిగా నటించనున్నారన్నదే ఆ అప్డేట్. ఇంతకు ముందే ధనుష్, శృతిహాసన్ 3 అనే చిత్రంలో నటించారు. దీంతో మరో సారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందన్న మాట. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్న శృతిహాసన్ తదుపరి ధనుష్ తో జత కట్టనున్నారన్న మాట. కాగా రాయన్ చిత్రం తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
కమల్ హాసన్ కళ్లలో నీళ్లు తిరిగాయి: ‘అమరన్’ డైరెక్టర్
‘అమరన్’ విడుదలకు ముందు కమల్ హాసన్ గారికి సినిమా మొత్తం చూపించాను. ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా చోట్ల ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఫిమేల్ పర్స్పెక్టివ్ నుంచి ఈ కథని డ్రైవ్ చేయడం ఆయనకు చాలా నచ్చింది. 'ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్ ని చాలా అద్భుతంగా తీసావ్' అని మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోను’అన్నారు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి. ఆయన దర్శకత్వంలో ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. ఆర్. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ అమరన్ చిత్రానికి అన్ని చోట్ల హిట్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాని ఇంతగొప్పగా ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కి ధన్యవాదాలు. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారు. 'అమరన్'తో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. →ఈ చిత్రానికి కమల్ హాసన్ చాలా సపోర్ట్ చేశారు.నాపై ఎంతో నమ్మకం ఉంచారు. పూర్తి స్వేఛ్చ ఇచ్చారు.→ ఈ కథ రాస్తున్నప్పుడే ఇందు క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. రియల్ ఇందు మేడంని కలిసిన తర్వాత ఆ క్యారెక్టర్ కి సాయి పల్లవి అయితేనే పర్ఫెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే చాలా జెన్యూన్, ఎమోషన్ హై ఉన్న క్యారెక్టర్ అది.→ అయితే ఈ చిత్రంలో హీరోగా శివకార్తికేయను తీసుకోవాలని మొదట్లో అనుకోలేదు. ఓసారి ఆయనకు కథని చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ఇంతకుముందు ఆయన ఇలాంటి సినిమాలు చేయలేదు. అందుకే సినిమా చాలా ఫ్రెష్ గా కనిపించింది. ఆయన ఈ కథ విన్న వెంటనే ఈ ప్రాజెక్టు చేసేస్తానని చెప్పారు. తర్వాత కమల్ సార్ ని కలిసాం. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.→ ఇది రియల్ కథ. ఈ కథకు ప్రారంభం, ముగింపు తెలుసు. అలాంటి కథని ఆడియన్స్ కి ఎంగేజింగ్ చెప్పడం, రియాల్టీని, ఫిక్షన్ ని బ్యాలెన్స్ చేయడం, ఒరిజినల్ ఇన్సిడెంట్ ని రీ క్రియేట్ చేయడం ఇవన్నీ ఛాలెంజెస్ అనుకోను గాని ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాను. నాకు రియలిజం ఉన్న సినిమాలు ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.→ యాక్షన్స్ సీక్వెన్స్లు చేయడం, అలాగే కాశ్మీర్లో తీసిన సీక్వెన్సులు ఇవన్నీ ఛాలెంజ్ తో కూడినవి. నేను ప్రతి యాక్షన్ పార్ట్ ని క్లియర్ గా రాసుకున్నాను. ప్రతి షాట్ ని పేపర్ మీద ప్లాన్ చేసుకున్నాను. అవన్నీ స్క్రీన్ మీదకు అచీవ్ చేయడం అనేది రియల్లీ ఛాలెంజింగ్.→ ఇందు గారికి ఈ సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో చెన్నైలో చూశారు. సినిమా చివరకు వచ్చేసరికి చాలా ఎమోషనల్ అయ్యారు.→ ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్పై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతాను.