-
మౌలిక వసతులేవి..?
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంట కోతలు మొదలైనా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు దిశగా పౌరసరఫరాల శాఖ కదలడం లేదు. కేంద్రాల ఏర్పాటు అంశాన్ని జిల్లాల యంత్రాంగానికి అప్పగించిన అధికారులు కొనుగోళ్ల సమయంలో సమకూర్చాల్సిన మౌలిక వసతుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ నెలాఖరు కల్లా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జరుగుతుందని చెపుతున్నప్పటికీ .. కనీస సదుపాయాలను కల్పించే దిశగా దృష్టి పెట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యే 6,500 కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్లు, తేమ పరీక్ష మెషీన్లు, తూకం యంత్రాలు, తాలు తొలగించేందుకు వినియోగించే ఫ్యాన్లు, కాలిపర్స్ వంటి పరికరాలను సమకూర్చాలి. పాత గన్నీ బ్యాగులు తప్ప, కొత్తగా ఒక్కటి రాలేదు. పశ్చిమబెంగాల్ నుంచి కోట్ల సంఖ్యలో గన్నీ బ్యాగులు రావలసి ఉంది. దీంతో ఈ సారి ధాన్యం కొనుగోళ్ల తీరు ఎలా ఉంటుందోనని జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టార్పాలిన్లు లేక రైతుల అవస్థలు.. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు టార్పాలిన్లు అవసరం. వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా టార్పాలిన్లు రక్షణగా ఉంటాయి. అయితే ప్రతి సీజన్లో టార్పాలిన్ల సమస్య తీవ్రంగానే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 1,74,856 టార్పాలిన్లు అవసరం కాగా, ప్రస్తుతం 1.41 లక్షల టార్పాలిన్లు అందుబాటులో ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కలు చెపుతున్నాయి. విన్నోయింగ్ (ధాన్యంలోని రాళ్లు, ఇతర నిరుపయోగమైన వాటిని తొలగించే) మెషీన్లు 5,119 అవసరం ఉండగా, అందుబాటులో ఉన్నవి 2,125 మాత్రమే. ధాన్యాన్ని శుభ్రపరిచే ప్యాడీ క్లీనర్లు 7,501కి గాను 4,195 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తేమను పరీక్షించే మిషన్లు 8,444 అవసరం కాగా, 7,905 అందుబాటులో ఉన్నాయి. మరో 539 కొనుగోలు చేయాల్సి ఉంది. తూకపు యంత్రాలు కూడా ఇంకా 312 అవసరం. ధాన్యంలో తాలును తొలగించేందుకు 5,097 యంత్రాలు అవసరం కాగా, ఒక్కటి కూడా లేదని తెలుస్తోంది. గత యాసంగి సీజన్లో రైతులే ఫ్యాన్లు సమకూర్చుకొని తాలును తొలగించుకున్నారు. అలాగే 4,906 కాలిపర్స్లు అవసరంకాగా, 31 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 5,080 జాలీలు అవసరం కాగా, 43 మాత్రమే ఉన్నాయి. సొంత కల్లాల్లో ఆరబెట్టుకోవలసిందే.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చి కుప్పలుగా పోసి, ఆరబెట్టి విక్రయించే తీరుకు గత యాసంగి నుంచే ప్రభుత్వం చెక్ పెట్టింది. రైతులు పంటలు కోసిన తరువాత పొలాల్లోనే కుప్పలు పోసి , అరబెట్టి, తాలును తూర్పారపట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రైతులు తమ సొంత స్థలాల్లో కల్లాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు నేరుగా విక్రయించేలా బస్తాలలో తీసుకురావలసి ఉంటుంది. టోకెన్ విధానంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. వసతుల కల్పనకు ఆదేశాలు రాష్ట్రంలో జిల్లాల వారీగా అవసరమైన కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశాం. రైతులు పండించిన ధాన్యం మొత్తం సేకరించాలని నిర్ణయించాం. కోతలు ఇప్పుడిప్పుడే మొదలైన నేపథ్యంలో నెలాఖరు కల్లా అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం. అలాగే గన్నీ బ్యాగులతో పాటు టార్పాలిన్లు, విన్నోయింగ్ మెషీన్లు, తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించాం. – పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ -
‘తాలు’ తీస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్ : అకాల వర్షాలు.. అనుకోని రోగాలు.. ఈ విపత్కర పరిస్థితులను తట్టుకుని పంట కోతకు నానా అగచాట్లుపడి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తే సవాలక్ష ఇక్కట్లు.. రైతులు తెచ్చిన ధాన్యంలో తాలు ఎక్కువుందంటూ మిల్లర్లు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యానికి మిల్లింగ్ కేంద్రాల వద్ద క్వింటాల్కు 5 నుంచి 6 కిలోల మేర కోతపెడుతూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎకరంలో 25 క్వింటాళ్లు పండించే రైతు 1.50 క్వింటాళ్ల ధాన్యాన్ని కోల్పోతున్నాడు. ఇంకా, చాలాచోట్ల రంగు మారిందన్న సాకుతో గ్రేడ్–1 ధాన్యానికి సాధారణ రకం ధాన్యం ధరకడుతూ రైతులను నట్టేట ముంచుతున్నారు. మిల్లర్ల మాయాజాలం రాష్ట్రంలో ఈ ఏడాది 40 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరగ్గా, 91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 2 లక్షల మంది రైతుల నుంచి 5,400 కొనుగోలు కేంద్రాల ద్వారా 13.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మిగతా ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోంది. అయితే ధాన్యం దిగుబడి అధికంగా గల కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాల్లో యాసంగిలో మెడవిరుపు, దోమపోటు, కత్తెరరోగం వంటి తెగుళ్లు సోకి పంట దెబ్బతింది. అదీగాక 1010 మినహా 1152, 1156 వంటి విత్తన రకాలు అనుకున్నట్టుగా ఎదగలేదు. దీనికి అకాల వర్షాలు తోడయ్యాయి. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించేప్పుడే ఎండబెట్టి, తాలుతీసి తెస్తున్నారు. ఇక కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాక తూకం సమయంలో తాలు, 17% తేమ నిబంధనలు అడ్డుపెట్టి కొనుగోలు చేస్తున్నారు. అనంతరం ధాన్యాన్ని కేంద్రం నుంచి మిల్లింగ్కు తరలించే సమయంలో అసలు దోపిడీ మొదలవుతోంది. ఇక్కడ ప్రతి 40 కిలోల బస్తాకు 2 నుంచి 3 కిలోలు అంటే క్వింటాల్కు సుమారు 5 నుంచి 6 కిలోలు మిల్లర్లు కోత పెడుతున్నారు. దీనిని ప్రశ్నిస్తే లారీలను వెనక్కి పంపుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో వంద క్వింటాళ్లు తీసుకొచ్చే రైతు ఏకంగా 6 క్వింటాళ్లు నష్టపోతున్నాడు. క్వింటాలుకు కామన్ రకం ధర రూ.1,815 చెల్లించినా కనీసంగా రైతు రూ.10,890 మేర నష్టపోతున్నాడు. అన్నింటికీ కామన్ ధరే.. ప్రస్తుతం గ్రేడ్–1 ధాన్యానికి క్వింటాల్కు రూ.1,835, కామన్ రకానికి రూ.1,815 చెల్లించాలి. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో గ్రేడ్–1 రకం ధాన్యం కొంత రంగుమారింది. చాలాచోట్ల టార్ఫాలిన్లు లేక ధాన్యం నల్లరంగుకు మారింది. దీన్ని సాకుగా చూపి మిల్లర్లు గ్రేడ్–1 రకాన్ని కామన్ రకం కింద చూపుతున్నారు. దీంతో ప్రతి క్వింటాల్కు రూ.20 మేర రైతు నష్టపోతున్నాడు. దీనికి తోడు లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా హమాలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో గ్రామాల్లో అందుబాటులో ఉన్న వారు, ప్రభుత్వ గిడ్డంగుల్లో పనిచేస్తున్న వారితో హమాలీ పనిచేయిస్తున్నారు. వీరు గతంలో క్వింటాల్కు రూ.32 తీసుకోగా ఇప్పుడు రూ.3 అదనంగా కలిపి రూ.35 వసూలు చేస్తున్నారు. ఇది రైతుకు అదనపు భారమవుతోంది. ఇక కొన్నిచోట్ల గన్నీ సంచుల కొరత.. రైతులకు పరీక్ష పెడుతోంది. చదవండి: ఎత్తివేయాలా.. వద్దా..! మిల్లులను సీజ్ చేయడానికి వెనకాడం ధాన్యం కొనుగోళ్లలో తేమ, తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, ఇష్టానుసారం కోత విధించవద్దని రైస్మిల్లర్లకు స్పష్టంగా ఆదేశాలిచ్చాం. దీన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఆ మిల్లులను సీజ్ చేయడానికైనా వెనుకాడం. మా ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం సకాలంలో సబ్సిడీలు ఇవ్వకపోవడం, భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) నుంచి బిల్లులు సరైన సమయంలో రాకపోవడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఈ సీజన్లోనే ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వంపై దాదాపు రూ.1,000 కోట్ల వడ్డీ భారం పడుతోంది. – పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి పొల్లు ఉందని ఇబ్బంది పెడుతుండ్రు నేను ఎకరం పొలంలో వరి వేసిన. పొలమంతా రోగంబడి ఖరాబైంది. ఉన్నకాడికి వడ్లు కొనుగోలు కేంద్రానికి తెస్తే అందులో పొల్లు ఉందని ఇబ్బంది పెడుతుండ్రు. కనీసం పెట్టుబడి కూడా ఎల్లలే. వర్షం వస్తే టార్పాలిన్లు కూడా లేవు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – శ్యాగ ఎల్లయ్య, బీబీపేట, కామారెడ్డి జిల్లా గన్ని సంచులు లేవని కొంటలేరు కొనుగోలు కేంద్రంలో వడ్లుపోసి పది రోజులవుతోంది. తేమ పోయిందాక ఆరబెట్టినా, గన్ని సంచులు లేవని కాంట పెట్టడం లేదు. వడ్లు పోసేందుకు పరదాలు కిరాయికి తెచ్చినం. కిరాయిలు పెరుగుతున్నయి. ధాన్యం త్వరగా కొనుగోలు చేయాలి. – ఎలవేణి సుజాత, సుల్తానాబాద్, కరీంనగర్ ఏ–గ్రేడ్ వడ్లు బీ–గ్రేడ్గా తీసుకుంటున్నరు తాలు, సంచి, మట్టి పేరుతో క్వింటాల్కు రెండు కిలోల చొప్పున తీస్తున్నరు. ఏ–గ్రేడ్ వడ్లను బీ–గ్రేడ్గా లెక్కగడుతున్నారు. దీంతో చాలా నష్టపోతున్నం. అధికారులే చొరవ తీసుకొని న్యాయం చేయాలి. – పిడుగు విమల, సుల్తానాబాద్, కరీంనగర్ -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని వాట్సాప్ ద్వారా సమీక్షించారు. తడిసిన ధాన్యంపై పలు సూచనలు చేస్తూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్, మార్క్ఫెడ్, వేర్హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు వెంటనే మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పారు. టార్పాలిన్లను వెంటనే సమకూర్చాలని, తడవని ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. గాలి దుమారం, భారీ వర్షానికి పాడైన గోదాంలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
మద్దతు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు: జేసీ
వీపనగండ్ల: జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సోమవారం సంగినేనిపల్లిలో డీఆర్డీఏ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మొదటి గ్రేడ్ ధాన్యానికి రూ.1590, రెండవ గ్రేడ్కు రూ.1550 మద్దతు ధర చెల్లిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గన్నీ బ్యాగులు, ధాన్యం వివరాలను ఆన్లైన్ చేసేందుకు ట్యాబ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కొన్న ధాన్యాన్ని గోదాంలకు తరలిస్తామని తెలిపారు. డీఆర్డీఓ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, బీపీఎం భాషనాయక్, జిల్లా మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మయ్య, సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా, సర్పంచ్ వీరయ్య, ఏపీఎం వెంకటేష్, విండో చైర్మన్ శ్రీధర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, రాంరెడ్డి, చిన్నారెడ్డి పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలి
పిట్లం : కందులను కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు సోమవారం పిట్లం వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. కందులు కొనుగోలు చేసేందుకు మార్క్ ఫెడ్ అధికారులు స్థానిక మార్కెట్ యార్డ్లో సహకార సంఘం ఆధ్వర్యంలో కందుల కోనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు. క్వింటాలుకు మద్దతు ధర రూ.5450 నిర్ణయించారు. పిట్లం మండలంలో 2900 క్విటాళ్ల లక్ష్యం నిర్ణయించారు. దీంతో పోమవారం అధికారులు తమకు ఇచ్చిన లక్ష్యం పూర్తియిందని కొనుగోల్లు నిలిపివేశారు. మార్కెట్ ఆవరణలో రైతులు తెచ్చిన కందులు కొనడం లేదని ఆగ్రహించిన రైతులు మార్కెట్ యార్డు ముందు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. మార్కెట్యార్డుకు విక్రయించడానికి కందులను తీసుకువస్తే గేటును మూసి వేస్తుండటం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని లేదంటే ఆందోళన చేపడతామని రైతుల పక్షాణ బండపల్లి సర్పంచ్ గైనిరాములు మద్దతు పలికారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అంతిరెడ్డి రైతులతో మాట్లాడుతూ రహదారిపై రాస్తారోకో చేపట్టడం సరికాదని, అధికారులతో చర్చించి రైతుల కందుల కోనుగోలు చేసే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో అందోళన విరమించిన రైతులు శాంతించి వెళ్లిపోయారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement