breaking news
Prakash singh
-
డాన్లు–గాడ్ఫాదర్ల లంకె ఛేదించాలి!
ఉత్తరప్రదేశ్లో రాజకీయ నేతల పోషణలో, ప్రభుత్వ సంస్థల సంబంధంలో ఉంటూ మాఫియా ఇంతకాలం పెరుగుతూ వచ్చింది. పోలీసు శాఖ, బ్యూరోక్రసీ దశాబ్దాలుగా మాఫియాతో పరస్పర ప్రయోజనకరమైన సహజీవనంలో భాగమైపోయాయి. ఈ సంబంధం దేశంలోని పలు ప్రాంతాల్లో కాలానుగుణంగా పేరుమోసిన డాన్లను సృష్టిస్తూ వచ్చింది. చేదు వాస్తవం ఏమిటంటే– నేరస్థులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య గల ఈ సంబంధాన్ని ఛేదించనట్లయితే... చట్టసభల్లోకి నేరస్థుల ప్రవేశాన్ని నిరోధించడానికి తగు చర్యలు చేపట్టనట్లయితే, నేర న్యాయవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనట్లయితే, బాహ్య ఒత్తిళ్ల నుంచి పోలీసులను బయటపడవేయనట్లయితే... పరిస్థితి మరింత ఘోరంగా దిగజారిపోతుంది. పోలీసు శాఖలో కొనసాగిన నా 35 సంవత్స రాల సర్వీసులో, సరైనవిధంగా కానీ, తప్పు పద్ధతిలో కానీ ఒక మాఫియా డాన్ను చంపిన ఘటన సాధారణ ప్రజానీకంలో ఇంత ఆసక్తిని రేకెత్తించి, ఇంత వివాదాన్ని సృష్టించిన ఉదంతం నాకయితే గుర్తు లేదు. నిజానికి, సీన్ నుంచి కీలక పాత్ర ధారులను పక్కనబెట్టి, జరుగుతున్న సందడిని మాత్రమే ఎవరైనా గమనించినట్లయితే, ఆ శోధన ఒక పాపులర్ నేత హత్యకు గురయ్యా డన్న ముగింపునకు వచ్చి ఉండేది. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల తీవ్రత కంటే ఉత్తరప్రదేశ్లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని పట్టాలు తప్పించేందుకు ప్రతిపక్షం ప్రదర్శిస్తున్న కృతనిశ్చయాన్ని అది ఎక్కువగా ప్రతిఫలించి ఉండేది. నిర్దిష్ట వివరాల్లోకి వస్తే, 1993 నాటికే... ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులతో సంబంధాలను కలిగి, వారి రక్షణలో ఉంటున్న మాఫియా సంస్థల కార్యకలాపాల గురించిన సమాచారాన్ని పొందడానికి నాటి ప్రభుత్వం ఎన్.ఎన్. వోహ్రా కమిటీని నియమించింది. దీనిపై పని ప్రారంభించిన కమిటీ, ‘ప్రభుత్వ యంత్రాంగానికి ప్రాసంగికత లేకుండా చేసి, మాఫియా నెట్వర్క్ వాస్తవానికి ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది’ అని తేల్చిచెప్పింది. ఈ కమిటీ అంతిమంగా కొన్ని సిఫార్సులను చేసింది. కానీ వాటిపై తదుపరి కార్యాచరణ లేకుండాపోయింది. పార్లమెంటులో దీనిపై తీవ్ర చర్చోపచర్చలు జరిగాయి. అయినా ఫలితం లేదు. క్రమంగా పోలీసు శాఖ, బ్యూరోక్రసీ ఈ పరస్పర ప్రయోజనకరమైన సహజీవనంలో భాగమైపోయాయి. ఈ అక్రమ సంబంధం దేశంలోని పలు ప్రాంతాల్లో కాలానుగుణంగా పేరుమోసిన మాఫియా డాన్లను సృష్టిస్తూ వచ్చింది. యూపీలో ముఖ్తార్ అన్సారీ, అతీఖ్ అహ్మద్, శ్రీ ప్రకాశ్ శుక్లా వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు. ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మూలించాలి ఈ సంబంధాన్ని ఎలా ఛేదించవచ్చు? మొదటగా, మాఫియాను రాజకీయ నాయకులు పోషిస్తూ, కాపాడటాన్ని తప్పకుండా నిలిపివేయాలి. రెండు, దాని ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మూలించాలి. మూడు, మాఫియా డాన్లను చట్టానికి జవాబుదారీగా చేయాలి. నాలుగు, ఈ అవినీతి సంబంధంలో భాగంగా ఉన్న పోలీసు అధి కారులు, బ్యూరోక్రాట్ల రెక్కలు కత్తిరించాలి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో మాఫియాకు అత్యున్నత స్థాయిలో ఎలాంటి రాజకీయ రక్షణా లేకుండా పోయింది. దాని ఆర్థిక సామ్రాజ్యాన్ని గణనీయంగా తగ్గించి వేశారు. యూపీ పోలీసుల ప్రకారం– అతీఖ్ అహ్మద్, అతడి కుటుంబ సంపదలో రూ.1,169.20 కోట్లను జప్తు చేయడం, స్వాధీనపర్చు కోవడం లేదా నాశనం చేయడం జరిగింది. దీనికి తోడుగా, 12 మంది ముఠా నేతలు, వారి 29 మంది అనుయాయులకు శిక్ష పడేలా చేశారు. ముఖ్తార్ అన్సారీకి పదేళ్ల జైలుశిక్ష పడగా, అతీఖ్ అహ్మద్కు యావజ్జీవం పడింది. ఎట్టకేలకు న్యాయచక్రాలు కదలడం ప్రారంభించాయి. అయితే ఈ మార్గం సజావుగా లేదు. ఏప్రిల్ 15న అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్ను తప్పనిసరి వైద్య పరీక్షలకు తీసుకువెళ్తుండగా ముగ్గురు గుర్తు తెలియని యువ నేరస్థులు వారిని కాల్చిచంపారు. నిందితులకు రక్షణగా ఉంటున్న భద్రతా సిబ్బంది చేష్టలుడిగి చూస్తుండిపోయారు. వారి స్పందన పేలవంగా ఉండిపోయింది. జరిగింది దురదృష్టకరమైనది. దాన్ని అధిగమించి ఉండవచ్చు. కానీ, ఈ సమయంలో రాష్ట్ర పోలీసులు ఆ నేరంలో భాగస్వాములయ్యారని ఆరోపించడం న్యాయం కాకపోవచ్చు. న్యాయ విచారణ జరగాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించింది. బాందా, హమీర్పుర్, కాస్గంజ్ నుంచి వచ్చిన ఈ ముగ్గురు యువకులు ఎలా ఒక్కటయ్యారు? వారిని ఈ పనిలోకి ఎవరు దింపారు? వారి ఉద్దేశం ఏమిటి? వారికి ఎవరు డబ్బులిచ్చారు? వారికి టర్కీ పిస్టల్స్ ఎవరు అందించారు? హత్యాఘటనలో వారు చేసిన నినాదాలను ఎవరైనా వారికి నేర్పించారా వంటి సంబంధిత విషయాలన్నీ న్యాయ విచారణ, పోలీసు దర్యాప్తులో తేలవలసి ఉంది. ఒక్కసారిగా ఫేమస్ అయిపోవాలన్న కోరికతోనే ఈ హత్యలకు పూనుకున్నామని ఈ ముగ్గురు హంతకులు ఇచ్చిన వివరణ నమ్మేలా లేదు. అతీఖ్ కుమారుడు అసద్ అహ్మద్, అతడి అనుచరుడు గులామ్ హుస్సేన్లను ఏప్రిల్ 13న యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఎన్కౌంటర్ అని చెబుతున్న దానిలో చంపేశారు. 2005లో జరిగిన రాజు పాల్, మరో ఇద్దరు పోలీసుల హత్యలో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ హత్యతో వీరికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. తాజా ఘటనపై తప్పకుండా న్యాయ విచారణ జరిపించాల్సి ఉంది. ఈలోగా నిందాత్మక క్రీడ మొదలైపోయింది. న్యాయవిచారణ వెల్లడించాల్సింది ఇప్పటికే తెలిసి ఉన్న వాస్తవాలను కాదు. ఒక ‘టాంగావాలా’ వేలాది కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టేలా, అధికారులు సైతం మోకాళ్లపై వంగేంత అధికార కేంద్రంగా అతగాడిని మార్చేసిన రాజకీయ నేతలు, పార్టీలు ఏవి అనే విషయాన్ని న్యాయవిచారణ బయటపెట్టాల్సి ఉంది. పాశ్చాత్య మీడియా సైతం ఈ హత్యలకు విశేష ప్రాముఖ్య తనిచ్చింది. కానీ ఈ సందర్భంగా వాటి కపటత్వం బయటపడుతోంది. ఒక మాజీ ఎంపీ హత్యకు గురయ్యాడని ‘బీబీసీ’ నివేదించడమే కాదు, అతడిని మాఫియా డాన్గా కాకుండా రాబిన్ హుడ్గా అభివర్ణించింది. ‘న్యూయార్క్ టైమ్స్’ అయితే, భారత్ చట్టవ్యతిరేక హింసవైపు దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ అమెరికాలోనే ప్రతి సంవత్సరం సగటున వెయ్యి మంది పౌరులు (2022లో 1,096 మంది, 2021లో 1,048 మంది) పోలీసుల కాల్పుల్లో హత్యకు గురవుతున్నారనే విషయాన్ని మర్చిపోయింది. ఇది సమష్టి బాధ్యత మరోవైపున జరిగిన తప్పులన్నింటి భారాన్ని పోలీసులు మోయవలసి వస్తోంది. బహుశా అందుకు వారు అర్హులే కావచ్చు. రాజకీయ వర్గానికి కూడా కొంత జవాబుదారీతనం ఉండకూడదా? మాఫియాను పెంచి పోషించింది వారే మరి. ఈ విషయంలో న్యాయ వ్యవస్థకు కూడా జవాబుదారీతనం లేదా? మునుపటి అలహాబాద్ జిల్లాలో నేర న్యాయ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లు నేతృత్వం వహిస్తున్న సమయంలోనే అతీఖ్ అహ్మద్ పెరిగాడు. అతీఖ్, అతడి అనుయాయులపై ఉన్న 54 కేసులు ఇప్పటికీ విచారణ దశలోనే ఎందుకు ఉంటున్నాయి? అందులో 1979 నాటి పాత హత్య కేసు కూడా ఉందని గుర్తించాలి. దేశంలో నేర న్యాయవ్యవస్థ వాస్తవానికి కుప్పగూలిపోతోందని జస్టిస్ వీఎస్ మలిమథ్ 2003 లోనే హెచ్చరించారు. మరి దిద్దుబాటు చర్యలు చేపట్టారా? పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం గురించి ఎవరైనా పట్టించుకున్న పాపాన పోయారా? చేదు వాస్తవం ఏమిటంటే– నేరస్థులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య సంబంధాన్ని మనం ఛేదించనట్లయితే... శాసనసభలు, పార్లమెంట్లోకి నేరస్థుల ప్రవేశాన్ని నిరోధించడానికి మనం తగిన చర్యలు చేపట్టనట్లయితే, నేర న్యాయవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనట్లయితే, బాహ్య ఒత్తిళ్ల నుంచి పోలీసులను బయటపడవేయనట్లయితే పరిస్థితి మరింత ఘోరంగా దిగజారి పోతుంది! ప్రకాశ్ సింగ్ వ్యాసకర్త మాజీ పోలీసు అధికారి;పోలీసు సంస్కరణల కోసం పనిచేస్తున్నారు. (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
పోలీసింగ్లో తెలంగాణ ‘స్మార్ట్’
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. పోలీసింగ్లో టాప్లో నిలిచింది. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్మార్ట్ పోలీసింగ్ విధానాల అమలుపై ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీసు ఫౌండేషన్ (ఐపీఎఫ్) సంస్థ సమగ్ర సర్వే నిర్వహించింది. మొత్తం 11 అంశాలపై చేసిన ఈ సర్వేలో తెలంగాణకు ఐదింటిలో మొదటి స్థానం, మరో ఐదింటిలో రెండో స్థానం లభించింది. కేవలం ఒక్క దాంట్లో మూడో స్థానం వచి్చంది. ఈ నివేదికను ఫౌండేషన్ చైర్మన్గా ఉన్న ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాష్ సింగ్ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. అస్సాం, బీఎస్ఎఫ్లకూ డీజీగా పని చేసిన ఈయన గతంలో పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి నేతృత్వం వహించారు. ఈ సర్వేలో మొత్తం 1,61,192 నమూనాలు సేకరించి విశ్లేంచారు. అవసరమైన స్థాయిలో, సంతృప్తికరంగా నమూనాలు రాని నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను దీని ఫలితాల్లో చేర్చలేదు. ఆయా అంశాలన్నీ కలిసి పది పాయింట్లకుగాను ఐపీఎఫ్ స్మార్ట్ పోలీసింగ్ సూచీ–2021లో 8.11 స్కోరుతో ఏపీ తొలిస్థానంలో, 8.10 స్కోరుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల పోలీస్ వ్యవస్థ పనితీరు బాగుందని నివేదిక ప్రశంసించింది. 2014లో దిశానిర్దేశం చేసిన మోదీ దేశంలో స్మార్ట్ పోలీసింగ్ విధానాలు అమలుకావాలని, జవాబుదారీతనం, పాదర్శకత, అవినీతిరహితంగా ఇవి సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో దిశానిర్దేశం చేశారు. ఆ సంవత్సరం గువాహటిలో జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్లో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది జరిగి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఏ మేరకు లక్ష్యసాధన జరిగిందో తెలుసుకోవడానికి ఐపీఎఫ్ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఐపీఎఫ్ ప్రతినిధులు ప్రజలను రెండు వర్గాలుగా విభజించి నమూనాలు సేకరించారు. ఇప్పటికే పోలీసులను ఆశ్రయించడం లేదా వారితో సంబంధాలు కలిగి ఉన్న వారితోపాటు ఇప్పటివరకు ఈ రెండూ చేయని వారి నుంచీ నమూనాలు సేకరించారు. శుక్రవారం నుంచి లక్నోలో ఈ సంవత్సరానికి సంబంధించిన డీజీపీల సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం ఫలితాలు విడుదల చేశారు. ఈ సర్వే నేపథ్యంలో స్మార్ట్ పోలీసింగ్కు, పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. స్మార్ట్ పోలీసింగ్లో ఉత్తమ స్కోర్ సాధించిన రాష్ట్రానికి ప్రజల నమ్మకం పొందడంలోనూ అదే స్థాయి ఫలితాలు రావడం దానికి నిదర్శనమని ఐపీఎఫ్ పేర్కొంది. తమ సర్వే నమూనాలో ఇచి్చన చిరునామాకు 25,671 సలహాలు, సూచనలు వచ్చాయని, వాటిని విశ్లేíÙస్తున్నామని తెలిపింది. తెలంగాణలో ఇలా.. పోలీసుల సున్నితత్వంలో 8.27 స్కోరుతో, ప్రజలతో సత్ప్రవర్తన (8.14), సౌలభ్యం (8.29), పోలీసుల స్పందన (8.28), టెక్నాలజీ వినియోగం (8.17) అంశాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రెండ్లీ పోలీసింగ్లో 8.08 స్కోరుతో, స్మార్ట్ పోలీసింగ్ (8.10)లో, నిష్పాక్షిక పోలీసింగ్ (7.97)లో, జవాబుదారీతనం (7.95)లో, పోలీసులపై ప్రజల నమ్మకం (8.07)లో రెండోస్థానంలో, అవినీతిరహిత సేవల అంశంలో 7.78 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. ఏపీలో ఇలా.. మొత్తం 11 అంశాలకుగాను ఏపీ మూడింటిలో మొదటి స్థానంలో నిలిచింది. స్మార్ట్ పోలీసింగ్లో 8.11 స్కోర్తో, జవాబుదారీతనంలో 8 స్కోర్తో, పోలీసులపై ప్రజల నమ్మకంలో 8.15 స్కోర్తో తొలిస్థానంలో నిలిచింది. ప్రజలతో స్రత్పవర్తనలో 8.14 స్కోరుతో రెండు తెలుగు రాష్ట్రాలు పట్టికలో పైభాగాన నిలిచాయి. -
‘కొత్త పోలీసు’ కావాలి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో నిష్పాక్షికంగా, సమర్థంగా, రాజకీయ జోక్యం లేకుండా న్యాయవిచారణ జరిపేందుకు అత్యున్నత శిక్షణ పొందిన పోలీసు అధికారులు కావాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్తో కూడిన ధర్మాసనం శుక్రవారం వ్యాఖ్యానించింది. దేశంలో పోలీసు సంస్కరణలపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన సుప్రీం రాష్ట్ర స్థాయిలో భద్రతా మండలి ఏర్పాటు, పోలీసు అధికారుల ఎంపికలో పారదర్శకత వంటి అంశాలను పేర్కొంటూ కొన్ని ఆదేశాలు జారీ చేసింది. -
సుప్రీం కోర్టులో దినేష్రెడ్డికి చుక్కెదురు
సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: డీజీపీగా తన పదవీకాలం పొడిగింపునకు ఆదేశాలివ్వాలన్న దినేష్రెడ్డి అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే విన్నపాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ (ఎస్ఎల్పీ)ను తోసిపుచ్చుతూ సోమవారం తీర్పు వెలువరించింది. తాను సెప్టెంబర్ 30న పదవీవిరమణ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రకాశ్సింగ్ కేసు (2006)లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దినేష్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ దినేష్రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది.