breaking news
Potu
-
వీధి పోటుతో ఆటుపోట్లు, అసలేంటీ వీధిపోటు!
సాక్షి, సిటీబ్యూరో: కేవలం ఇంట్లోనే కాకుండా ఇంటి బయట కూడా వాస్తు ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటిపై వీధి పోటు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఇంటికి ఎదురుగా నిలువుగా ఉండే వీధి ఇంటి వరకు వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుంచి ఏదో వైపునకు తిరిగినా దాన్ని వీధి పోటుగా గుర్తించాలి. ఈశాన్య భాగంలో వీధిపోటు వల్ల ఆ గృహంలో నివసించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఏ రంగంలో కాలుపెట్టినా పైచేయి సాధిస్తారు. ఈశాన్య భాగంగా వీధి ఉంటే ఆ ఇంట్లోని స్త్రీలకు మేలు. ఇంటి యజమానికి ధనాదాయం బాగుంటుంది. వాయువ్వ భాగంలో వీధి ఉండటం వల్ల ఆ ఇంట్లో స్త్రీలు తీవ్రమైన దు్రష్పభావానికి లోనవుతారు. అనేక సమస్యలు, చికాకులు కలుగుతాయి. వాయువ్వంలో వీధి ఉన్నప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులుగా రాణిస్తారు. నైరుతి భాగంలో వీధి పోటు వల్ల ఇంట్లోకి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!ఆగ్నేయ భాగంలో వీధి పోటు వల్ల మంచి ఫలితాలొస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆగ్నేయంలో వీధి ఉండటం వల్ల ఎన్ని రకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించి ఖర్చు ఏదొక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వస్తుంది.నోట్ : వాస్తు శాస్త్రం వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. మీ సందేహాల నివృత్తికోసం వాస్తు పండితులను సంప్రదించడం ఉత్తమం. ఇదీ చదవండి: యూఎస్కు బైబై : ఇండియాలో రూ.25 కోట్లతో బతికేయొచ్చా? చెప్పండి ప్లీజ్! -
ఆ రూబీ విలువ 50 రూపాయలు: టీటీడీ
సాక్షి, తిరుమల : ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే స్వామి వారి ఆభరణాలు ప్రదర్శిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. పోటులో ఎటువంటి తవ్వకాలు జరగలేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. స్వామివారి ఆభరణాలు ఒక్కగ్రాము కూడా పక్కదారి పట్టలేదని తెలిపారు. వందల ఏళ్ల క్రితం నాటి ప్రాకారాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందునే మరమత్తులు చేపట్టామని పేర్కొన్నారు. పోటు మరమత్తుల్లో భాగంగా ఫైర్ బ్రిక్స్ ఏర్పాటు చేశామన్నారు. ఆలయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీటీడీ పాలక మండలి సభ్యులు సోమవారం శ్రీవారి ఆభరణాలను పరిశీలించారు. అపవాదు వేయడం మంచిది కాదు: టీటీడీ చైర్మన్ పోటులో తవ్వకాలు జరగడం అవాస్తమని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. బొక్కసానికి సంబంధించి మూడు తాళాలు ఉంటాయని.. ఈ మూడు తాళాలు సంబంధిత మూడు విభాగాల వారి వద్ద ఉంటాయని తెలిపారు. సీక్రెట్ లాక్ వల్ల పూర్తి స్థాయి భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఆభరణాలను రికార్డు ప్రకారమే పరిశీలించాం గానీ పూర్తిస్థాయిలో తనిఖీ చేయలేదని ఆయన తెలిపారు. స్వామివారి ఆభరణాల్లోని రూబీ ఒకటి విరిగిపోయిందని.. దాని విలువ 50 రూపాయలుగా నమోదు చేసి ఉందని పేర్కొన్నారు. పూర్వకాలంలో స్టీల్ రాడ్స్ లేనందువల్లే ప్రాకారాలు బలహీన పడ్డాయని అందుకే మరమత్తులు చేపట్టామన్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా రమణ దీక్షితులు అపవాదు వేయడం మంచిది కాదని, ఇకనైనా ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. -
శ్రీవారి పోటులో అగ్నిప్రమాదం
– ఇద్దరు కార్మికులకు గాయాలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని లడ్డూ తయారీ పోటులో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోటు కార్మికులు గాయపడ్డారు. శ్రీవారి ఆలయంలోని పోటులో లడ్డూల తయారీతో పాటు వివిధ రకాల ప్రసాదాలను తయారు చేస్తారు. బుధవారం సాయంత్రం కెజీ.రమేష్, వరద అనే కార్మికులు వడలను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. వడలను వేడివేడి నెయ్యిలో వేస్తున్న సమయంలో నెయ్యి ఎగిసి కింద ఉన్న మంటపై పడింది. దీంతో ఒక్కసారి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కేజీ రమేష్ తప్పించుకునేందుకు వెనక్కి తిరిగాడు. దీంతో అతని వీపు బాగా కాలింది. పక్కనే ఉన్న మరో కార్మికుడు వరద కూడా స్వల్పంగా గాయపడ్డాడు. వారిని హుటాహుటిని స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీటీడీ ఆలయ అధికారులు గాయపడిన వారిని పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అదృష్టవసాత్తు మంటలు అదుపుకావడంతో భారీ అగ్నిప్రమాదం తప్పింది. -
అన్నవరం దేవాలయ వంటశాలలో ప్రమాదం
-
అన్నవరం దేవాలయ వంటశాలలో ప్రమాదం
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని సత్యనారాయణ స్వామి దేవాలయ వంటశాలలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వంటలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించినల్టు సమాచారం. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. -
శ్రీవారి బుందీపోటులో అగ్నిప్రమాదం
తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీ కేంద్రం బుందీ పోటులో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. బుందీపోటులో ప్రసాదం తయారు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఆలయ సిబ్బంది వెంటనే భద్రత అధికారులకు సమాచారం అందించారు. భద్రత అధికారులు బుందీపోటు సిబ్బంది సంయుక్తంగా రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు.