-
ఒకవైపు విద్యార్థులు.. మరోవైపు ఆందోళనలు..
సాక్షి, కామారెడ్డి : అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఒకటైన పాఠశాల నవోదయ పాఠశాల. ఈ విద్యాసంస్థలో ప్రవేశం కొరకు ప్రతి ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్షను ఈ ఏడాది నిజాంసాగర్ మండలంలోని నవోదయ పాఠశాలలో నిర్వహించాలనుకున్నారు. అయితే 9వ తరగతి ప్రవేశ పరీక్ష శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, మధ్నాహ్నం అయినా పరీక్ష ప్రారంభం కాకపోవడంతో పరీక్షపత్రం లీకేజ్ అయ్యిందంటూ వదంతులు వ్యాపించాయి. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నవోదయ పరీక్ష చీఫ్ఎక్సామినర్ మాట్లాడుతూ..కేవలం కొన్నిసాంకేతిక సమస్యల వల్ల మాత్రమే పరీక్ష ఆలస్యం అయిందని, కొందరు ఆకతాయిలు సృస్టిస్తున్న వదంతులను నమ్మవద్దని తల్లిదండ్రులను, విద్యార్థులను కోరారు. ఆందోళనల నడుమ ఎట్టకేలకు 1గంటకు పరీక్ష ప్రారంభమైంది. స్థానిక ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించడంతో వారికి అవగాహన లోపంతోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు. -
నవోదయంలో.. 9వ తరగతికి ఎంట్రీ ఇలా..
నిడమర్రు : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ముందుంటాయి. పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్యను అందించడంలో నవోదయ విద్యాలయాలు ముందువరసలో ఉన్నాయి. వీటిలో ప్రవేశం లభిస్తే విద్యార్థులు నిశ్చింతగా చదువుకోవడమే కాకుండా వారిలోని ప్రతిభ, సృజనాత్మకతకు మరింత మెరుగులద్దవచ్చు. సీబీఎస్ఈ సిలబస్లో బోధిస్తారు. వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం తదితర సదుపాయాలన్నీ ఉచితంగా అందిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9వ తరగతిలో ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి నవోదయ విద్యాసమితి 2018–19 విద్యా సంవత్సరానికి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో ఉన్న పెదవేగి నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీగా ఉన్న 8 సీట్లు భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. దేశంలో 626 విద్యాలయాలు జాతీయ విద్యా విధానం–1986 ప్రకారం దేశవ్యాప్తంగా (తమిళనాడు మినహా) జవహర్ నవోదయ విద్యాలయాలు ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలో 626 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. విద్యతోపాటు విలువలు, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడమే వీటి లక్ష్యం. విద్యార్థి సర్వోతోముఖాభివృద్ధికి అవసరమైన అన్ని రకాల అంశాలకు ఈ విద్యాలయాలు వేదికలుగా ఉన్నాయి. ఇక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్య అందిస్తారు. నిధులన్నీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నవోదయ విద్యా సమితి పనిచేస్తుంది. లేటరల్ ఎంట్రీ విధానంలో భర్తీ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో చేరిన విద్యార్థులు మధ్యలో వైదొలిగితే ఆ ఖాళీలను తొమ్మిదో తరగతిలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చు. సీటు లభించిన ప్రభుత్వోద్యోగుల పిల్లలైతే ప్రతి నెల రూ.1,500 చొప్పున చెల్లించాలి. మిగిలిన వారు ప్రతి నెల రూ. 600 చెల్లిస్తే సరిపోతుంది. ప్రత్యేకతలు ♦ బాల బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి ♦ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, యోగా శిక్షణ ♦ 1ః8 నిష్పత్తిలో కంప్యూటర్ ల్యాబ్ ♦ ఇంటర్(ప్లస్ 2) వరకూ చదువుకోవచ్చు. ♦ నీట్–2017 పరీక్షల్లో 11,875 మంది నవోదయ విద్యార్థులు అర్హత సాధించారు. ♦ జేఈఈ–అడ్వాన్స్డ్ 2017లో 1,176 మంది నవోదయ విద్యార్థులు అర్హత సాధించారు. ప్రవేశం ఇలా.. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. పరీక్ష ఫలితాలను వెబ్సైట్లో ఉంచుతారు. ఎంపికైన విద్యార్థులకు పోస్ట్ ద్వారా సమాచారం అందిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీషు/హిందీ భాషల్లో మాత్రమే ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో 100 మార్కులకు సమాధానాలను గుర్తించడానికి రెండున్నర గంటలు (150 నిమిషాలు)సమయం కేటాయిస్తారు. ఇందులో ఇంగ్లీషు–15, హిందీ–15, గణితం–35, సైన్స్–35 మార్కులకు ప్రశ్నలుంటాయి. అర్హత ఇలా ♦ 2017–18 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి చదవాలి. ♦ విద్యార్థి వయసు 2002 మే 1 నుంచి 2006 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు ఇలా వెబ్సైట్లో ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. మే 19న రాత పరీక్ష పెదవేగి నవోదయ విద్యా కేంద్రం/కేటాయించిన పరీక్షా కేంద్రంలో ఉంటుంది. మరిన్ని వివరాలకు నవోదయ విద్యాలయాల వెబ్సైట్ సందర్శించండి. -
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
పెద్దాపురం : నవోదయ విద్యాలయలో 2016–17 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ వి.మునిరామయ్య తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ అభ్యర్థులు వచ్చే నెల 16వ తేదీలోగా ఆయా మండల విద్యాశాఖాధికారులకు అందజేయాలన్నారు. దరఖాస్తు ఫారాలకు ఎటువంటి రుసుము లేదని, జిరాక్స్లో కూడా స్వీకరిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించే పరిస్థితి లేదని, మండల విద్యాశాఖాధికారులు గమనించి గత ఏడాది కంటే ఈ ఏడాది 15 శాతం రిజిస్ట్రేషన్ పెరిగేలా సహరించాలన్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, బాలికలు తప్పని సరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముని రామయ్య తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement