breaking news
Mustang district
-
బాప్రే!.. ఎంత పెద్ద భయానక దృశ్యం!
న్యూఢిల్లీ: కొన్ని ప్రకృతి వైపరిత్యాలు అత్యంత భయానకంగా ఉంటాయి. పైగా వాటిని మళ్లీ చూడాలనే సాహాసం కూడా చేయలేనంత భయం వేస్తుంది. అచ్చం అలాంటి భయానక ప్రకృతి వైపరిత్యం నేపాల్లో సంభవించింది. (చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..) అసలు విషయంలోకెళ్లితే... నేపాల్లోని ముస్తాంగ్ జిల్లాలో మంచుతో కప్పబడిన పర్వతాలు చూపురులను ఆకర్షించేలా ఎంతో ప్రశాంతంగ కనిపిస్తుంది. అంతే ఇంతలో ఒక్కసారిగా అతి పెద్ద హిమపాతం సంభవిస్తుంది. దీంతో అక్కడున్నవారందరూ భయంతో అరుస్తూ పరుగులు పెడుతుంటారు. అంతే అప్పటివరకు ఎంతో అందంగా కనిపించిన ప్రాంతం కాస్త ఒక్కసారిగా భయంకరంగా మారిపోతుంది. ఒక వైపు నుంచి వేగవంతంగా మంచు అక్కడున్న ప్రజలను తరుముతున్నట్లుగా తెల్లటి బిళ్ల వలే చుట్టుముట్టేస్తుంటుంది. అయితే ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులతో సహా 11 మంది గాయపడ్డారని, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ముస్తాంగ్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఎంత భయానక దృశ్యం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: మదురై జైలులో రూ.100 కోట్లు హాంఫట్) View this post on Instagram A post shared by Everest Base camp 2022 (@mountain.trekking) -
నేపాల్ లో మంచు తుపాను; 12 మంది మృతి
ఖాట్మండు: నేపాల్ లో ఒక్కసారిగా మంచు తుపాన్ సంభవించడంతో 12 మంది మృతి చెందారు. 85 మంది గల్లంతయ్యారు. మృతులందరూ పర్వతారోహకులే. మానంగ్ జిల్లాలోని తొరాంగ్ పాస్ వద్ద ఈ ఘటన జరిగింది. సముద్రమట్టానికి 5,146 అడుగుల ఎత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. హదూద్ తుపాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో మంచు తుపాను సంభవించినట్టు చెబుతున్నారు. మృతుల్లో భారతీయుడు, నలుగురు కెనడా పౌరులు, ముగ్గురు నేపాలీలు ఉన్నారు. 18 మంది పర్వతారోహకులను నేపాల్ ఆర్మీ కాపాడింది. గాయపడిని 14 మందిని ఖాట్మండులో ఆస్పత్రికి తరలించారు. మంచుకింద చాలా మృతుదేహాలు చూశానని స్థానిక గైడ్ ఒకరు చెప్పడంతో గల్లైంతన వారు మరణించివుంటారని భావిస్తున్నారు. దౌలాగిరిలో మరో నలుగురు గల్లంతయ్యారు. వీరి కోసం నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లతో గాలింపు చేపట్టింది.