breaking news
Mohankrishna
-
గ్యాంగ్ లీడర్ మాదే
‘‘నేను చిరంజీవిగారికి వీరాభిమానిని. అందుకే ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ టైటిల్ తమకు కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అడిగారు. ఇవ్వనన్నాను. అమ్మనన్ని కూడా చెప్పాను’’ అన్నారు మోహన్కృష్ణ. ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్తో తాను హీరోగా నటిస్తూ ఓ నిర్మించాలనుకున్నారు మోహన్కృష్ణ. అయితే నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్తో మైత్రి మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం మోహన్కృష్ణ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ రిజిస్టర్ చేశాం. త్వరలో షూటింగ్ ఆరంభించి, చిరంజీవిగారి బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయాలనుకున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. ఈలోపు నాని బర్త్డేకి మా టైటిల్తో టీజర్ రిలీజ్ చేశారు. మా పర్మిషన్ తీసుకోకుండా ఎలా టైటిల్ను ఎనౌన్స్ చేస్తారు. నేను చాంబర్లో ఫిర్యాదు చేశాను. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి’’ అన్నారు. -
గుంతలో పడి బాలుడి మృతి
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఉన్న నీటి గుంతలో పాపగాళ్ల మోహన్కృష్ణ(8) అనే బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రన్నకొట్టాలకు చెందిన లక్ష్మీదేవికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో రెండో వాడైన మోహన్కృష్ణ మున్సిపల్ హైస్కూల్లో మూడో తరగతి చదువుతుండే వాడు. పాఠశాల సమీపంలోనే వారి ఇల్లు ఉంది. దీంతో ఆ బాలుడు ఆదివారం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి మున్సిపల్ హైస్కూల్ మైదానంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పాఠశాల గోడ ఎక్కి ఇంకుడు గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొని రాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. న్యాయం చేయాలని బాధితులతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల ఆవరణలో ఆందోళన చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.