breaking news
Moby quick
-
ఐఆర్సీటీసీతో మోబిక్విక్ ఒప్పందం
ముంబై: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరి జం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో మొబైల్ పేమెం ట్స్ నెట్వర్క్ సంస్థ మోబిక్విక్ జతకట్టింది. ఇరు సంస్థలు ఒప్పందంలో భాగంగా ప్రయాణికులకు తత్కాల్ బుకింగ్సకు ఈ-క్యాష్ పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారుు. ‘ఐఆర్సీటీసీ యాప్, ఐఆర్సీటీసీ ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్లలో డిజిటలైజ్ పేమెంట్స్ కోసం మేం ఇప్పటికే ఐఆర్సీటీసీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. తాజాగా ఇప్పుడు మళ్లీ తత్కాల్ బుకింగ్సకి ఆన్లైన్ పేమెంట్ సేవలను ఆవిష్కరించాం. దీంతో యూజర్లు తత్కాల్ టికెట్లను తక్షణం బుక్ చేసుకోవచ్చు’ అని మోబిక్విక్ సహవ్యవస్థాపకురాలు ఉపాసన టకు తెలిపారు. -
మోబిక్విక్లో ‘నెట్ 1’ రూ.268 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాకు చెందిన పేమెంట్ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించే ‘నెట్ 1’ కంపెనీ.. భారత్కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ‘మోబిక్విక్’లో రూ.268 కోట్లమేర ఇన్వెస్ట్ చేయనున్నది. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒక వ్యూహాత్మక సబ్స్క్రిప్షన్ ఒప్పందం కుదిరింది. దీంతో నెట్ 1కి చెందిన వర్చువల్ కార్డ్ టెక్నాలజీ ఇకపై అన్ని మోబిక్విక్ వాలెట్లతో అనుసంధానం కానున్నది. మోబిక్విక్కు 3.2 కోట్ల మొబైల్ వాలెట్ యూజర్లు ఉన్నారు. వచ్చే మూడేళ్లలో వీరి సంఖ్యను 15 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.