breaking news
meat ban
-
‘బిర్యానీ పార్టీ’తో నిరసన
ఛత్రపతి శంభాజీనగర్/థానె: ఛత్రపతి శంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జంతు వధ శాలలు, మాంసం దుకాణాల మూసివేతకు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పద మయ్యాయి. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు గోకులాష్టమి, ఆగస్ట్ 20న జైన మతస్తుల ‘పర్యుషన్ పర్వ’ల నాడు ఉపవాసాలు, ప్రార్థనలతో రోజంతా గడుపుతారు కాబట్టి మాంసం విక్రయాలపై నగర పరిధిలో నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. దీనిని నిరసిస్తూ ఏఐఎంఐఎం నేత, మాజీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తన నివాసంలో శుక్రవారం బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీతోపాటు, శాకాహార భోజనం కూడా సిద్ధం చేసి ఉంచా. మున్సిపల్ కమిషనర్ వస్తే శాకాహారం వడ్డించే వాణ్ని. మేం ఏం తినాలో, తినకూడదో ప్రభుత్వం చెప్పడం సరికాదు. ఇలాంటి వాటిని మానేయాలి. మాంసంపై నిషేధం విధించడం దురదృష్టకర ఘటన’అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు.చదవండి: మాంసం దుకాణాలు మూసివేయాలి.. మాకేం సంబంధం? -
మాంసం దుకాణాలు క్లోజ్.. 'మాకేం సంబంధం'
'ఎవరు ఏం తింటారో తెలుసుకోవాలన్న ఆసక్తి మా ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. రాష్ట్రంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయ'ని అన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. పంద్రాగస్టు నాడు మాంసం దుకాణాలు మూసివేయాలన్న ఆదేశాలపై విమర్శలు రావడంతో ఆయన ఈవిధంగా స్పందించారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఫుడ్ చాయిస్పై ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించగా, ముందుగా మొదలు పెట్టింది మీరేనని బీజేపీ కౌంటరిచ్చింది.అసలేం జరిగింది?స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న పశువధ శాలలు, మాంసం దుకాణాలు మూసివేయాలని మహారాష్ట్రలోని పలు నగర పాలక సంస్థలు అధికారికంగా ఆదేశాలిచ్చాయి. డోంబివ్లి, కొల్హాపూర్, నాసిక్, ఇచల్కరంజి, జల్గావ్ సహా పలు నగరాల్లో ఇలాంటి ఆదేశాలు వెలుపడ్డాయి. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు కూడా ఆంక్షలు ఏమిటంటూ జనంతో పాటు పలువురు నాయకులు ప్రశ్నించారు. దీంతో సీఎం ఫడ్నవీస్ స్పందించారు.'ఎవరేం తినాలో చెప్పాలన్న ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మా ముందు చాలా సమస్యలు ఉన్నాయ'ని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రత్యేక దినాల్లో పశువధ శాలలు మూసివేయాలని 1988లో ప్రభుత్వం తీర్మానం చేసిందని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది దీన్ని ఆనవాయితీగా అమలు చేస్తున్నారని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఆదేశాలు అమలు చేశార'ని వెల్లడించారు. కాగా, పంద్రాగస్టు నాడు కబేళాల మూసివేత ఆదేశాలను శరద్ పవార్ సీఎంగా ఉన్నప్పుడే మొట్ట మొదటిసారిగా అమలు చేశారని బీజేపీ పేర్కొంది.కరెక్ట్కాదు: పవార్పంద్రాగస్టు నాడు మాంసం అమ్మకాలపై నిషేధం విధించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. 'ఇలాంటి నిషేధం సరికాదు. వివిధ మతాలు, కులాలకు చెందిన వారు పెద్ద నగరాల్లో నివసిస్తుంటారు. మహావీర్ జయంతి, మహాశివరాత్రి పర్వదినాల్లో మాంసం విక్రయాలపై ఆంక్షలు విధించినా ప్రజలు ఆమోదిస్తారు. కానీ స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే, మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఎటువంటి ఆంక్షలు విధించరాదని ప్రజలు కోరుకుంటార'ని చెప్పారు.నాన్-వెజ్ తింటా: జితేంద్రచికెన్, మటన్ సహా అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని కళ్యాణ్ డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించి నాన్-వెజ్ తింటామని ఎన్సీపీ- శరద్పవార్ వర్గం నేత జితేంద్ర అహ్వాద్ ప్రకటించారు. మరోవైపు తమ ఆదేశాలను వెనక్కు తీసుకోబోమని కేడీఎంసీ (KDMC) స్పష్టం చేసింది.హర్షవర్ధన్ ఆశ్చర్యంపంద్రాగస్టు నాడు మాంసం విక్రయాలను నిషేధిస్తూ వివిధ నగర పాలక సంస్థలు ఉత్తర్వులు జారీ చేయడంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను తప్పుబడుతూ, ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు ఏం తినాలో నిర్దేశించి హక్కు ప్రభుత్వానికి లేదన్నారాయన. చదవండి: పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!హైదరాబాద్లోనూ..పంద్రాగస్టు, జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 15, 16 తేదీల్లో పశువధ శాలలు మూసివేయాలని జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఆదేశాలు జారీచేశారు. అయితే చికెన్, చేపల విక్రయాలపై ఎటువంటి ఆంక్షలు లేవని.. బీఫ్ విక్రయశాలలపై మాత్రమే నిషేధం ఉంటుందన్నారు. జీహెచ్ఎంసీ ఆదేశాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ నిషేధం పంద్రాగస్టును మినహాయించాలని కొంతమంది కోరారు. కాగా, బీఫ్ దుకాణాలు, కబేళాలు సంవత్సరంలో ఏడు రోజులు మూసివేయడం అనేది రెండు దశాబ్దాలకు పైనుంచి జరుగుతోందని అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే కొన్ని ప్రత్యేక దినాల్లో బీఫ్ అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని వివరించారు. గాంధీ జయంతి, వర్ధంతి నాడు మటన్ విక్రయించరని చెప్పారు.అమానుషం: అసదుద్దీన్ఆగస్టు 15న కబేళాలను మూసివేయడం అమానుషం, రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సంతోషకరమైన సందర్భమని, ఇలాంటి రోజున ఆంక్షలు విధించడం సరికాదన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వరుసగా రెండు రోజులు కబేళాలు మూసివేయాల్సిన పరిస్థితి రావడంతో, తమ జీవనోపాధి దెబ్బ తింటుందని దుకాణాదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఆదేశాలను లా స్టూడెంట్ ఒకరు కోర్టులో సవాల్ చేశారు. -
ఏరో ఇండియా.. మాంసం విక్రయాలపై నిషేధాజ్ఞలు
బెంగళూరు: ఏరో ఇండియా షో 2025 నేపథ్యంలో బెంగళూరు మహానగరపాలక సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. నగర శివారులో దాదాపు ఇరవై రోజులపాటు మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫిబ్రవరి 10 నుంచి 14 తేదీల మధ్య బెంగళూరు శివారు యలహంకలో 15వ ఎడిషన్ ఎరో ఇండియా షో జరగనుంది. అయితే.. ఎయిర్షో జరిగే ఈ ప్రాంతం నుంచి 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ బెంగళూరు పాలక సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీదాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.ಬಿಬಿಎಂಪಿ ವಲಯದ ಏರ್ಪೋರ್ಸ್ ಸ್ಟೇಷನ್ ನಿಂದ 13 ಕಿ.ಮೀ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಬರುವ ಎಲ್ಲಾ ಮಾಂಸ ಮಾರಾಟದ ಉದ್ದಿಮೆಗಳನ್ನು ದಿನಾಂಕ: 10.02.2025 ರಿಂದ 14.02.2025 ರವರೆಗೆ ಏರ್ಶೋ ಪ್ರದರ್ಶನದ ಪ್ರಯುಕ್ತ ಮುಚ್ಚಲು ಸೂಚಿಸಲಾಗಿದೆ.#BBMP #BBMPCares #bbmpchiefcommissioner #Yelahanka #AeroIndia2025 #AeroIndia #airshow… pic.twitter.com/0Xuq3eA8Hd— Bruhat Bengaluru Mahanagara Palike (@BBMPofficial) January 18, 2025కారణం..ఏరో ఇండియా సందర్భంగా గగనతలంలో వైమానిక ప్రదర్శనలు ఉంటాయి. అయితే మాంసాహారం కోసం వచ్చే పక్షులు, మరీ ముఖ్యంగా కైట్స్ లాంటి పక్షుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది బెంగళూరు మహానగరపాలక సంస్థ. యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్ పరిధిలో.. కేవలం విక్రయాలు జరిపేవాళ్లకు మాత్రమే కాదు మాంసాహారాన్ని వడ్డించే హోటల్స్, రెస్టారెంట్లకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. నగరంలోని చెత్తాచెదారాన్ని యలహంక పరిధిలో డంప్ చేయకూడదని హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే.. బీబీఎంపీ యాక్ట్ 2020, ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ రూల్స్ 1937 రూల్ 91 ప్రకారం శిక్ష ఉంటుందని తెలిపింది.1994 నుంచి బెంగళూరులో ఏరో ఇండియా షో జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన విమానాలు, యుద్ధ విమానాలు ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదే సమయంలో.. రక్షణ శాఖ మంత్రుల సదస్సు జరగనుంది. ఎరోస్పేస్ కంపెనీల నడుమ భారీ ఒప్పందాలకు ఏరో ఇండియా కేంద్రం కానుంది.🚀 The countdown begins!Hon'ble Raksha Mantri Shri #RajnathSingh launched the official #AeroIndia2025 teaser video today at the Ambassadors' Round Table.Mark your calendars for Asia's premier biennial airshow, taking flight in Bengaluru from 10th-14th February 2025!… pic.twitter.com/UCu5iXSsgN— Aero India (@AeroIndiashow) January 10, 2025 -
యోగికి పదిరోజుల సమయమిచ్చిన హైకోర్టు
నచ్చిన ఆహారాన్ని తినడం, ఆహార పదార్థాల వ్యాపారాన్ని చేపట్టడం జీవన హక్కులో భాగమేనని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ కబేళాలు, మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి హైకోర్టు ఈ విషయంలో సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు పదిరోజుల సమయాన్ని ఇచ్చింది. అక్రమ కబేళాలు, మాసం దుకాణాలపై అణచివేత కారణంగా ప్రజల ఆహార అలవాట్లు, ఉపాధి హక్కులు దెబ్బతినకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించి.. పది రోజుల్లో తమకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని వివిధ రకాల ఆహార అలవాట్లు ప్రజల జీవనవిధానంలో భాగంగా ఉన్నాయని, రాష్ట్ర లౌకిక సంస్కృతిలో ఇవి ముఖ్యభాగమని హైకోర్టు లక్నో ధర్మాసనం విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. తన మాంసం దుకాణం లైసెన్స్ను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక వ్యాపారి హైకోర్టును ఆశ్రయించారు. మాంసం దుకాణానికి లైసెన్సులు ఇవ్వడంలో యూపీ ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల తాను వ్యాపారం నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. యూపీలో యోగి ప్రభుత్వం వచ్చాక.. అక్రమ కబేళాలు, మాంసం దుకాణాలపై ఉక్కుపాదం మోపడంతో ఈ వ్యాపారం పూర్తిగా పడకేసిన సంగతి తెలిసిందే. -
కొలిక్కి వచ్చిన 'మాంసం' గొడవ
ముంబై: మాంసం అమ్మాకాల నిషేధంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కొలిక్కి వచ్చింది. మొదట ఎనిమిది రోజులు అన్నారు.. అది కనుమరుగైంది. తర్వాత దాన్ని నాలుగు రోజులకు కుదించారు. అది కాస్త తాజాగా శుక్రవారం సాయంత్రానికి ఒక్కరోజే చాలు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సాయంత్రం ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఈ సమాచారాన్ని వెల్లడించింది. ముంబైలో ఈనెల 17న మాత్రమే మాంసం అమ్మకాలను నిలిపేయాలని ఆదేశాలు జారీచేసింది. జైనుల పవిత్ర దీంతో మొత్తం నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాంసం అమ్మకాలు నిషేధించినట్లయింది. -
కోళ్లు, మేకలకు ముసలితనం తెలియదు: పూరీ
మాంసం అమ్మకాల నిషేధంపై జరుగుతున్న వివాదంపై టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ విభిన్నంగా స్పందించారు. ''ప్రపంచంలో ఏ కోడీ వృద్ధాప్యం చూడలేదు, ఏ మేకకూ ముసలితనం అంటే ఏంటో తెలియదు'' అని ఆయన కామెంట్ చేశారు. కోళ్లు, మేకలను అవి పూర్తి జీవితం గడపడానికి ముందే అందరూ కోసుకుని తినేస్తున్నారన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏ కోడి వ్రుదాప్యం చూడలేదు . ఏ మేకకు ముసలితనం అంటే ఏంటో తెలియదు . — PURI JAGAN (@purijagan) September 11, 2015 -
'దేశానికి హాని చేయాలనుకుంటోంది'
న్యూఢిల్లీ: గోమాంసం నిషేధంతో భారతదేశానికి, సమాజానికి బీజేపీ హానీ చేయాలనుకుంటుందని మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ ఆరోపించారు. త్వరలో బక్రీద్ రానున్న నేపథ్యంలో ఇలాగే నిషేధం కొనసాగితే విపరీత పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే జైనుల పవిత్ర దినం సందర్భంగా మాంసంపై మహారాష్ట్రలో మాంసం నిషేధించడంపట్ల పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే అటు జమ్మూకాశ్మీర్, హర్యానాతోపాటు పలు రాష్ట్రాల్లో గోమాంసం అమ్మకాల నిషేధం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై పలువర్గాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా సిద్ధిఖీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'త్వరలో బక్రీద్ వస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే సమాజంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి. మాంసంపై నిషేధం విధించి ఒకరిని సంతృప్తి పరచడానికి ఇది సరైన సమయం.. సరైనది కూడా కాదు. ఇది వరకే బీజేపీ తాము మైనారిటీలను సంతృప్తిపరిచే చర్యలకు దిగడం లేదని చెప్పింది. కానీ జైనులు కూడా మైనారిటీలే కదా. అయినా, ఎవరేం తినాలో తినకూడదో అనే అంశాన్ని తెరపైకి తెచ్చి చర్చించుకుంటూ ఒక హాస్య వాతావరణం సృష్టించాం' అని ఆయన అన్నారు. -
'బీజేపీ అంటే.. భారతీయ జంతుపక్ష పార్టీ'
మహారాష్ట్రలో మాంసం విక్రయాల నిషేధంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జంతుపక్ష పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ముంబైలో ఏం చేయాలన్నది కేవలం జైనులు మాత్రమే నిర్ణయించలేరు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. రేపు మరో వర్గానికి చెందిన ప్రజలు తమ పండుగ రోజుల్లో షాపులన్నీ మూసేయాలంటే అప్పుడు మూసేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఓటుబ్యాంకు రాజకీయాల నుంచి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రాజ్ ఠాక్రే మండిపడ్డారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా హిందువులకు జైనులు వ్యతిరేకమనే భావన వస్తోందని ఆయన అన్నారు.