-
భార్యతో కలిసి బైక్పై వెళ్తుండగా.. గాలిపటం గొంతుకు చుట్టుకుని ప్రాణం తీసింది..
భువనేశ్వర్/కటక్: గాలిపటాలు ఎగరేస్తుంటే వచ్చే ఆనందమే వేరు. కానీ ఆ పతంగి పైపైకి పోవాలనే భావనతో కొంతమంది దారానికి మాంజా(గాజు పెంకుల పొడి) పూయడం అనేక సమస్యలకు కారణమవుతోంది. ఇప్పటివరకు మాంజా కాళ్లకు చుట్టుకుని పక్షులు మరణించిన ఉదంతాలు మాత్రమే చూశాం. ప్రస్తుతం మాంజా పూసిన దారం మెడకు చుట్టుకోవడంతో ఓ వ్యక్తి మరణించిన దుర్ఘటన సంచలనం రేకిత్తిస్తోంది. కటక్–చాంద్బాలి జాతీయ రహదారిలోని పీర్ బజారు ప్రాంతంలో సోమవారం ఉదయం కటక్లోని తమ బంధువుల ఇంటికి భార్యతో కలిసి బైక్పై వెళ్తున్న జయంత్ సామల్(31)పీకకు ఓ తెగిన గాలిపటం దారం ఒకటి చుట్టుకుంది. ఒక చేత్తో దాన్ని పక్కకు లాగుతూనే కొంతదూరం వెళ్లారు. ఈ ప్రయత్నంలో పతంగికి ఉన్న దారం అతని గొంతును కోసేసింది. దీంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. అదృష్టవశాత్తు అతడితో పాటు బైక్పై ప్రయాణిస్తున్న భార్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్వల్పంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదం జరిగిన మరుక్షణమే స్థానికులు చొరవ కల్పించుకుని చేరువలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భార్యాభర్తలిద్దరినీ చేర్చారు. ఈ క్రమంలో చికిత్స ప్రారంభించిన వైద్యులు జయంత్ అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జగత్పూర్ ఠాణా పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కటక్ ఎస్సీబీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి మృతదేహం తరలించారు. అనంతరం దుర్ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: (భర్త, కుమార్తెను వదిలి ప్రియుడితో వెళ్లిపోయి.. ఆది పరాశక్తి అవతారంలో..) గాలిపటం దారానికి గాజు పెంకుల పొడి పూస్తున్న దృశ్యం దుకాణానికి వెళ్తుండగా.. పూరీ పట్టణంలో వెలుగుచూసిన మరో గాలిపటం దుర్ఘటనలో ఓ వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానిక బొడొదండొలో మందుల దుకాణానికి వెళ్తుండగా, తెగిన గాలిపటం అతడి మెడ భాగం కోసుకుపోయింది. ఈ ప్రమాదంలో భంజబిహారి పాత్రో తీవ్రంగా గాయపడి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఏడేళ్లలో ముగ్గురు మృతి.. గడిచిన ఏడేళ్లలో ఒక్క కటక్ నగరంలోనే గాలిపటంతో పీక తెగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం, 10 మందికి పైగా గాయాలపాలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతి పురస్కరించుకుని, జరుపుకునే గాలిపటాల పండుగ మరెంతమందిని విషాదంలోకి నెడుతుందోనని సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం మాంజా అమ్మకాలపై నిషేధం విధించినా పలుచోట్ల వాటి అమ్మకాలు జోరుగా సాగుతుండడం గమనార్హం. చదవండి: (Hubli: కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం) మాంజా తయారీ.. సాధారణంగా సంక్రాంతి పండగ దగ్గర పడుతున్న తరుణంలో గాలి పటాల సందడి ప్రారంభమవుతుంది. నింగికెగసి రెపరెపలాడుతూ ఎగిరే గాలి పటాల మధ్య పోటీ కోసం దారం పదును పెడతారు. ఫుడ్ కలర్ కలిపిన బంకలో గాజు పెంకుల పొడిని జోడించిన మిశ్రమం దారపు పోగును బలంగా చేసేందుకు పూస్తారు. ఎండలో ఇది ఆరిన తర్వాత గాలి పటానికి కట్టి ఎగురవేస్తారు. ఈ ప్రక్రియని మాంజాగా పేర్కొంటారు. గాలిలో జరిగే ఈ పోటీలో ఎవరి గాలి పటం తెగితే ఆ అభ్యర్థి ఓడినట్లే. ఇలా తెగిన గాలి పటం గాలిలో తేలియాడుతూ నేలను చేరుకునే క్రమంలో ఆ ప్రాంతంలోని ఎవరికో ఒకరికి తగిలి, ప్రమాదం తెచ్చిపెడుతోంది. సాధారణంగా మెడ ప్రాంతంలో గాలిపటం దారం కోసుకుపోతుండడంతో ప్రాణాలు పోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు.. గాలి పటం తెగడంతో కటక్ ప్రాంతంలో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఐపీసీ 304–ఎ సెక్షన్ కింద జగత్పూర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నయా సడక్, నంది సాహి ప్రాంతాల్లో పూరీ ఘాట్ ఠాణా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విచారకర సంఘటనతో నగర వ్యాప్తంగా ప్రత్యేక దాడులు చేపట్టినట్లు కటక్ నగర డీసీపీ ప్రతీక్ సింఘ్ తెలిపారు. గాలి పటాలు, మాంజా దారం విక్రేతలను పలుచోట్ల అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నగర వ్యాప్తంగా అన్ని ఠాణాల అధికారులు ఈ దాడుల్లో పాల్గొంటుండడం విశేషం. ముఖ్యంగా మాంజా తయారీదారులను గుర్తించి వారిని కఠినంగా శిక్షిస్తారు. గాలి పటాల దుకాణాలపై ముమ్మరంగా దాడులు చేస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు చేపడతున్నట్లు డీసీపీ తెలిపారు. మాంజా దారాల విక్రయం నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. పూరీ సంఘటనపై కేసు నమోదు భువనేశ్వర్/పూరీ: పూరీ బొడొదండొ ప్రాంతంలో జరిగిన గాలిపటం దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ–337, ఐపీసీ–338 సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పూరీ కుంభార్పడా ఠాణా పోలీసులు తెలిపారు. -
బరువును నేను పట్టించుకోను!
బరువు తనను ఏవిధంగానూ బాధించదని అంటున్నారు నటి లక్ష్మిమీనన్. కుంకీ, మంజాపై లాంటి చిన్న చిత్రాల ద్వారా నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ మాలీవుడ్ భామకు ఆ తరువాత విశాల్, కార్తీ, జయంరవి లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం లభించిది. అయినా ఎందుకనో ఈ అమ్మడు పోటీలో వెనక పడిపోయారు. నిజానికి లక్ష్మిమీనన్ నటించిన చిత్రాలు అధికశాతం విజయం సాధించాయి. ఆ మధ్య విశాల్తో లిప్లాక్ సన్నివేశాల్లో నటించి కాస్త కలకలం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ కథకు అవసరం అనిపిస్తే గ్లామర్గా నటించడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు కూడా. అలాగే విజయ్సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రంలో మోడరన్ యువతిగా నటించారు. అయితే ఆ చిత్రంలో కాస్త బరువు పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు అది చాలా ఎఫెక్ట్ అయిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. లక్ష్మిమీనన్ బరువును చూసి ఆమెను ఎంపిక చేయాలనుకున్న దర్శక నిర్మాతలు నటీమణులు మంజిమామోహన్ లాంటి వర్ధమాన నటీమణులపై దృష్టిసారిస్తున్నారట. వారి పారితోషికం కూడా తక్కువ కావడం, వారి ఎదుగుదల కూడా ఇందుకు కారణం అనే ప్రచారం జరుగుతోంది. ఇది నటి లక్ష్మిమీనన్ చెవిని తాకిందట. అయితే ఈ విషయం గురించి ఈ భామ అస్సలు పట్టించుకోవడం లేదట. ప్రస్తుతం ఒక్క చిత్రం కూడా చేతిలో లేని లక్ష్మిమీనన్ ఇప్పుడు అవకాశాల వేటలో పడ్డారు. నటనకు అవకాశం ఉంటే ఇంతకు ముందు వేదాళం చిత్రంలో అజిత్తో కలిసి నటించినట్లు చెల్లెలి పాత్రల్లో కూడా నటించడానికి సిద్ధం అని అంటున్నారని తెలిసింది. అదే విధంగా తనను ఒక ప్రముఖ నటిగా చూడకుండా సాధారణ నాయకిగానే చూడాలని, ఇంతకు ముందు దర్శక నిర్మాతలు అలానే భావించేవారని చెప్పుకొచ్చారు. ఇక బరువెక్కడం వల్ల అవకాశాలు రావన్న చింత తనకు లేదని, తనకు నప్పే పాత్రలయితే దర్శక నిర్మాతలు కచ్చితంగా తనకు అవకాశాలు ఇస్తారనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారీ జాన. -
సస్పెన్స్తో మాంజ
ముగ్గురు బాల నేరస్థుల జీవితాలను తెరపై ఆవిష్కరించిన హిందీ చిత్రం ‘కిల్ దెమ్ యంగ్’. బాలీవుడ్ నాయిక ఈషా డియోల్, అవికాగోర్, కిషన్ ఎస్.ఎస్ ముఖ్యపాత్రల్లో ఈ చిత్రం రూపొందింది. కన్నడంలో ‘ఫుట్పాట్2’గా విడుదలై హిట్టయిన ఈ చిత్రాన్ని ‘మాంజ’ పేరుతో రాజ్కిరణ్ సమర్పణలో గిరిధర్, పద్మజ మామిడిపల్లి తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రం పాటల వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. సీడిని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించి నిర్మాత దామోదర్ ప్రసాద్కు అందించారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ- ‘‘కిషన్ తొమ్మిదో ఏటే ‘ఫుట్పాత్’ అనే సినిమా తీసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించాడు’’ అని గుర్తుచేశారు. ‘‘ఈ చిత్రం ఎమోషనల్, సస్పెన్స్, థ్రిల్లర్. నవంబర్ చివరిలో రిలీజ్’’అని దర్శకుడు కిషన్ చెప్పారు. -
కంటతడి పెట్టా
మంజాపై చిత్ర కథ విన్నప్పుడే కంటతడి పెట్టానని చిత్ర నిర్మాత, దర్శకుడు లింగుసామి చెప్పారు. విమల్, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన చిత్రం మంజాపై. నటుడు రాజ్ కిరణ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం ద్వారా రాఘవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు లింగుసామి సమర్పణలో తిరుపతి బ్రదర్స్ పతాకంపై ఆయన సోదరుడు ఎన్.సుభాష్ చంద్రబోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ ఆరో తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లింగుసామి మాట్లాడుతూ దర్శకుడు రాఘవన్ కథ చెప్పినప్పుడే తాను కంటతడి పెట్టానన్నారు. అంతగా కదిలించిన చిత్ర కథ ఇదన్నారు. తాతా మనవళ్ల ప్రేమానుబంధాలను ఆవిష్కరించిన చిత్రం మంజాపై అని చెప్పారు. తాతగా రాజ్కిరణ్, మనవడిగా విమల్ జీవించారని చెప్పారు. ఈ చిత్రం కచ్చితంగా ఇంతకు ముందు తమ సంస్థ నుంచి వచ్చిన కుంకీ, లక్కుఎన్ 18/9, గోలిసోడా చిత్రాల వరుసలో చేరుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశా రు. ఇది కుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రం అని, దర్శకుడు రాఘవన్ చిత్రాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారని నటుడు రాజ్కిరణ్ తెలిపారు. జీఆర్ వెంకటేశ్, ఎ.నందకుమార్తో సహ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎన్.ఆర్.రఘునందన సంగీతాన్నందించారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement