breaking news
Malls service
-
భారత్లో పెరుగుతున్న ‘ఘోస్ట్ మాల్స్’
దేశంలో రీటెయిల్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. వీధికో షాపింగ్ మాల్ వెలుస్తోంది. అయితే.. అన్ని షాపింగ్ మాల్స్ నిండుగా ఉంటున్నాయా? ఊహూ లేదు. చాలా వాటిల్లో షాపులు పెట్టుకునే స్థలాలుంటున్నాయి కానీ.. ఎవరూ అద్దె/ లీజుకు తీసుకోవడం లేదు. ఫలితంగా దేశంలో ఏటికేడాదీ ఘోస్ట్మాల్స్ పెరిగిపోతున్నాయి!ఘోస్ట్మాల్స్ అంటే ఏమిటని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ ఏ మాల్లోనైనా సగం కంటే ఎక్కువ స్పేస్ మూడేళ్లపాటు ఖాళీగా ఉందంటే దాన్ని ఘోస్ట్మాల్ అంటారు. ప్రస్తుతం భారత్లోని 32 నగరాల్లో మొత్తం 72 మాల్స్ ఈ స్థితికి చేరుకున్నాయని నైట్ఫ్రాంక్ ఇండియా అనే సంస్థ లెక్కకట్టింది. మొత్తం 365 షాపింగ్ సెంటర్స్లో 13.4 కోట్ల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంటే.. కోటీ యాభైఐదు లక్షల చదరపు అడుగులు (15.4 శాతం) ఖాళీగా ఉన్నట్లు ఈ సంస్థ ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2025 – వాల్యూ క్యాప్చర్: అన్లాకింగ్ పొటెన్షియల్’ పేరుతో విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది.నైట్ ఫ్రాంక్ ఇండియా ‘థింక్ ఇండియా, థింక్ రిటైల్ 2025 – వాల్యూ క్యాప్చర్: అన్లాకింగ్ పొటెన్షియల్’ నివేదిక ప్రకారం భారతదేశంలోని రిటైల్ రంగంలో ఖాళీ స్థలాల సమస్య తీవ్రంగా ఉంది. దేశంలోని 32 ప్రధాన నగరాల్లో ఉన్న 365 షాపింగ్ సెంటర్లలో మొత్తం 134 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో 15.4% అంటే 15.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం ఖాళీగా ఉంది.మూడేళ్లుగా మాల్స్ల్లో 40% కంటే ఎక్కువ స్థలాలు ఖాళీగా ఉంటే వాటిని ఘోస్ట్ మాల్స్గా పరిగణిస్తారు. ఈ 74 ఘోస్ట్ మాల్స్లు మొత్తం రిటైల్ స్థలాల్లో 20% ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇవి ప్రధానంగా టైర్-2 నగరాల్లో (ఉదా: నాగ్పూర్, అమృత్సర్, జలంధర్) ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా మైసూరు, వదోదర వంటి నగరాల్లో 2-6% మాత్రమే ఖాళీగా ఉన్నాయి.ఘోస్ట్ మాల్స్కు దారి తీస్తున్న కొన్ని కారణాలు..మాల్స్ల్లో ప్రధానంగా టెనెంట్ మిక్స్, మాల్స్ నాణ్యత ఖాళీ స్థలాలకు కారణంగా ఉంది. చాలా మాల్స్ బలమైన ఆంకర్ టెనెంట్స్ (హైపర్మార్కెట్స్, మల్టిప్లెక్స్లు వంటివి) లేకుండా ప్రారంభమవుతున్నాయి. ఆంకర్ టెనెంట్స్ కస్టమర్లను ఆకర్షించి చిన్న షాపులకు మద్దతు ఇస్తాయి. వీటి లేమి కారణంగా కస్టమర్ ఫుట్ఫాల్ తగ్గుతుంది.గ్రేడ్-సీ మాల్స్లో ఖాళీ 36% వరకు ఉంది. వీటిలో చాలా వరకు డిజైన్, లేఅవుట్ల్లో ఆధునిక అవసరాలకు దూరంగా ఉన్నాయి (ఉదాహరణకు, మురికిపడిన కారిడార్లు, బ్యాడ్ లైటింగ్, అన్ఫ్రెండ్లీ లేఅవుట్లు).కొన్ని నగరాల్లో (ముఖ్యంగా టైర్-2) డిమాండ్కు మించి అధిక స్థలాలు అందుబాటులో ఉండటం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.సైట్ లొకేషన్ సెలక్షన్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్నాయి.ఆన్లైన్ షాపింగ్ఆధునిక కస్టమర్ షాపింగ్ అలవాట్లలో వచ్చిన మార్పు, ప్రత్యేకించి ఈ-కామర్స్ పెరుగుదల, మాల్స్కు తీవ్రమైన సవాలుగా మారింది. భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ మార్కెట్ 2023లో 883 బిలియన్ డాలర్ల నుండి 2025 నాటికి 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్లు అందించే సౌకర్యాల కారణంగా కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్ను ఎంచుకుంటున్నారు. కొవిడ్ తర్వాత గ్లోబల్గా మాల్ విజిటర్లు 42% తగ్గారు. ఇది భారతదేశంలోనూ చిన్న మాల్స్లను తీవ్రంగా ప్రభావితం చేసింది.అద్దెలు, నిర్వహణ ఖర్చులుహై-క్వాలిటీ మాల్ స్థలాలకు డిమాండ్ పెరగడంతో అద్దెలు పెరిగాయి. పాత, తక్కువ నాణ్యత గల మాల్స్ అద్దెలు తగ్గినప్పటికీ, అవి ఆధునిక మాల్స్తో పోటీపడలేకపోతున్నాయి. ఫలితంగా టెనెంట్స్ వాటిని వదిలి వెళ్తున్నారు.పరిష్కారాలు.. భవిష్యత్తు అవకాశాలుఘోస్ట్ మాల్స్గా మారినప్పటికీ ఈ ఖాళీ స్థలాలను అవకాశాలుగా మార్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఖాళీ స్థలాలను కో-వర్కింగ్ స్పేస్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు లేదా హెల్త్ సెంటర్లు వంటి ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. మాల్ డిజైన్, లేఅవుట్, లైటింగ్ను ఆధునీకరించడం ద్వారా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచవచ్చు. మొత్తంగా భారతదేశంలో ఘోస్ట్ మాల్స్ సమస్య రిటైల్ రంగంలో జరుగుతున్న డిజిటల్, భౌతిక మార్పులను ప్రతిబింబిస్తోంది. సరైన వ్యూహాలు, పునరుద్ధరణ ద్వారా ఈ ఖాళీ స్థలాలను తిరిగి ఉత్పాదక ఆస్తులుగా మార్చవచ్చు.ఇదీ చదవండి: జీవిత బీమాపై అపోహలు తగ్గాలి -
మాల్స్ అద్దె ఆదాయంలో వృద్ధి
ముంబై: రిటైల్ మాల్ ఆపరేటర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు అధికంగా అద్దె ఆదాయం పొందొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రెంటల్ ఆదాయం, మాల్స్కు విచ్చేసే కస్టమర్ల సంఖ్యలో బలమైన వృద్ధిని ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ మాల్స్ అద్దె ఆదాయం కరోనా ముందు నాటితో పోలిస్తే 27 శాతం పెరగడం గమనార్హం. కస్టమర్ల రాక, విక్రయాల్లో మెరుగైన వృద్ధి కనిపిస్తోందని, ఫలితంగా నికర నిర్వహణ ఆదాయం పెరుగుతుందని ఇక్రా నివేదిక తెలిపింది. ‘‘అద్దె ఆదాయం 2022–23లో 78 శాతం అధికంగా వచ్చింది. కరోనా ముందు నాటితో పోల్చి చూసినా 25–27 శాతం అధికంగా వచ్చింది. రిటైల్ వాణిజ్యం అధికంగా జరగడం, కస్టమర్ల రాక పెరగడం తోడ్పడింది’’అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ అనుపమారెడ్డి తెలిపారు. మాల్స్కు వచ్చే కస్టమర్ల సంఖ్య కరోనా మహమ్మారి పూర్వం ఉన్న స్థాయిలో 95 శాతానికి చేరుకుందని ఇక్రా నివేదిక తెలిపింది ట్రేడింగ్ విలువ 125–127 శాతానికి పుంజుకుంది. ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ప్రీమియం ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి కారణమని అనుపమా రెడ్డి తెలిపారు. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొనసాగుతుందని, ఫలితంగా మెరుగైన ఆదాయం ఆపరేటర్లకు వస్తుందన్నారు. అద్దెల పెంపు 3–4 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్దెల పెంపు 3–4 శాతంగా ఉండొచ్చని ఇక్రా తెలిపింది. రిటైల్ మాల్స్కు వచ్చే కస్టమర్ల సంఖ్య అధికంగా ఉండడడంతో అధిక రేట్లపై రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించింది. జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, ఆహారం, పానీయాలు, వినోదం కోసం కస్టమర్లు ఖర్చు చేసే ధోరణి పెరుగుతుందని.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యం 4–5 శాతం అధికంగా నమోదు కావచ్చని ఇక్రా పేర్కొంది. దీంతో మాల్స్ ఆపరేటర్లకు 8–10 శాతం మేర అధికంగా అద్దెల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. ఈ రంగానికి ఇక్రా స్థిరమైన అవుట్లుక్ ఇచ్చింది. ఆరు మెట్రోల్లో 7 మిలియన్ చదరపు అడుగులు గత ఆర్థిక సంవత్సరంలో అధికంగా సరఫరా అయినట్టు పేర్కొంది. దీంతో మాల్స్లో ఖాళీల రేటు 2022–23లో 19 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖాళీల రేటు 18–19 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కొత్తగా 9–10 మిలియన్ చదరపు అడుగుల సరఫరా ఉండొచ్చని పేర్కొంది. కొత్తగా వచ్చే మాల్స్లో 60 శాతం ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై నుంచే ఉంటాయని వివరించింది. -
పోస్టాఫీసులు ఇక.. సేవామాల్స్
అన్ని సేవలూ ఒకే గొడుగు కింద ఉంటే అందరికీ ప్రయోజనమే. అన్ని రకాల గృహవినియోగ వస్తువులను అందిస్తున్న సూపర్బజార్ల మాదిరిగానే భవిష్యత్తులో పోస్టాఫీసులు అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే సేవామాల్స్గా మారనున్నాయి. ప్రైవేట్ రంగం నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేలా పోస్టాఫీసులను విస్తృతపరిచేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ప్రైవేట్ రంగం కంటే తక్కువ ఫీజలకే నమ్మకంగా సేవలు అందించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లాలో మూడు ప్రధాన పోస్టాఫీసులు, 65 సబ్ పోస్టాఫీసులు, 424 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ శాఖ సేవలపై రాష్ర్టప్రభుత్వం కూడా ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతోంది. ప్రజలకు పలు సేవలను పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇన్నాళ్లూ ఉత్తరాల బట్వాడాయే ప్రధాన బాధ్యతగా పని చేస్తున్న పోస్టాఫీసుల్లో ప్రస్తుతం లభిస్తున్న పరిమిత బ్యాంకు తరహా సేవలతోపాటు పింఛన్లు, వేతనాల పంపిణీ వంటి సేవలు కూడా ప్రారంభమయ్యాయి. వీటిని మరింత విస్తరించే దిశగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన పోస్టల్ శాఖ కీలక సమావేశంలో ఉన్నతాధికారులు చర్చించారు. సంప్రదాయ విధులనే కొనసాగిస్తే ప్రజలకు దూరమై, ఇబ్బందులు తప్పవన్న భావనతో ఉన్న సిబ్బందితోనే ఇంకా ఎటువంటి సేవలు అవసరం, ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తేవడం వంటి అంశాల్లో ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అందుబాటులోకి రానున్న సేవలు ప్రస్తుతం అందిస్తున్న సేవలకు అదనంగా పరిశీలన, కార్యాచరణ దశలో ఉన్న సేవల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైవేట్ కొరియర్ సంస్థల పోటీ తట్టుకునేందుకు స్పీడ్ కొరియర్ సేవలకు పోస్టాఫీసులు సిద్ధమవుతున్నాయి. భవిష్యత్తులో పాస్పోర్ట్ దరఖాస్తుల విక్రయం, స్వీకరణ బాధ్యత చేపట్టవచ్చు. సొంత ఫొటోలతో స్టాంపులు వేయించుకునే మై స్టాంప్ సౌకర్యాన్ని విస్తృతపరచనున్నారు. ప్రస్తుతం మీ-సేవ కేంద్రాలు అందిస్తున్న అన్ని రకాల సేవలను భవిష్యత్తులో పోస్టాఫీసుల్లోనే జరపాలనే ప్రతిపాదన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంది. కొన్ని మీ సేవ సెంటర్లలో ఆర్థిక లావాదేవీల విషయంలో అక్రమాలు జరుగుతుండడంతో అధికారులు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. వినియోగదారుడు పంపిన ఉత్తరం, పార్శిల్, కొరియర్ ఎక్కడ ఉందీ ఇట్టే తెలుసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తేనున్నారు. జీపీఎస్ ద్వారా వాటి ఉనికిని కనుగొని వినియోగదారుడికి అవసరమైన సమయాల్లో ఎస్సెమ్మెస్ల ద్వారా సమాచారం అందిస్తారు. పోస్టు బాక్సులో నిర్ణీత సమయాల్లో పోస్ట్మన్ ఉత్తరాలు తీస్తున్నాడో లేదో తెలుసుకునేందుకు వాటిని జీపీఎస్తో అనుసంధానం చేస్తారు. తద్వారా వినియోగదారుడికి మెరుగైన సేవలందించే అవకాశం ఉంది. గతంలో పోస్టాఫీసుల్లో బీఎస్ఎన్ఎల్ రీచార్జింగ్ కార్డులు విక్రయించేవారు. భవిష్యత్తులో అన్ని మొబైల్ నెట్వర్క్ల కార్డులూ విక్రయించే అవకాశం ఉంది. రిజిస్టర్డ్ పోస్టు సర్వీసుల్ని ప్రజలకు దగ్గరగా చేసేందుకు రుసుములను తగ్గించే అవకాశం ఉంది. ఆధార్, పాన్ కార్డ్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఓటు కార్డు, డ్రైవింగ్ లెసైన్సు, సీ బుక్, రేషన్కార్డుల జారీ, తప్పుల సవరణలు తదితర సేవలు కూడా పోస్టాఫీసుల ద్వారా అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు బ్యాంకుల్లో జరుగుతున్న స్వల్ప, దీర్ఘకాలిక, గృహ, వ్యక్తిగత, వాహన రుణాల మంజూరు ప్రక్రియను పోస్టాఫీసుల ద్వారా కూడా చేయిస్తారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్ఐ) లావాదేవీలను మరింత పెంచనున్నారు. పోస్టల్ సేవలపై నమ్మకం గతంలో పలు లావాదేవీలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసులనే ప్రజలు నమ్ముతున్నారు. పోస్టల్ సేవలను ప్రజలకు దగ్గర చేసేందుకు కేంద్రం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని సేవలు లభ్యమయ్యే అవకాశం ఉంది. సేవల పెంపునకు సంబంధించి ఇటీవల మా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. -జె.ప్రసాదబాబు, తపాలా శాఖ సూపరింటెండెంట్, శ్రీకాకుళం


