breaking news
main problem
-
కంపెనీల్లో జెన్ఏఐ నిపుణుల కొరత..
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ నిపుణల కొరతే పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది. పది జెన్ఏఐ ఉద్యోగాలుంటే నైపుణ్యాలున్న అభ్యర్ధులు ఒక్కరే ఉంటున్నారు. టీమ్లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం నిర్దిష్ట ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్ఎల్ఎం సేఫ్టీ..ట్యూనింగ్, ఏఐ ఆర్కె్రస్టేషన్, ఏజెంట్ డిజైన్, సిమ్యులేషన్ గవర్నెన్స్, ఏఐ కాంప్లయెన్స్, రిస్క్ ఆపరేషన్స్లాంటి ఏఐ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు.. జనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషిన్లెరి్నంగ్ ఆపరేషన్స్లాంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. సీనియర్లకు ఏటా రూ. 58–60 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → డిజిటల్ ఎకానమీలో ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా ఉంది. దానికి తగ్గట్లుగా నైపుణ్యాలున్న అభ్యర్ధులు లభించక, తీవ్ర కొరత నెలకొంది. దీంతో తగిన అర్హతలున్న వారికి కంపెనీలు భారీ వేతనాలిస్తున్నాయి. → జీసీసీల్లో సైబర్సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ ఉద్యోగుల వేతనాలు 2025–2027 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వార్షికంగా వరుసగా రూ. 28 లక్షల నుంచి రూ. 33.5 లక్షలకు, రూ. 23 లక్షల నుంచి రూ. 27 లక్షలకు పెరగనున్నాయి. → నాన్–టెక్ రంగాల్లోని టెక్ ఉద్యోగాలకు సంబంధించి ఐటీ సపోర్ట్, సంప్రదాయ తరహా సిస్టమ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో వేతనాలు వార్షికంగా రూ. 12 లక్షల స్థాయిలోనే స్థిరపడిపోయి ఉన్నాయి. పరిశ్రమ క్లౌడ్ నేటివ్, ఔట్సోర్స్డ్ సరీ్వస్ మోడల్స్ వైపు మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోంది. → ఏఐ మార్కెట్ ప్రస్తుతం హైపర్–గ్రోత్ దశలోకి అడుగుపెడుతోంది. ఏటా 45 శాతం వృద్ధితో 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రతి పది జెన్ఏఐ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన ఇంజినీరు ఒకే ఒక్కరు ఉంటున్నారు. → 2026 నాటికి ఏఐ టాలెంట్ అంతరాలు 53 శాతానికి పెరగనుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్లో డిమాండ్–సరఫరా మధ్య అంతరం 55–60 శాతానికి పెరగనుంది. → ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో పెద్ద స్థాయిలో శిక్షణను కల్పించకుంటే, కంపెనీల వృద్ధి ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. → ఏఐ వినియోగమనేది జాబ్ మార్కెట్ల రూపురేఖలను గణనీయంగా మార్చేయనుంది. గ్లోబల్ విధులు నిర్వహించే 40 శాతం వరకు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐటీ సరీ్వసులు, కస్టమర్ ఎక్స్పీరియన్స్, బీఎఫ్ఎస్ఐ, హెల్త్కేర్లాంటి రంగాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలు ఏఐ–ఫస్ట్ లెర్నింగ్ మోడల్స్, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. → భారత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, నైపుణ్యాల్లో మార్పులకు ఇంజిన్లుగా వ్యవహరిస్తున్న జీసీసీలు, ఉద్యోగాల కల్పనకు సారథ్యం వహిస్తున్నాయి. 2025లో 22–25 శాతం మేర ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అత్యధికంగా కొలువులు ఉండనున్నాయి. → 2027లో అందుబాటులోకి రాబోయే 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాల్లో గణనీయ సంఖ్యలో కొలువులను (12 లక్షలు) జీసీసీలే కల్పించనున్నాయి. ప్రధానంగా జెన్ఏఐ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి. → జీసీసీలు మెట్రో పరిధిని దాటి విస్తరిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,30,000–1,40,000 మంది తాజా గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనున్నాయి. వీరిలో ఎక్కువ శాతం హైరింగ్ ద్వితీయ, తృతీయ శ్రేణి ఇంజినీరింగ్ క్యాంపస్లలో ఉండొచ్చు. వైవిధ్యానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు టాప్ 20 జీసీసీల్లో 40 శాతం మంది సిబ్బంది మహిళలే ఉంటున్నారు. పరిశ్రమ సగటు కన్నా ఇది 1.5 రెట్లు అధికం. → 2027 నాటికి భారత్లో 2,100 పైగా జీసీసీలు ఉంటాయి. వీటిలో 30 లక్షల మంది పైగా ఉంటారు. -
మొవ్వ కుళ్లే ప్రధాన సమస్య
– రబీ సీజన్లో వంగ సాగుపై నిపుణుల సలహాలు - కాయ తొలుచు పురుగు నివారణతో అధిక దిగుబడులు కర్నూలు అగ్రికల్చర్ : వంగను అన్ని కాలాల్లో సాగు చేసేందుకు అవకాశం ఉన్నా రబీ సీజన్ అనుకూలంగా ఉంటుంది. యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంచుకుని శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. దీనికితోడు రబీ సీజన్లో కూరగాయల కొరత ఉంటుంది. చీడపీడీల సమస్య అంతగా ఉండదు. నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుంది. దీంతో వంగ సాగుకు రబీ సీజన్ అనుకూలంగా ఉంటుంది. బోర్లు, బావులు, ఇతర సాగు నీటి పారుదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే రైతులు వంగ సాగుకు సిద్ధమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రబీ వంగ సాగులో యాజమాన్య పద్ధతులపై కర్నూలు ఏరువాక కేంద్రం(డాట్ సెంటరు) శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్ సుజాతమ్మ వివరించారు. అదను, అనువైన రకాలు.. వంగ సాగుకు ఈ నెల 1వ తేది నుంచి నవంబర్ చివరి వరకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే నారు పోసుకుని ఉంటే ఇప్పుడు నాట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు నారు పోసుకుంటే నారు పోసిన 25 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. సూటి రకాలైతే ఎకరాకు 260 గ్రాములు, సంకరజాతి రకాలైతే 160 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. దేశివాలీ పచ్చరకాలు లేదా దేశివాలి చారల రకాలు అనుకూలం. మహికో హైబ్రిడ్ -9, మహికో - 56, గ్రీన్లాంగ్, గ్రీన్బంచ్ రకాలు జిల్లాకు అనుకూలంగా ఉంటాయి. నాటుకునే విధానం.. వంగను 60 60 సెంటీ మీటర్లు లేదా 75“50 సెంటీ మీటర్ల దూరం పాటించి నాటుకోవాలి. ఎకరాకు 200 కిలోల వేప పిండిని చివరి దుక్కిలో వేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వేప పిండికి అదనంగా ఎకరాకు 6 కిలోల బ్లీచింగ్ పౌడరు వేసుకోవాలి. రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల కార్బో ప్యూరాన్ గుళికలను నాటే ముందు వేసుకోవాలి. ఎకరాకు 6 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. రసాయన ఎరువులు... వంగసాగులో పశువుల ఎరువుతో పాటు రసాయన ఎరువులు కూడా అవసరం. 40 కిలోల నత్రజనితోపాటు 24 కిలోల ప్రకారం భాస్వరం, పొటాష్ వేసుకోవాలి. నత్రజనిని మూడు విడతలుగా 30వ రోజు, 60వ రోజు, 75వ రోజు పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలైతే 50 శాతం అధికంగా వేసుకోవాల్సి ఉంటుంది. డ్రిప్ పద్ధతి అనుకూలం.. వంగ పంట సాగులో డ్రిప్ పద్ధతి పాటించడం ఉత్తమం. రబీలో నీటి కొరత ఉంటున్నందునా డ్రిప్ వినియోగించుకుంటే నీటి ఆదాతో పాటు ఎరువులు కూడా సద్వినియోగమవుతాయి. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీపై ఏపీఎంఐపీ అధికారులు డ్రిప్ సౌకర్యం కల్పిస్తారు. వివరాలకు కలెక్టరేట్లోని ఏపీఎంఐపీ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఇటీవల పెద్ద రైతులకు సైతం సబ్సిడీపై డ్రిప్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొవ్వ, కాయతొలుచు పురుగు.... వంగలో ప్రధానంగా మొవ్వ, కాయ తొలుచు పురుగు సమస్య ప్రధానంగా ఉంటుంది. 30–40 రోజుల దశలో ఇది వ్యాప్తి చెందే పరిస్థితి ఉంది. మొవ్వ, కాయ తొలుచు పురుగులు పంటకు తీవ్ర నష్టం కల్గిస్తాయి. దీనివల్ల కాయలు, కొమ్మలు, వంకర్లు పోతాయి. కొమ్మల చివరి భాగాన పెరుగుదల ఆగిపోతుంది. ఈ సమస్యను రైతులు సకాలంలో గుర్తించి నివారించుకుంటే దిగుబడి అధికంగా పొందే అవకాశం ఉంది. పురుగు ఆశించిన కొమ్మలను తెంచి నాశనం చేయాలి. నివారణకు 2మి.లీ. ప్రొఫినోపాస్/ మి.లీ. సైపర్ మెత్రిన్ను లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి. ఎర్రనల్లి... బెట్ట వాతావరణ పరిస్థితుల్లో వంగకు ఎర్రనల్లి వ్యాపించే అవకాశం ఉంది. ఇది ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఎర్రటి మచ్చలు వస్తాయి. ఇందువల్ల చెట్టు ఎదగదు. గిడసబారిపోతుంది. కాయలు రావు. వచ్చినా నాణ్యత ఉండదు. నివారణకు 3 మి.లీ. డైకోపాల్/ 10 గ్రాముల నీటిలో కరిగే గంధకాన్ని లీటరు నీటిలో కలిపి ఎకరాలకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారి చేయాలి. పచ్చదోమ, తెల్లదోమ... వంగలో పచ్చదోమ, తెల్లదోమ కూడా ప్రబలే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. క్లోరో ఫైరిపాస్/ మోనోకోటోపాస్తోపాటు 5మి.లీ. వేపనూనెను లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారి చేయాలి. పిండినల్లి... వంగకు నష్టం కలిగించే వాటిలో పిండినల్లి కూడా ఒకటి. ఈ రకం పురుగులు లేత గులాబి రంగులో ఉండి వాటిపై తెల్లటి పిండి మాదిరిగా ఉంటుంది. పిల్ల పురుగులు కాండం మొదలు దగ్గర ఉండి మొక్కలు మొత్తానికి పాకి నష్టం కలిగిస్తాయి. వీటి ప్రభావంతో చెట్లు ఎండిపోయే పరిస్తితి వస్తుంది. నివారణకు మి.లీ. డైక్లోరోఫాస్/2మి.లీ. పాస్పోమిథాన్/ 2మి.లీ. ప్రొఫినోపాస్ను లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి. ఇతర వివరాలకు ఫోన్(99896 23810)లో సంప్రదించవచ్చు.